నాలాలు.. ఆక్రమణలు
చినుకు పడితే చాలు..ఆ నీరంతా మురుగు కాల్వల గుండానే ప్రవహిస్తుండటంతో నీటి ప్రవాహం పెరిగి వీధులు జలమయం అవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు వరద కాల్వల నిర్మాణ పనులు ప్రారంభించారు. వీటిని ఉన్నది ఉన్నట్లుగా కాకుండా ఆక్రమణలు తొలగించి విస్తరిస్తే ప్రయోజనం ఉంటుంది.
చినుకు పడితే చాలు..ఆ నీరంతా మురుగు కాల్వల గుండానే ప్రవహిస్తుండటంతో నీటి ప్రవాహం పెరిగి వీధులు జలమయం అవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు వరద కాల్వల నిర్మాణ పనులు ప్రారంభించారు. వీటిని ఉన్నది ఉన్నట్లుగా కాకుండా ఆక్రమణలు తొలగించి విస్తరిస్తే ప్రయోజనం ఉంటుంది.
కరీంనగర్ నగరంలో 2001 సంవత్సరంలో అప్పటి జనాభా, అవసరాల మేరకు వరదకాల్వల నిర్మాణ పనులు చేపట్టారు. ఎగువ ప్రాంతాల వచ్చే వరదనీటితో పాటు మురుగు పంపించేందుకు వీటిని నిర్మించారు. నగర వ్యాప్తంగా 35 కిలోమీటర్ల పొడువునా వచ్చే మురుగును నగర శివారు ప్రాంతానికి తరలిస్తున్నారు. ఆ సమయంలో నిర్మించిన వరదకాల్వల పరిస్థితి దారుణంగా మారింది. కొన్ని చోట్ల వంకలు తిరిగి నిర్మించగా, ప్రమాదాలు జరగకుండా వేసిన శ్లాబులను ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. వరద ముంచుకొచ్చే సమయంలో వాటిని తొలగించడానికి వీల్లేకుండా తయారు చేస్తుండటంతో సమస్యలు ఎదురవుతున్నాయి.
స్మార్ట్సిటీలో ...
స్మార్ట్సిటీలో రూ.132.98 కోట్లతో వరదకాల్వలు నిర్మించే పనులు ప్రారంభించారు. ఐదు జోన్ల పరిధిలో 736.3 కిలో మీటర్ల పొడవునా నాలాలు నిర్మించనున్నారు. వీటిని ప్రధాన, అంతర్గత కాల్వలుగా గుర్తించగా ప్రైమరీ, సెకండరీగా ప్రాధాన్యం ఇచ్చారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించారు. దీని ఆధారంగా నిర్మాణ పనులు ప్రారంభించగా వరదకాల్వలు, మురుగు కాల్వలపై ఉన్న ఆక్రమణలు, వంకలు తొలగించి విస్తరిస్తే వరద సాఫీగా ప్రవహించనుంది.
కనిపించని సర్వే
ప్రతీ రెండు, మూడు సంవత్సరాలకు ఒకసారి పట్టణ ప్రణాళిక, రెవెన్యూ అధికారులు కలిసి నాలాల వెంట ఉన్న ఆక్రమణలు, నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న కట్టడాలను గుర్తించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గతేడాది హైదరాబాద్లో ముంపు సమస్య రాగా సర్వే చేయాలని, ఆక్రమణలు తొలగించాలని ఆదేశించినా కరీంనగర్లో మాత్రం అలాంటి సర్వేనే కనిపించలేదు. ఆక్రమిస్తే మార్కింగ్ చేసి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆ వైపే వెళ్లడం లేదు. అంతేకాకుండా కొత్తగా ఇళ్లను నిర్మించుకుంటున్న సమయంలో కూడా పట్టణ ప్రణాళిక అధికారులు తనిఖీలు చేయకపోవడంతో ఇంటి శ్లాబులు కాల్వలపై వస్తున్నాయి.
ఆనుకునే నిర్మాణాలు
ప్రధాన వరదకాల్వలు నగరానికి రెండు వైపులా ఉన్నాయి. జనసముహం, ఇళ్ల మధ్యల్లోంచి వీటిని నిర్మించడంతో కొన్ని ప్రాంతాల్లో మురుగుకాల్వలకు ఆనుకునే నిర్మాణ పనులు చేపట్టారు. గణేశ్నగర్ బైపాసు రోడ్డు, జ్యోతినగర్, అశోక్నగర్, హుస్సేనీపుర, శర్మనగర్, సాయినగర్, ముకరంపుర, సంతోష్నగర్, మంకమ్మతోట, కోతిరాంపూర్లో కాల్వ గోడ పక్కనే నిర్మాణ పనులు పూర్తి చేసుకున్నారు. జ్యోతినగర్లో 15రోజుల కిందట కురిసిన వర్షానికి ఇంటి పునాది నీటిలో కొట్టుకొని పోయింది. కాల్వ మధ్యన కొంత మేర స్థలం వదిలి కట్టుకుంటే వరద తాకిడి సమయంలో నీరు లోపలికి వచ్చే అవకాశముండదు. లేదంటే గోడలకు తడి ఉండి ప్రమాదకరంగా మారే ప్రమాదముంది.
గుర్తించి చర్యలు తీసుకుంటాం : - వై.సునీల్రావు, మేయర్, కరీంనగర్
వరదకాల్వ ప్రహరీలపై ఎలాంటి నిర్మాణాలు కట్టినా తొలగించడం జరుగుతుంది. కొత్తగా నిర్మాణాలు చేసుకునే సమయంలో వెనక్కి జరిగి కట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాంటివి ఏవైనా ఉంటే గుర్తించి చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్