గడువులతోనే రెండేళ్లు పూర్తి
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఆయకట్టు పెంచే అదనపు టీఎంసీ కాలువ పనులకు ఆటంకాలు తప్పడం లేదు. జిల్లాలో రాజరాజేశ్వర జలాశయం నుంచి అన్నపూర్ణ వరకు చేపట్టిన పనులు ఈ నెలాఖరులోగా పూర్తి కావాల్సి ఉంది. 2019లోనే టెండర్ల ప్రక్రియ
మందకొడిగా అదనపు టీఎంసీ కాలువ పనులు
ఇప్పటికి పూర్తయింది 35 శాతమే
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల
పైపులైను పనులు
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఆయకట్టు పెంచే అదనపు టీఎంసీ కాలువ పనులకు ఆటంకాలు తప్పడం లేదు. జిల్లాలో రాజరాజేశ్వర జలాశయం నుంచి అన్నపూర్ణ వరకు చేపట్టిన పనులు ఈ నెలాఖరులోగా పూర్తి కావాల్సి ఉంది. 2019లోనే టెండర్ల ప్రక్రియ ముగిసింది. 2020 జూన్తో గడువు ముగిసింది. దీనిని 2021 వరకు పొడిగించారు. అయినా ఇప్పటికీ 35 శాతం మాత్రమే పనులు జరిగాయి. పనుల ప్రగతికి భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ పనులు పూర్తయితే ప్రస్తుతం రాజరాజేశ్వర నుంచి కొండపోచమ్మకు నీటి తరలింపు రెండు టీఎంసీలకు చేరుతుంది. దీని ద్వారా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్ జిల్లాలో ఆయకట్టు పరిధిలోకి మరింత సాగుభూమి వస్తుంది.
కాళేశ్వరం నుంచి తొలుత రోజుకు రెండు టీఎంసీల నీటిని తరలించేలా పనులు చేపట్టారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు మూడో టీఎంసీ పనులు ఏడాది క్రితమే పూర్తయ్యాయి. మోటార్ల ట్రయల్రన్ కూడా జరిగింది. నందిమేడారం, గాయిత్రి పంపుహౌజ్ల్లో పనులు చివరి దశలో ఉన్నాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాల్వలు, పైపులైన్లు, పంపుహౌజ్ పద్ధతిలో జరగాలి. ఇది భూసేకరణకు అడ్డంకిగా మారింది. కరీంనగర్ జిల్లాలో భూసేకరణ దాదాపు పూర్తయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బోయినపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో నిర్వాసితుల నిరసనలు కొనసాగుతున్నాయి. పరిహారంపై అసంతృప్తి, సర్వేలో తప్పులు దొర్లాయని తిరిగి సర్వే చేసి పరిహారం చెల్లించాకే పనులు చేయాలని అడ్డుకుంటున్నారు. రాజరాజేశ్వర జలాశయం నుంచి అన్నపూర్ణ వరకు 538 ఎకరాలకు గాను 90 శాతానికి పైగా సేకరించారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచలోని జలాశయం నుంచి కాల్వ తవ్వకంలో కీలకమైన 65 ఎకరాలు మూడేళ్లుగా కొలిక్కి రావడం లేదు. పరిహారంపై అసంతృప్తితో ఉన్న రైతులు ఇటీవలే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
వెల్జిపూర్ వద్ద పంపుహౌజ్ పనులు
భూసేకరణ ఆటంకంగా మారింది
- శ్రీనివాస్, పదో ప్యాకేజీ డీఈ
జలాశయం నుంచి ప్రధాన కాల్వ తవ్వకానికి భూసేకరణ ఆటంకంగా మారింది. దీని ప్రభావం ఇతర పనులపైనా చూపుతోంది. గడువు పొడిగింపుపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
పనులు జరిగేది ఇలా...
రాజరాజేశ్వర నుంచి కొండపోచమ్మకు ప్రస్తుతం ఒక టీఎంసీ నీటిని మాత్రమే తరలిస్తున్నారు. అదనపు టీఎంసీని తరలించేందుకు రాజరాజేశ్వర, అన్నపూర్ణ మధ్య రూ.3,352.17 కోట్లతో పనులు చేస్తున్నారు. ఇవి 2019లోనే ప్రారంభమయ్యాయి. రాజరాజేశ్వర నుంచి 5.8 కిలోమీటర్ల కాల్వ ద్వారా ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్లోని పంపుహౌజ్కు తరలిస్తారు. పంపుహౌజ్లోని నాలుగు పంపులు ఒక్కొక్కటీ 125 మెగావాట్ల సామర్థ్యంతో ఉంటుంది. ఇవి ఏడాదిలో 120 రోజుల్లో 120 టీఎంసీల నీటిని 16 కిలోమీటర్ల పైపులైను ద్వారా అన్నపూర్ణలోకి తరలిస్తాయి. అక్కడి నుంచి 11, 12 ప్యాకేజీల ద్వారా రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మకు తరలిస్తారు. జిల్లా పరిధిలో పూర్తిగా కాల్వ, పంపుహౌజ్ తవ్వకం పనులు మాత్రమే ప్రగతిలో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
[ 19-04-2024]
కమాన్పూర్ మండలం రొంపికుంట ఉపకేంద్రం పరిధిలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ట్రాన్స్ కో ఏఈ రాజేంద్ర కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ