వానాకాలం.. అప్రమత్తం
నగరపాలక ఆధ్వర్యంలో అత్యవసర సేవలు
న్యూస్టుడే, కరీంనగర్ కార్పొరేషన్
వరదనీటిని మురుగుకాల్వల్లోకి పంపిస్తున్న కార్మికులు
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు ప్రారంభించారు. ఎలాంటి విపత్తు అయినా ఎదుర్కోవడానికి వీలుగా ప్రత్యేకంగా రెస్క్యూ బృందాలు ఏర్పాటు చేశారు. రాత్రిపూట వర్షం పడితే రహదారులు జలమయమవుతున్నాయి. గంటల తరబడి వరదనీరు నిలిచి ఉండటం, డ్రైనేజీలో చెత్తా చెదారం పేరుకుపోవడంతో నీరంతా రోడ్లపై ఉంటుంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఉధ్రృతంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లు నీట మునుగుతున్నాయి. సెలవు రోజుల్లో, రాత్రి కార్మికులు అందుబాటులో ఉండకపోవడం, సమస్యలు ఎదురవుతుండటంతో రెండేళ్ల కిందట అత్యవసర సేవలు అందించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు.
కాలనీలో ఇళ్ల మధ్యన నిలిచిన నీటిని మోటార్లు పెట్టి తోడుతున్న సిబ్బంది
వర్షం పడితే చాలు వీధుల్లోకి
వర్షం పడితే చాలు అత్యవసర బృందాలు రంగంలోకి దిగుతాయి. కాలనీల్లోకి వరదనీరు చేరినా, నాలాలు మూసుకుపోయినా వెంటనే తొలగిస్తారు. గుంతలు పడితే అక్కడ తాత్కాలిక చర్యలు తీసుకుంటారు. రహదారులపై చెట్లు పడిపోతే కట్టర్ ద్వారా కత్తిరించి పక్కకు జరిపిస్తారు. ఎక్కడైన వరదనీటిలో ఇళ్లు మునిగితే మోటార్లు పెట్టి నీటిని ఖాళీ చేయిస్తారు. పాత గోడలు పడిపోతే వెంటనే శిథిలాలు తొలగించేలా చర్యలు తీసుకుంటారు.
మూడు షిఫ్టులు 60మంది సిబ్బంది
నగరంలోని 60డివిజన్లు ఉండగా మూడు షిఫ్టులలో 24గంటలు పని చేసేలా 60మంది కార్మికులు, ఏడు ట్రాక్టర్లు, నోడల్ అధికారులు, పర్యవేక్షకులు అందుబాటులో ఉంటారు. వీరితో పాటు డీఆర్ఎఫ్ వ్యాను, కారు ఒక షిఫ్టునకు 20మంది కార్మికులు, విద్యుత్తు, నీటి విభాగం సిబ్బంది, రెండు ట్రాక్టర్లు పని చేసేందుకు సిద్ధంగా ఉంచారు.
పర్యవేక్షణతో సమస్యలు దూరం
వర్షాకాలంలో అత్యవసర సేవలందించేందుకు వీలుగా ప్రత్యేకంగా అధికారులు, కార్మికులను నియమించారు. వీరంతా ఈ నెల 24 నుంచి నవంబర్ 30 వరకు విధులు నిర్వర్తించనున్నారు. నగర మేయర్ వై.సునీల్రావు ఆదేశాల మేరకు కమిషనర్ సేవా ఇస్లావత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం అధికారులు, కార్మికులు చిత్తశుద్ధితో పని చేయాల్సిన అవసరముంది. గతేడాది అధికారులు అందుబాటులో ఉండకపోవడం, వాహనాలు సమకూర్చకపోవడం, కావాల్సిన పనిముట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. మూడు షిఫ్టులలో ఉండే సిబ్బంది, కార్మికులు, అధికారులు అప్రమత్తంగా ఉండేలా నిరంతరం ఉన్నతాధికారులు పరిశీలించాలి. రాత్రిపూట కేటాయించిన బృందం నగరపాలక కార్యాలయంలోనే ఉండి ఎక్కడైన సమస్య వస్తే వెంటనే చేరుకునే విధంగా సిద్ధంగా ఉండాల్సిన అవసరముంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట: ఈవో
-
Movies News
#NBK108: బాలయ్య - అనిల్ రావిపూడి కాంబో.. ఇంట్రో బీజీఎం అదిరిందిగా!
-
Movies News
ఆ సినిమా చూశాక నన్నెవరూ పెళ్లి చేసుకోరని అమ్మ కంగారు పడింది: ‘MCA’ నటుడు
-
India News
CJI: ప్లీజ్.. మాస్కులు పెట్టుకోండి.. లాయర్లకు సీజేఐ సూచన
-
Crime News
Crime News: కోడలి తల నరికి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన అత్త
-
Politics News
Tejashwi Yadav: దేశానికి ఏం అవసరమో.. బిహార్ అదే చేసింది: తేజస్వీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
- Vishal: షూటింగ్లో ప్రమాదం.. నటుడు విశాల్కు తీవ్ర గాయాలు
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- Hanumakonda: రైలెక్కించి పంపారు.. కాగితాల్లో చంపారు
- Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
- Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?
- సెక్స్ కోరే అమ్మాయిలు వేశ్యలతో సమానం: నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు
- IT Raids: వ్యాపారి ఇళ్లల్లో నోట్ల గుట్టలు.. లెక్కించడానికే 13 గంటలు!
- Rohit sharma: ఈ ప్లాన్తోనే భారత క్రికెట్కు మంచి భవిష్యత్ను అందిస్తాం: రోహిత్ శర్మ
- Lal Singh Chaddha: రివ్యూ: లాల్ సింగ్ చడ్డా