పదిలో 91.37శాతం ఉత్తీర్ణత
పదోతరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచింది. కరోనా కంటే ముందు వరసగా మూడేళ్లు రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలవగా ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం పెంచేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపగా
జగిత్యాల, న్యూస్టుడే: పదోతరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచింది. కరోనా కంటే ముందు వరసగా మూడేళ్లు రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలవగా ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం పెంచేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపగా రాష్ట్రంలో వెనకబడ్డప్పటికి జిల్లాలో 91.37 శాతం ఉత్తీర్ణత సాధించి పరువు నిలుపుకున్నారు. జిల్లాలో 11,786 మంది పరీక్షలు రాయగా అందులో 10,769 మంది ఉత్తీర్ణులయ్యారు. 6135 మంది బాలురు పరీక్ష రాస్తే 5454 మంది(88.09 శాతం), 5651 మంది బాలికలు పరీక్ష రాస్తే 5315 మంది(94.05 శాతం) ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో 333 పాఠశాలలుండగా 87 పాఠశాలలు వందశాతం ఫలితాలు సాధించాయి. 229 ప్రభుత్వ పాఠశాలల్లో 38, 104 ప్రైవేటు పాఠశాలల్లో 49 వందశాతం ఫలితాలు సాధించాయి. మొత్తం విద్యార్థుల్లో 247 మంది 10.0 జి.పి.ఏ సాధించగా 385 మంది 9.8, 427 మంది 9.7, 567 మంది 9.5 జి.పి.ఏ సాధించారు.
తండ్రికి అనారోగ్యం.. గురి తప్పని లక్ష్యం
తల్లిదండ్రులతో శ్రీజ
మేడిపల్లి: మేడిపల్లి మండలం గోవిందారం గ్రామానికి చెందిన తోట రవీందర్-జలజ దంపతుల కూతురు శ్రీజ ప్రభుత్వ పాఠశాలలో చదివి 10 జీపీఏ సాధించింది. రవీందర్ విద్యుత్తు మోటార్లు రిపేర్ చేసుకుంటూ జీవిస్తుండగా రెండేళ్లుగా అనారోగ్యంతో ఇంట్లోనే ఉంటున్నాడు. తల్లి బీడీలు చుడుతూ వ్యవసాయ పనులు చేస్తోంది. కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలే అయినా.. తండ్రి అనారోగ్యంతో ఇంట్లోనే ఉంటున్నా శ్రీజ చదువుపై పట్టు వీడలేదు. పేదరికం వెంటాడుతున్నా అక్కయ్య రుచిత ఈ ఏడాది ఇంటర్లో 90 శాతం పైగా మార్కులు సాధించింది. గురువారం వెలువడిన ఫలితాల్లో శ్రీజ 10 జీపీఏ సాధించిందని తెలిసి గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.
పాలనాధికారి ప్రత్యేక దృష్టి
కరోనాతో రెండేళ్లు పరీక్షలు రాయకున్నా ప్రభుత్వం అందరినీ పాస్ చేయగా ఈ సంవత్సరం చదువులో విద్యార్థులు వెనకబడ్డ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ గుగులోతు రవి మొదటి నుంచే ప్రత్యేక దృష్టి సారించారు. ఉన్నత పాఠశాలలన్నింటిలో విద్యార్థులకు అల్పాహారం కోసం రూ.20 లక్షలు ఇచ్చారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. చదువులో వెనకబడిన వారిని గుర్తించి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించారు. పరీక్షల సందర్భంగా కఠినంగానే వ్యవహరించారు. ప్రతి పాఠశాలకో ఇతర శాఖలకు చెందిన అధికారులకు బాధ్యతలు అప్పగించారు.
పేదింట విద్యా కుసుమం
కోరుట్లగ్రామీణం: మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకే ఒక్కడు పదోతరగతి ఫలితాల్లో 10 జీపీఏ సాధించి ప్రతిభ కనబరిచాడు. కోరుట్ల పట్టణానికి చెందిన గుంటుక రవికుమార్-మాధవి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు షణ్ముక్ కల్లూర్ గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో పదో తరగతి పూర్తిచేసి గురువారం విడుదలైన ఫలితాల్లో 10 జీపీఏ సాధించాడు. తండ్రి టైలరింగ్ పని చేస్తుండగా తల్లి బీడీ కార్మికురాలు.
వందశాతం..
మెట్పల్లి గ్రామీణం: వేంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక్కడ 18 మందికి గాను 18 మంది ఉత్తీర్ణత చెందారు.
ఇప్పటి వరకు 27 సార్లు
మల్యాల: తాటిపల్లిలోని ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఏడు కూడా వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. పాఠశాల ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు 37 పదో తరగతి బ్యాచ్లు ఉన్నత చదువులకు వెళ్లగా అందులో 27 సార్లు వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. గురువారం ప్రకటించిన పదో తరగతి పరీక్షల్లో మొత్తం 78 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా వారిలో డి.పూర్ణిమ, శివప్రియ అనే విద్యార్థులిద్దరు 10 జీపీఏ సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
[ 19-04-2024]
కమాన్పూర్ మండలం రొంపికుంట ఉపకేంద్రం పరిధిలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ట్రాన్స్ కో ఏఈ రాజేంద్ర కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత