సిబ్బంది లేక అంగన్వాడీల్లో ఇబ్బంది
వీర్నపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రం ఇది. దీనిని మంజూరైన భవనం ఆరేళ్ల క్రితం నిలిచిపోయింది. దీంతో ఉన్నత పాఠశాల గదుల్లో నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రానికి 25 మంది పైగా చిన్నారులు
వీర్నపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రం ఇది. దీనిని మంజూరైన భవనం ఆరేళ్ల క్రితం నిలిచిపోయింది. దీంతో ఉన్నత పాఠశాల గదుల్లో నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రానికి 25 మంది పైగా చిన్నారులు రోజూ వస్తుంటారు. ఆయా అనారోగ్యంతో మూడేళ్ల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి ఉపాధ్యాయురాలు కేంద్రాన్ని నెట్టుకొస్తుంది. భర్త వంట చేస్తే ఆమె చిన్నారుల ఆలనా చూసుకుంటూ గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందిస్తుంది. మధ్యాహ్నం పూట పిల్లలకు అన్నం తినిపించేందుకు తల్లుల సహకారం తీసుకొంటుంది. ఇక్కడ ఆయాని నియమిస్తే అంగన్వాడీ ఉపాధ్యాయురాలు సమావేశాలకు వెళ్లిన సమయంలో కేంద్రం మూతపడకుండా ఉంటుంది. చిన్నారులను పర్యవేక్షించడం సులువవుతుంది.
న్యూస్టుడే, వీర్నపల్లి: గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలలో పోషకాహార లోపాన్ని అధిగమించాలనే సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాలను నడిపిస్తున్నారు. కేంద్రాల్లో అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆయాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందజేయడంతోపాటు విద్యను నేర్పిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు సైతం మెనూ ప్రకారం భోజనంతోపాటు గుడ్డు, పాలు, బాలామృతం, చిరుతిండికి సంబంధించిన ఆహారాన్ని ప్రభుత్వమే సమకూర్చుతోంది. ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ అంగన్వాడీ కేంద్రాల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానాలను ఇప్పటికీ భర్తీ చేయకపోవడంతో జిల్లాలోని పలు కేంద్రాల్లో చిన్నారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
జిల్లాలో రెండు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 587 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటి ద్వారా ఐదేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారం ఇవ్వడంతోపాటు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు కలిపి 1,174 మంది పని చేయాల్సి ఉంది. కానీ వివిధ కారణాలతో ఖాళీ అయిన పోస్టులను ఇప్పటికీ భర్తీ చేయకపోవడంతో కేంద్రాల ద్వారా సేవలు అందించడంలో కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 60 మంది ఆయాలు, 12 మంది అంగన్వాడీ కార్యకర్తలను జిల్లాలో భర్తీ చేయాల్సి ఉంది. దీనికి తోడు వయోపరిమితి పూర్తి చేసుకున్న కార్యకర్తలు, ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందితే ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసి దరఖాస్తులు స్వీకరించి తరవాత ప్రక్రియను నిలిపివేశారు. కొత్త నిబంధనలు జారీ చేసి మరోసారి భర్తీకి ప్రకటన జారీ చేస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వేలు, అవగాహన కార్యక్రమాలు జరిగినప్పుడు చిన్నారులను పర్యవేక్షించాల్సిన ఆయాలు లేనిచోట కేంద్రాలు మూతపడుతున్నాయి. ఈ సమయంలో చిన్నారులకు ఆహారాన్ని అందించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాగే కార్యకర్తలు లేని పాఠశాలల్లో పిల్లలకు అక్షరాలు దిద్దించడం కష్టతరమవుతుంది. ఇద్దరి విధులు ఒక్కరే నిర్వర్తించడంతో అనుకున్న మేర లక్ష్యం నెరవేరడం లేదని స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
భర్తీ ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసింది
- లక్ష్మీరాజం, జిల్లా సంక్షేమాధికారి
కేంద్రాల్లో సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్న మాట వాస్తవమే. జిల్లాలో 72 ఖాళీలు ఉన్నాయి. అందులో 60 మంది ఆయాలు, 12 మంది అంగన్వాడీ టీచర్లను నియమించాల్సి ఉంది. గతంలో వెలువడ్డ ప్రకటన ప్రక్రియను ప్రభుత్వమే నిలిపివేసింది. కొత్త నిబంధనలు, విద్యార్హతలు, చిన్నారుల పర్యవేక్షణపై నైపుణ్యం ఉన్న వారిని ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే భర్తీ చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పత్తి రైతులు, వ్యాపారుల ఆందోళన
[ 23-04-2024]
ఎన్నికల కోడ్ పేరుతో తనిఖీలు నిర్వహించి బ్యాంకుల నుంచి డబ్బును తీసుకొస్తున్న తమను ఇబ్బందులకు గురి చేయవద్దని జమ్మికుంట పత్తి మార్కెట్ వద్ద వ్యాపారులు, పత్తి రైతులు ఆందోళనకు దిగారు. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
[ 23-04-2024]
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
పిల్లల అల్లరిని దారి మళ్లించండి
[ 23-04-2024]
పది నెలలపాటు చదువుతో కుస్తీ పడిన పిల్లలకు వేసవి సెలవులు ఉపశమనం ఇస్తాయి. ఆటాపాటలతో సరదాగా గడపొచ్చని భావిస్తుంటారు. -
మోదీ వ్యాఖ్యల్లో ఓటమి భయం
[ 23-04-2024]
లోక్సభ మొదటి దశ ఎన్నికల తీరును చూసిన ప్రధాని మోదీ ఓటమి భయంతో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తుందని వ్యాఖ్యానించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. -
నాలుగో రోజు 25 నామినేషన్లు
[ 23-04-2024]
నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు సోమవారం కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. -
హామీలను విస్మరించిన ప్రభుత్వం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని కరీంనగర్ భారాస అభ్యర్థి వినోద్కుమార్ అన్నారు. -
సెప్టెంబరులో చక్కెర కర్మాగారం తెరిపిస్తాం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా!
[ 23-04-2024]
ప్రాంతానికి కొత్త కావచ్చు, రాజకీయాలకు, ప్రజా సేవకు కొత్తకాదని, అవకాశమిస్తే పార్లమెంట్ పరిధిని అభివృద్ధి చేసి చూపిస్తానని నిజామాబాద్ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. -
దారులన్నీ కొండగట్టుకే
[ 23-04-2024]
తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి దీక్షాపరులు తరలివస్తున్నారు. -
ఓటరు నమోదులో ఫలించిన చైతన్యం
[ 23-04-2024]
ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కు నమోదుకు యువతలో నూతనోత్సాహం ఉరకలేసింది. -
ప్రత్యేక నిధులు.. తీరనున్న ఇక్కట్లు
[ 23-04-2024]
రామగుండం నగరపాలక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అమృత్-2.0, యు.ఐ.డి.ఎఫ్.(అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్) నిధులతో పరిష్కారం కానున్నాయి. -
కాంగ్రెస్ నైజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 23-04-2024]
భారాస పాలనలోనే అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకున్నారని, గడిచిన నాలుగు నెలల కాలంలో సంక్షేమ పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్ పాలకుల నైజాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పెద్దపల్లి లోక్సభ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. -
లెక్కలు తేలేనా?
[ 23-04-2024]
జిల్లా వస్త్ర పరిశ్రమకు గత ప్రభుత్వం సంక్షేమ, పాఠశాల విద్యాశాఖలకు సంబంధించిన వస్త్రోత్పత్తుల ఆర్డర్లు ఇచ్చింది. -
నిధులున్నా ప్రారంభం కాని పనులు
[ 23-04-2024]
గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగుపరిచి రెండు జిల్లాల గ్రామాలను అనుసంధానం చేయాలనే లక్ష్యంతో తారు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
అమాత్యులుగా ఆ నలుగురు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి లోక్సభా నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎంపీల్లో ఇప్పటివరకు నలుగురికి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM