ఉపాధ్యాయుల సహకారం.. విద్యార్థులకు ఉపకారం
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) అర్హత పరీక్షలో మాడల్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపుతున్నారు. పదేళ్లుగా పదుల సంఖ్యలో విద్యార్థులు ఉపకార వేతనానికి ఎంపికై సత్తా చాటుతున్నారు. తాజాగా విడుదలైన ఎన్ఎంఎంఎస్ ఫలితాల్లో విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచారు.
ఎన్ఎంఎంఎస్ ప్రతిభా పరీక్షలో ర్యాంకుల పంట
న్యూస్టుడే, మార్కండేయకాలనీ
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) అర్హత పరీక్షలో మాడల్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపుతున్నారు. పదేళ్లుగా పదుల సంఖ్యలో విద్యార్థులు ఉపకార వేతనానికి ఎంపికై సత్తా చాటుతున్నారు. తాజాగా విడుదలైన ఎన్ఎంఎంఎస్ ఫలితాల్లో విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచారు.
25 మందికి ఉపకార వేతనాలు అందనున్నాయి. 2013-14లో ముగ్గురితో ప్రారంభం కాగా, క్రమేపి ఏడాదికి పదుల సంఖ్యలో ఎంపికయ్యే స్థాయికి చేరారు. కరోనాతో రెండేళ్లుగా తరగతులు సరిగ్గా జరగకపోయినా అధిక మంది సత్తా చాటారు. లింగాపూర్ మాడల్ పాఠశాల ఉపాధ్యాయులు రాజశేఖర్ ప్రత్యేక దృష్టి సారించడంతో విశేష ఫలితాలు వస్తున్నాయి. మెరిట్ విద్యార్థులను ఎంపిక చేసుకుని వారికి అవసరమైన శిక్షణను ఉదయం, సాయంత్రం వేళల్లో సెలవు రోజుల్లో అందించారు.
రెండు పేపర్లలోనూ..
ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ అర్హత పరీక్షలకు ఎనిమిదో తరగతి విద్యార్థులు అర్హులు.. వారికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అర్హత పరీక్షల్లో రెండు పేపర్లు మ్యాట్, శాట్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఒక్కో పేపరుకు 90 మార్కుల చొప్పున 180 మార్కులు ఇస్తున్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు తొమ్మిదో తరగతి నుంచి ఏటా రూ.12 వేలు ఉపకార వేతనం అందుకుంటారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అందుతుంది. ఏటా సెప్టెంబరులో నోటిఫికేషన్ వేసి నవంబరులో పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా కారణంగా కాస్తా ఆలస్యంగా పరీక్షలు, ఫలితాలు వచ్చాయి.
సాధనతోనే మంచి మార్కులు... : - కాల్వ వెన్నెల, తొమ్మిదో తరగతి
ఖని ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి వరకు చదివా.. అనంతరం 6వ తరగతి ప్రవేశం కోసం లింగాపూర్ మాడల్ స్కూల్ ప్రవేశపరీక్ష రాసి 8వ ర్యాంకు సాధించి ప్రవేశం పొందా. మా పాఠశాలలోని ఆంగ్ల ఉపాధ్యాయుడు రాజశేఖర్ శిక్షణతో ఎన్ఎంఎంఎస్లో 130 మార్కులు సాధించి జిల్లా స్థాయి ద్వితీయ ర్యాంకు సాధించా. కరోనా సమయంలోనూ ప్రతి రోజు పాఠశాలకు వచ్చి ప్రత్యేకంగా తరగతులకు హాజరయ్యాను. గణితం, సైన్స్లో మంచి మార్కులతోనే జిల్లా ర్యాంకులు వచ్చాయి.
గణితంలో పట్టు సాధించా... : - చందన, తొమ్మిదో తరగతి
ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి పూర్తిచేసి 6వ తరగతి ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి మాడల్ పాఠశాలలో ప్రవేశం పొందా. గణితంపై పట్టు ఉండటంతో నాపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పటికీ ఎన్ఎంఎంఎస్లో 128 మార్కులు సాధించా.. ఉపకార వేతనానికి ఎంపికవడం ఎంతో సంతోషంగా ఉంది. ఉపాధ్యాయుల శిక్షణతో మంచి మార్కులు వచ్చాయి. నా కష్టానికి తగిన ఫలితం దక్కింది.
ఇంటర్ వరకు ప్రోత్సాహకం.. : - తోకల సిరి, తొమ్మిదో తరగతి
ప్రభుత్వ పాఠశాలలో సాధారణంగా పేద విద్యార్థులే చదువుతుంటారు. ఎన్ఎంఎంఎస్లో 126 మార్కులు సాధించా.. చిన్నప్పటి నుంచి చదువులో ముందుంటా.. ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు హైదరాబాద్ ప్రైవేటు పాఠశాల, 4వ, 5వ తరగతి ఖని ప్రైవేటు పాఠశాలలో చదివి 6వ తరగతి మాడల్ పాఠశాలలో ప్రవేశ పరీక్ష రాసి అనుమతి పొందాను. ఎన్ఎంఎంఎస్లో ప్రతిభ కనబర్చాలని నిత్యం సంబంధిత పాఠ్యాంశాలపై ప్రత్యేక శ్రద్ధతో చదివాను.. ఇంటర్ వరకు ప్రోత్సాహకం అందనుంది.
ప్రత్యేక చొరవతోనే ఫలితాల సాధన : - ముత్యం రాజశేఖర్, మాడల్ స్కూల్ ఉపాధ్యాయుడు
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు నిరుపేదలే... వారికి సాధారణ పాఠ్యంశాలతో పాటు.. ప్రత్యేకంగా మ్యాట్, శాట్కు సంబంధించిన అంశాలు వివరించడంతో పాటు సాధన చేయిస్తాను. విద్యార్థులకు ఉపకార వేతనాలు అందనుడటంతో ప్రత్యేక శ్రద్ధ పెరగడంతో సాధించాలన్న పట్టుదల పెరుగుతోంది. ఎన్ఎంఎంఎస్ నోటిఫికేషన్ విడుదల కావడంతోనే ప్రతి రోజు పాఠశాలలో మూడు పీరియడ్లు సంబంధిత పాఠ్యాంశాలను సాధన చేయించడంతో ఈ ఫలితాలు రాబట్టగలుగుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం
[ 18-04-2024]
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణోత్సవాన్ని ఆలయ వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
నేటి నుంచి నామినేషన్లు షురూ!
[ 18-04-2024]
ఎన్నికల సమరంలో అసలైన ఘట్టం గురువారం నుంచి మొదలవనుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ నెల రోజుల కిందటే వెలువడినప్పటికీ నేడు వెలువడే అధికారిక నోటిఫికేషన్తో అసలు అంకం షురూ అవనుంది. -
ప్రచార పర్వానికి కాంగ్రెస్ సిద్ధం!
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి గురువారం నామపత్రాల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలో ప్రచార కసరత్తు ప్రారంభించింది. -
కొప్పుల మొదటిసారి.. జీవన్ మూడోసారి
[ 18-04-2024]
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో వేర్వేరు పార్టీలు, వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న తాటిపర్తి జీవన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్లకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలుపొందిన జీవన్రెడ్డి స్వగ్రామం పెగడపల్లి మండలం బతికెపల్లి. -
క్లిక్ దూరంలో సమగ్ర సమాచారం
[ 18-04-2024]
ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వెబ్సైట్ రూపొందించింది. ceotelangana.nic.in లో ఓటరు నమోదుతో పాటు సవరణలు, తొలగింపులు తదితర అంశాలుంటాయి. -
రెండు సార్లు ఎంపీ.. సాధారణ జీవనం
[ 18-04-2024]
వరుసగా రెండు సార్లు ఎంపీగా ఎన్నికైనా చివరి శ్వాస వరకు పల్లెటూరులోనే సాధారణ జీవితం గడిపారు జువ్వాడి రమాపతిరావు. 1916లో గన్నేరువరంలో జన్మించిన ఆయన వివాహం అనంతరం అత్తగారి ఊరైన గంగాధర మండలం సర్వారెడ్డిపల్లికి వచ్చి స్థిరపడ్డారు. -
ఎన్నికల పరిశీలకులొస్తున్నారు
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెంచింది. -
హాట్రిక్ విజేత..అరుదైన ఘనత
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లాలో నలుగురు నేతలు వరుసగా మూడు సార్లు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ రికార్డు సొంతం చేసుకున్నారు. కరీంనగర్ నుంచి ముగ్గురు, పెద్దపల్లి నుంచి ఒకరు గెలుపొంది రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు. -
అక్కడ స్థానికేతరులే అధికం
[ 18-04-2024]
1962లో ఆవిర్భవించిన పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు ఒక్కసారి మినహా అన్ని ఎన్నికల్లో స్థానికేతరులే గెలుపొందారు. 1980లో 7వ లోక్సభ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన కోదాటి రాజలింగం మాత్రమే స్థానికుడు. -
వసతుల మెరుగుకు కార్యాచరణ
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం నగరపాలికల్లో కనీస మౌలిక వసతులు మెరుగుపర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రధానంగా తాగునీరు, భూగర్భ మురుగునీటి వ్యవస్థను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటారు. -
ఆదాయంలో జమ్మికుంట మార్కెట్ టాప్
[ 18-04-2024]
పంటలకు పెరిగిన మద్దతు ధర, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పాత బకాయిలు జమకావటం, చెక్పోస్టులు, గిడ్డంగుల అద్దెలు, లైసెన్సులు, మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాల ద్వారా లభించే ఆదాయంతో ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల వ్యవసాయ మార్కెట్ మినహా కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లు మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన ఆర్థిక ఆదాయ లక్ష్యాన్ని అధిగమించాయి. -
ఓటరు దరఖాస్తులకు త్వరితగతిన పరిష్కారం
[ 18-04-2024]
నామినేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు. బుధవారం ఆయన నిర్వహించిన పెద్దపల్లి నుంచి కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, శ్యామ్ప్రసాద్లాల్లు పాల్గొన్నారు. -
మిల్లుల్లోనే బియ్యం.. ధాన్యానికేదీ స్థలం?
[ 18-04-2024]
గత వానాకాలం సీజన్కు సంబంధించిన బియ్యానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో మిల్లుల్లోనే నిల్వలు పేరుకుపోయాయి. గత సీజన్కు సంబంధించిన సీఎంఆర్ లక్ష్యాలను మిల్లర్లు పూర్తి చేయాలనే గడువును జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పంజాబ్ ఆలౌట్.. ముంబయి థ్రిల్లింగ్ విక్టరీ
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం