ప్రాంగణం.. ప్రహసనం
గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు, నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు ఈ ఏడాది పల్లెప్రగతిలో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాల(టీకేపీ) ఏర్పాటును ప్రభుత్వం చేర్చింది.
క్రీడా మైదానాలకు ప్రభుత్వ స్థలాలు కరవు
చాలా చోట్ల దూరంగా ఏర్పాటుకు నిర్ణయం
న్యూస్టుడే, ధర్మారం
గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు, నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు ఈ ఏడాది పల్లెప్రగతిలో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాల(టీకేపీ) ఏర్పాటును ప్రభుత్వం చేర్చింది. ఉపాధిహామీ పథకం నిధుల నుంచి రూ.4.17 లక్షల అంచనా వ్యయంతో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో కోర్టులతో పాటు లాంగ్జంప్ పిట్, డబుల్బార్, సింగిల్బార్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాగా అందుబాటులో ప్రభుత్వ భూములు లేకపోవడం, ఉన్నప్పటికీ ఇతరుల ఆక్రమణలో ఉండటం సమస్యగా మారింది. దీంతో చాలా చోట్ల ప్రాంగణాల ఏర్పాటు ఆలస్యమవుతోంది.
స్థలాల గుర్తింపే అసలు సమస్య
జిల్లాలోని 14 మండలాల పరిధిలోని 353 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జూన్ 2 నాటికే రెవెన్యూ అధికారులు స్థలాలు గుర్తించి పంచాయతీలకు అప్పగించాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 163 చోట్లనే స్థలాలు గుర్తించారు. మిగతా గ్రామాల్లో ప్రభుత్వ భూములు లేకపోవడం, ఉన్న చోట అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. ప్రస్తుతం కేటాయించిన స్థలాలు సైతం చాలా చోట్ల ఊళ్లకు దూరంగా ఉన్నవి, రాళ్లు, రప్పలతో నిండి చదును చేసేందుకూ వీలు కానివే. దీంతో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు ప్రహసనంగా మారింది.
పాలకుల చొరవతోనే ప్రయోజనం
గ్రామాల్లో పాఠశాలల మైదానాలు, వివిధ సామాజిక భవనాల వద్ద ఖాళీ స్థలాలున్నాయి. ఇలాంటి చోట క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసేలా ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాల ప్రతినిధులు, ఉన్నతాధికారులు చొరవ చూపితే లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది. ఊరికి దూరంగా నిర్మిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
లక్ష్యం 353
స్థలం గుర్తించినవి 163
పనులు ప్రారంభం 68
పనులు పూర్తయినవి 48
ప్రగతిలో ఉన్నవి 20
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పత్తి రైతులు, వ్యాపారుల ఆందోళన
[ 23-04-2024]
ఎన్నికల కోడ్ పేరుతో తనిఖీలు నిర్వహించి బ్యాంకుల నుంచి డబ్బును తీసుకొస్తున్న తమను ఇబ్బందులకు గురి చేయవద్దని జమ్మికుంట పత్తి మార్కెట్ వద్ద వ్యాపారులు, పత్తి రైతులు ఆందోళనకు దిగారు. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
[ 23-04-2024]
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
పిల్లల అల్లరిని దారి మళ్లించండి
[ 23-04-2024]
పది నెలలపాటు చదువుతో కుస్తీ పడిన పిల్లలకు వేసవి సెలవులు ఉపశమనం ఇస్తాయి. ఆటాపాటలతో సరదాగా గడపొచ్చని భావిస్తుంటారు. -
మోదీ వ్యాఖ్యల్లో ఓటమి భయం
[ 23-04-2024]
లోక్సభ మొదటి దశ ఎన్నికల తీరును చూసిన ప్రధాని మోదీ ఓటమి భయంతో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తుందని వ్యాఖ్యానించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. -
నాలుగో రోజు 25 నామినేషన్లు
[ 23-04-2024]
నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు సోమవారం కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. -
హామీలను విస్మరించిన ప్రభుత్వం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని కరీంనగర్ భారాస అభ్యర్థి వినోద్కుమార్ అన్నారు. -
సెప్టెంబరులో చక్కెర కర్మాగారం తెరిపిస్తాం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా!
[ 23-04-2024]
ప్రాంతానికి కొత్త కావచ్చు, రాజకీయాలకు, ప్రజా సేవకు కొత్తకాదని, అవకాశమిస్తే పార్లమెంట్ పరిధిని అభివృద్ధి చేసి చూపిస్తానని నిజామాబాద్ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. -
దారులన్నీ కొండగట్టుకే
[ 23-04-2024]
తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి దీక్షాపరులు తరలివస్తున్నారు. -
ఓటరు నమోదులో ఫలించిన చైతన్యం
[ 23-04-2024]
ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కు నమోదుకు యువతలో నూతనోత్సాహం ఉరకలేసింది. -
ప్రత్యేక నిధులు.. తీరనున్న ఇక్కట్లు
[ 23-04-2024]
రామగుండం నగరపాలక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అమృత్-2.0, యు.ఐ.డి.ఎఫ్.(అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్) నిధులతో పరిష్కారం కానున్నాయి. -
కాంగ్రెస్ నైజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 23-04-2024]
భారాస పాలనలోనే అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకున్నారని, గడిచిన నాలుగు నెలల కాలంలో సంక్షేమ పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్ పాలకుల నైజాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పెద్దపల్లి లోక్సభ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. -
లెక్కలు తేలేనా?
[ 23-04-2024]
జిల్లా వస్త్ర పరిశ్రమకు గత ప్రభుత్వం సంక్షేమ, పాఠశాల విద్యాశాఖలకు సంబంధించిన వస్త్రోత్పత్తుల ఆర్డర్లు ఇచ్చింది. -
నిధులున్నా ప్రారంభం కాని పనులు
[ 23-04-2024]
గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగుపరిచి రెండు జిల్లాల గ్రామాలను అనుసంధానం చేయాలనే లక్ష్యంతో తారు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
అమాత్యులుగా ఆ నలుగురు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి లోక్సభా నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎంపీల్లో ఇప్పటివరకు నలుగురికి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు