వానాకాలం సాగునీటి ప్రణాళికలు సిద్ధం
కొత్త నీటి సంవత్సరం జూన్ ఒకటి నుంచి ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాకు సాగునీరందించే గోదావరిలో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వానాకాలం పంటలకు నీటి విడుదలకు జలవనరులశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
అన్ని ప్రాజెక్టుల్లో కలిపి నిల్వ ఉన్నది 47.79 టీఎంసీలు
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల
రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ
కొత్త నీటి సంవత్సరం జూన్ ఒకటి నుంచి ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాకు సాగునీరందించే గోదావరిలో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వానాకాలం పంటలకు నీటి విడుదలకు జలవనరులశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మేడిగడ్డ (లక్ష్మి బారేజి)లోకి ఎగువన ప్రాణహిత నుంచి 16 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. సరస్వతి, పార్వతి బారేజీలతోపాటు ఎల్లంపల్లి, ఎగువన శ్రీరాంసాగర్లోకి ఇన్ఫ్లోలేదు. ప్రస్తుతం అన్ని ప్రాజెక్టుల్లో 47.79 టీఎంసీల నీరుంది. గతేడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో అవసరం మేరకు జలాశయాల్లో నీటి నిల్వలు ఉన్నాయి. జిల్లాకు కాళేశ్వరం, ఇటు శ్రీరాంసాగర్లు రెండు వైపులా నీటిని తరలించే అవకాశాలున్నాయి. రాజరాజేశ్వరలో నీటి లభ్యత ఆధారంగా అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్న, కొండపోచమ్మసాగర్లకు నీరు తరలిస్తారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్ ప్రారంభం నుంచి సాధారణ వర్షాలే కురుస్తున్నాయి. కరీంనగర్లో సగటున 60 శాతం, జగిత్యాల, పెద్దపల్లిలో 50 శాతం, సిరిసిల్ల జిల్లాలోని మండలాల్లో 20 శాతం సాధారణ వర్షపాతం నమోదైంది. గతేడాది రాజరాజేశ్వర జలాశయంలోకి కాళేశ్వరం, శ్రీరాంసాగర్, వరదల ద్వారా 84 టీఎంసీల నీరు వచ్చి చేరింది. వీటిలో 60 టీఎంసీలు దిగువ మానేరుకు, 16 టీఎంసీలు కాళేశ్వరం 10, 11, 12 ప్యాకేజీలకు వదలిరారు. 9వ ప్యాకేజీ, అదనపు ఎత్తిపోతల పనులు అసంపూర్తిగా ఉండటంతో ఎగువమానేరులోకి మల్లన్నసాగర్ నుంచి కూడెల్లివాగు ద్వారా నింపారు. 2.2 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎగువమానేరులో ప్రస్తుతం ఒక టీఎంసీ మాత్రమే ఉంది. ప్రస్తుతం జిల్లాలోని 677 చెరువులకు 215 చెరువుల్లో మాత్రమే 50 శాతం మేరకు నీరుంది. గతేడాది వానాకాలం సీజన్కు ముందే జలాశయాలు, చెరువుల్లో నీరు ఆశాజనకంగా ఉంది. జలాశయాల పరిధిలో చాలా వరకు మైనర్ కాల్వల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. చెరువులు, కుంటలను నింపి నీటిని వినియోగిస్తున్నారు.
పెరిగిన ఆయకట్టు పరిధి
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2017-18 వరకు గరిష్ఠ సాగు విస్తీర్ణం 8 లక్షల ఎకరాలకు మించలేదు. 2019 నుంచి జిల్లాల వారీగా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది 13.09 లక్షల ఎకరాలుగా వ్యవసాయశాఖ అంచనా వేసింది. దీనిలో ఈ వానాకాలం 8.68 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుండటం గమనార్హం. ప్రభుత్వం మంగళవారం నుంచి రైతులకు పెట్టుబడి సాయం అందించనుంది. ఇప్పటికే వరినారు మళ్లు సిద్ధం చేసుకున్న రైతులు జులై మొదటి వారం నుంచి నాట్లు ప్రారంభించనున్నారు. ప్రాజెక్టుల వారీగా ప్రస్తుతం సాధారణ నీటి మట్టం కంటే తక్కువగానే ఉంది. వర్షాలు, వరదలతో జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకునే అవకాశం ఉంది. ప్రాజెక్టులు, జలాశయాలకు నీటి విడుదల ప్రణాళికపై జిల్లా జలవనరులశాఖ ఈఈ అమరేందర్రెడ్డిని ‘ఈనాడు’ సంప్రదించగా ప్రాజెక్టుల్లోకి ఈనెల 12 నుంచి నీటి విడుదలకు అవకాశం ఉందన్నారు. ఎగువమానేరు కింద ఆయకట్టుకు జులై రెండో వారంలో నీటిని అందిస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పత్తి రైతులు, వ్యాపారుల ఆందోళన
[ 23-04-2024]
ఎన్నికల కోడ్ పేరుతో తనిఖీలు నిర్వహించి బ్యాంకుల నుంచి డబ్బును తీసుకొస్తున్న తమను ఇబ్బందులకు గురి చేయవద్దని జమ్మికుంట పత్తి మార్కెట్ వద్ద వ్యాపారులు, పత్తి రైతులు ఆందోళనకు దిగారు. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
[ 23-04-2024]
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
పిల్లల అల్లరిని దారి మళ్లించండి
[ 23-04-2024]
పది నెలలపాటు చదువుతో కుస్తీ పడిన పిల్లలకు వేసవి సెలవులు ఉపశమనం ఇస్తాయి. ఆటాపాటలతో సరదాగా గడపొచ్చని భావిస్తుంటారు. -
మోదీ వ్యాఖ్యల్లో ఓటమి భయం
[ 23-04-2024]
లోక్సభ మొదటి దశ ఎన్నికల తీరును చూసిన ప్రధాని మోదీ ఓటమి భయంతో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తుందని వ్యాఖ్యానించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. -
నాలుగో రోజు 25 నామినేషన్లు
[ 23-04-2024]
నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు సోమవారం కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. -
హామీలను విస్మరించిన ప్రభుత్వం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని కరీంనగర్ భారాస అభ్యర్థి వినోద్కుమార్ అన్నారు. -
సెప్టెంబరులో చక్కెర కర్మాగారం తెరిపిస్తాం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా!
[ 23-04-2024]
ప్రాంతానికి కొత్త కావచ్చు, రాజకీయాలకు, ప్రజా సేవకు కొత్తకాదని, అవకాశమిస్తే పార్లమెంట్ పరిధిని అభివృద్ధి చేసి చూపిస్తానని నిజామాబాద్ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. -
దారులన్నీ కొండగట్టుకే
[ 23-04-2024]
తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి దీక్షాపరులు తరలివస్తున్నారు. -
ఓటరు నమోదులో ఫలించిన చైతన్యం
[ 23-04-2024]
ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కు నమోదుకు యువతలో నూతనోత్సాహం ఉరకలేసింది. -
ప్రత్యేక నిధులు.. తీరనున్న ఇక్కట్లు
[ 23-04-2024]
రామగుండం నగరపాలక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అమృత్-2.0, యు.ఐ.డి.ఎఫ్.(అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్) నిధులతో పరిష్కారం కానున్నాయి. -
కాంగ్రెస్ నైజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 23-04-2024]
భారాస పాలనలోనే అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకున్నారని, గడిచిన నాలుగు నెలల కాలంలో సంక్షేమ పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్ పాలకుల నైజాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పెద్దపల్లి లోక్సభ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. -
లెక్కలు తేలేనా?
[ 23-04-2024]
జిల్లా వస్త్ర పరిశ్రమకు గత ప్రభుత్వం సంక్షేమ, పాఠశాల విద్యాశాఖలకు సంబంధించిన వస్త్రోత్పత్తుల ఆర్డర్లు ఇచ్చింది. -
నిధులున్నా ప్రారంభం కాని పనులు
[ 23-04-2024]
గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగుపరిచి రెండు జిల్లాల గ్రామాలను అనుసంధానం చేయాలనే లక్ష్యంతో తారు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
అమాత్యులుగా ఆ నలుగురు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి లోక్సభా నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎంపీల్లో ఇప్పటివరకు నలుగురికి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్