ప్రీపెయిడ్ మీటర్ అమలు సాధ్యమేనా!
విద్యుత్తు సంస్థ కలల ప్రాజెక్టు ప్రీపెయిడ్ మీటర్లు.. అయిదేళ్ల కిందట నమూనా ప్రాజెక్టు కింద ప్రభుత్వ కార్యాలయాలకు బిగించినా ప్రస్తుతం సాధారణ మీటర్లకు మాదిరిగా ఉపయోగిస్తున్నారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించి
అయిదేళ్లుగా అలంకారప్రాయం
భగత్నగర్, న్యూస్టుడే: విద్యుత్తు సంస్థ కలల ప్రాజెక్టు ప్రీపెయిడ్ మీటర్లు.. అయిదేళ్ల కిందట నమూనా ప్రాజెక్టు కింద ప్రభుత్వ కార్యాలయాలకు బిగించినా ప్రస్తుతం సాధారణ మీటర్లకు మాదిరిగా ఉపయోగిస్తున్నారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించి వాటిని వినియోగంలోకి తీసుకురావడానికి సంస్థ దృష్టి సారించడం లేదు. ఫలితంగా కలల ప్రాజెక్టు అటకెక్కింది.
ప్రస్తుత విధానంలో ఇబ్బందులు..
ప్రస్తుతం విద్యుత్తు వాడుకున్న తరువాతే బిల్లు చెల్లిస్తున్నాం. మీటర్ రీడింగ్ కార్మికులు ఇంటింటికి తిరిగి నమోదు చేస్తున్నారు. బిల్లుల నమోదు సమయంలో కార్మికుడు ఆలస్యంగా లేదా సమయానికి ముందే రీడింగ్ తీయడం వల్ల యూనిట్లు తేడా వస్తోందంటూ కొన్నిచోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి విద్యుత్తు అధికారులు 30రోజుల సరాసరితో లెక్కిస్తున్నామంటూ సంజాయిషీ ఇస్తున్నా వినియోగదారులు సంతృప్తిచెందడం లేదు. బిల్లు వచ్చిన నాటి నుంచి వినియోగదారులకు సుమారు 15రోజుల వరకు చెల్లించే అవకాశం చిక్కుతోంది. చెల్లించే సమయం ఎక్కువగా ఉండటంతో సంస్థకు నిధులు సకాలంలో జమకావడం లేదు. దీనికితోడు ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్తు బకాయిలు రూ.కోట్లకు చేరుకున్నాయి. వీటిని చెల్లించడానికి ప్రభుత్వ అధికారులు మొగ్గుచూపడం లేదు. గుదిబండగా మారిన ప్రభుత్వ బకాయిల వసూలు సంగతి పక్కన పెట్టి కొత్తగా వాడుకున్న విద్యుత్తు బిల్లులను ఎప్పటికప్పుడు వసూలు చేయాలన్న లక్ష్యంతో విద్యుత్తు సంస్థ నమూనా ప్రాజెక్టు కింద కరీంనగర్లోని కలెక్టరేట్లో 27 శాఖలకు ప్రీ పెయిడ్ మీటర్లను బిగించారు. ఇప్పటి వరకు బాగానే ఉన్న వీటి ఆచరణలో పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయి.
సమస్యలు ఇవీ..
కలెక్టరేట్లోని కార్యాలయాలకు బిగించిన ప్రీ పెయిడ్ మీటర్లు వాటి సామర్థ్యం(సాంక్షన్ లోడ్) పరిమితి దాటగానే ఆటోమెటిక్గా విద్యుత్తు సరఫరాను నిలిపివేసేవి. కనెక్షన్ తీసుకునే సమయంలో విద్యుత్తు సంస్థ అనుమతించిన లేదా కనెక్షన్ దారుడు కోరుకున్న లోడ్ ఎంతఉందో అంతమేరకే విద్యుత్తు వినియోగం జరగ్గానే సరఫరా నిలిచిపోయేది. కలెక్టరేట్లోని కార్యాలయాలకు అర్ధాంతరంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయి, కార్యాలయ పనులకు ఆటంకం కలిగింది. ఈ విషయం విద్యుత్తు అధికారుల దృష్టికి తీసుకురావడంతో వారు సమస్యను అధిగమించాలంటే లోడ్ను పెంచాలంటూ నోటీసులు జారీచేశారు. దానికి అనుగుణంగా అదనపు ఛార్జీలను ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాయి. అయినా ఆచరణలోకి మీటర్లు రాలేదు.
* విద్యుత్తు సంస్థ కలెక్టరేట్లో స్మార్ట్ మీటర్లు బిగించిన వాటికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడంలో విఫలమయింది. సిబ్బందికి ఈ మీటర్లపై శిక్షణ ఇవ్వలేదు. ప్రీ పెయిడ్ కార్డులు విక్రయించడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లో విద్యుత్తు బిల్లులు చెల్లించే సదుపాయం రావడంతో ప్రీ పెయిడ్ కార్డుల సమస్య ఉండకపోవచ్చు. ఇప్పటికైనా విద్యుత్తు సంస్థ ఈ మీటర్లపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది.
* స్మార్ట్ మీటర్ల ధర ఎక్కువ మొత్తంలో ఉండటం ఒక సమస్యగా మారింది. ఇంటి మీటర్ కాలిపోతే రూ.1250 చెల్లిస్తే కొత్త మీటర్ ఇస్తున్నారు. ఇదే స్మార్ట్ మీటర్ కాలిపోతే సుమారు రూ.6వేలు చెల్లించాల్సి ఉంటుందని విద్యుత్తు రంగ నిపుణులు అంటున్నారు. కుటీర పరిశ్రమలు వాడే సీటీ మీటర్ కాలిపోతే రూ.15వేలు వెచ్చించాలి. ఇంత భారీ మొత్తం వినియోగదారులు చెల్లించేందుకు ఇష్టపడకపోవచ్చు. స్థోమతలేని పేద, మధ్య తరగతి వినియోగదారులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. దీంతో ప్రీ పెయిడ్ మీటర్లు ఆచరణ సాధ్యం కావడం లేదు.
* ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటుకోసం విద్యుత్తు సంస్థ భారీ మొత్తంలో ఖర్చుచేసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం 2023 నాటికి ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాల్సిందేనంటోంది. ఈ నేపథ్యంలో ఈ మీటర్లలోని లోపాలను, ఇబ్బందులను అధిగమిస్తే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతుంది. ఇదే సమయంలో ప్రభుత్వ కార్యాలయాల బకాయి భారం తగ్గుముఖం పడుతుంది. విద్యుత్తు బిల్లులు చెల్లించకుండా ఎగవేతదారులకు ఉన్నఫలంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోతూ మొండిబకాయి దారుల మెడలు వంచే అవకాశం చిక్కుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?