హత్య కేసులో 9 మంది నిందితుల అరెస్టు
వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్కు చెందిన నాగుల వేణు (40) హత్య కేసుకు సంబంధించి 9 మందిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ రాహుల్హెగ్డే తెలిపారు.
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రాహుల్హెగ్డే, చిత్రంలో అదనపు ఎస్పీ చంద్రయ్య తదితరులు
సిరిసిల్ల గ్రామీణం, న్యూస్టుడే: వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్కు చెందిన నాగుల వేణు (40) హత్య కేసుకు సంబంధించి 9 మందిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ రాహుల్హెగ్డే తెలిపారు. తిప్పాపూర్కు చెందిన నాగుల వేణు తాయత్తులు కడుతూ జీవించేవాడని, ఈక్రమంలోనే రమ్య అనే యువతి తాయత్తు కట్టించుకునేందుకు అమ్మమ్మతో కలిసి ఈ నెల 23న వేణు దగ్గరికి వెళ్లినట్లు చెప్పారు. అమ్మమ్మ బయట ఉండగా రమ్య వేణు గదిలోకి వెళ్లగా ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందున ఇంటికి వెళ్లి ఫోన్లో తన మేన బావ జలందర్, సోదరుడు బరిగెల రోహిత్లకు చెప్పిందన్నారు. జలందర్ మరుసటి రోజు 24న తన స్నేహితులు తీగల నరేశ్, కత్తుల మాధవరెడ్డి, కోడి రాజశేఖర్, స్వామిలను తీసుకొని సారంపల్లిలోని బరిగెల రోహిత్, బరిగెల రాజుల వద్దకు వెళ్లాడని తెలిపారు. అందరు కలిసి వేణును చంపాలని నిర్ణయించుకొని సిరిసిల్లలోని మడేలయ్యగుడి దగ్గరకు వచ్చినట్లు చెప్పారు. నరేశ్ బాబాయి గొట్టె కిరణ్ ద్వారా వేణుకు ఫోన్ చేయించి పని ఉందని రమ్మని చెప్పి కిరణ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడని తెలిపారు. వేణు, యాదగిరి ప్రసాద్రావుతో కలిసి సిరిసిల్లకు వచ్చినట్లు పేర్కొన్నారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం మడేలయ్యగుడి వద్దకు వేణును తీసుకెళ్లి కట్టెలు, ఇటుకతో తీవ్రంగా కొట్టి గాయపరిచారన్నారు. అడ్డువచ్చిన ప్రసాద్రావును కూడా కొట్టి చంపుతామని బెదిరించినట్లు చెప్పారు. అదే సమయంలో వేణుకు తన అల్లుడు కపిల్ ఫోన్ చేయగా తనను కొడుతున్నారని చెప్పడంతో కపిల్, ఆశవ్వ, సంపత్లు వెంటనే అక్కడికి చేరుకున్నారన్నారు. తన తమ్ముడిని ఎందుకు కొడుతున్నారని ఆశవ్వ అడగగా నిందితులు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపారు. తీవ్ర గాయాలైన వేణుకు వేములవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తరలించగా మృతి చెందినట్లు ఎస్పీ వివరించారు. వేణు మృతికి కారకులైన జలందర్, రమ్య, రోహిత్, నరేశ్, కిరణ్, స్వామి, మాధవరెడ్డి, రాజశేఖర్లతో పాటు మరో వ్యక్తిని మంగళవారం మడేలమ్మగుడి వద్ద పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక సెల్ఫోన్, మూడు కర్రలు, సిమెంటు ఇటుకను స్వాధీనపరుచుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఎవరైన తాయత్తుల పేరిట మోసాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వాటిని నమ్మవద్దని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ అనిల్కుమార్, ఎస్ఐలు రఫీక్ఖాన్, సీననాయక్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూసేకరణలో జాప్యం
[ 28-03-2024]
భూసేకరణలో జాప్యమే జాతీయ రహదారుల విస్తరణకు శాపంగా మారుతోంది. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిగా మార్చి దశాబ్దం కావస్తున్నా.. నిర్మాణం మొదలు కావటం లేదు -
నత్తనడకన నిర్మాణాలు
[ 28-03-2024]
వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పల్లెదవాఖానాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర(సబ్సెంటర్ల)ను పల్లె దవాఖానాలుగా మార్చారు -
నిధులు వెచ్చించి.. పనులు వదిలేసి
[ 28-03-2024]
పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఆధునిక సాంకేతికను జోడించి పెద్ద నగరాలకు దీటుగా పోటీ పడేందుకు ప్రణాళికలు చేసిన నగరపాలిక.. ఆ విధానం అమలులో వెనుకబడింది -
తాగునీటి వృథా వద్దు : కలెక్టర్
[ 28-03-2024]
అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
కాంగ్రెస్ నిజామాబాద్ లోక్సభ స్థానం టికెట్ జీవన్రెడ్డికే దక్కింది. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది -
తొలిమెట్టు నోడల్ అధికారులకు భత్యం
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక బోధన పద్ధతులతో కొనసాగుతున్న ఈ కార్యక్రమ పర్యవేక్షణకు మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 28-03-2024]
వాతావరణ సమాచారాన్ని ప్రతిఒక్కరి దైనందిన కార్యకలాపాల్లో భాగం చేయాలనే ఉద్దేశంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇటీవల ‘పంచాయత్ మౌసం సేవా’ మొబైల్ యాప్ విడుదల చేసింది. -
పఠనాలయం సద్వినియోగం... కల సాకారం
[ 28-03-2024]
గ్రంథాలయ పుస్తకాలతోనే ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించగలిగాను. తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ నిర్వహించిన ఫలితాల్లో పీజీటీ సాంఘికశాస్త్రం, జూనియర్ కళాశాలలో పౌరశాస్త్రం లెక్చరర్గా ఉద్యోగాలకు ఎంపికయ్యాను -
పంచాయతీల ఖజానా ఖాళీ
[ 28-03-2024]
ఓవైపు ఖజానా ఖాళీ, మరోవైపు సమస్యలు పంచాయతీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జమయ్యే నిధులకు మించిన వ్యయం చేయడంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఓటు నమోదుకు ప్రత్యేక సాధారణ సెలవు
[ 28-03-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్