నేటి నుంచి ప్లాస్టిక్ నిషేధం
ప్లాస్టిక్..మానవాళికి పెనుముప్పుగా మారింది. క్యాన్సర్లకు మూల కారణమవుతోంది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ (ఎస్యూపీ) వ్యర్థాలు కొండలా పేరుకుపోతున్నాయి. తక్కువ మందం కలిగిన ఇవి మట్టిలో కలిసేందుకు దశాబ్దాలు పడుతోంది. వివిధ దశల్లో
ఒకసారి వాడి పారేసే వస్తువులపై నిఘా
నగరాలు, పట్టణాల్లో చర్యలకు ఆదేశాలు
న్యూస్టుడే, కరీంనగర్ కార్పొరేషన్
నగరంలో తనిఖీలు చేస్తున్న సిబ్బంది
ప్లాస్టిక్..మానవాళికి పెనుముప్పుగా మారింది. క్యాన్సర్లకు మూల కారణమవుతోంది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ (ఎస్యూపీ) వ్యర్థాలు కొండలా పేరుకుపోతున్నాయి. తక్కువ మందం కలిగిన ఇవి మట్టిలో కలిసేందుకు దశాబ్దాలు పడుతోంది. వివిధ దశల్లో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం పలుమార్లు కార్యాచరణ చేపట్టినా.. ప్రస్తుతం కేంద్ర పర్యావరణ, అటవీశాఖ పకడ్బందీగా అమలుకు చర్యలు ప్రారంభించింది. ఉమ్మడి జిల్లాలోని నగర, పురపాలికల్లో నివసించే ప్రజలకు నిత్య జీవితంలో ప్లాస్టిక్ వినియోగం ఒక భాగమైంది. దాని వినియోగం లేనిదే ఆ రోజు గడవడం లేదు. మార్కెట్లు, కిరాణ దుకాణాలు, చిరు వ్యాపారులు, పండ్ల బండ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, కర్రీ పాయింట్లు తదితర ప్రాంతాల్లో ఒకసారి వాడి పడేసే కవర్లను విచ్చల విడిగా వినియోగిస్తున్నారు. విద్యావంతుల నుంచి మొదలుకొని కార్మికుల వరకు ప్రతి ఒక్కరూ చేతిలో రెండు, మూడు కవర్లు వెంట తీసుకెళ్లడం సాధారణంగా మారింది. బయటకు వచ్చే సమయంలో బట్ట సంచులు తీసుకు రావాలనే ఆలోచన చేయడం లేదు. కొంతమంది వ్యాపారులైతే వినియోగదారులకు కనీసం అవగాహన కల్పించకుండా ఇదే పనిగా వీటిని వాడుతున్నారు. పాలిథిన్ సంచులు నిషేధించడానికి గతంలో హడావుడి చేసిన అధికార యంత్రాంగం ఆ తర్వాత విస్మరించింది. కొవిడ్ కారణంగా తనిఖీలు వదిలేయగా.. వ్యాపారులు సైతం ఇష్టారాజ్యంగా ఉపయోగిస్తుండటంతో గతేడాది రోజుకు సుమారు 20 టన్నుల మేర వ్యర్థాలు బయట వదిలేశారు.
120 మైక్రాన్ల లోపుంటే..
ఇప్పటికే 50 మైక్రాన్ల మందం గల ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించారు. ఒకసారి వాడి పడేయకుండా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 75 మైక్రాన్లకు పెంచింది. గతేడాది డిసెంబర్ నుంచి 120 మైక్రాన్ల కవర్లను కూడా నిషేధిత జాబితాలో చేర్చింది. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువుల తయారీ, అమ్మకం, వాడకాన్ని జులై 1నుంచి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్దేశించిన మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లు తయారు చేసిన వారికి రూ.50 వేలు, అమ్మిన వారికి రూ.2500 నుంచి రూ.5వేలు, వాడిన వ్యక్తులకు రూ.250, రూ.500ల నుంచి రూ.5వేల వరకు జరిమానా విధించనుంది.
జాబితాలోనివి ఇవే
ప్లాస్టిక్ స్టిక్స్ తయారు చేసిన ఇయర్ బడ్స్, ప్లాస్టిక్ జెండాలు, ఐస్క్రీం పుల్లలు, క్యారీ బ్యాగ్స్, ప్యాకింగ్ చేయడం, సిగరెట్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ చెంచాలు, ముళ్ల చెంచాలు, ప్లేట్లు, కత్తులు, థర్మకోల్తో చేసిన ఆలంకరణ వస్తువులు, కప్పులు, అద్దాలు, స్టిక్కర్లు, స్ట్రాలు, మిఠాయి డబ్బాలు, ఆహ్వానపత్రాలు, 100మైక్రాన్ల కంటే తక్కువ కలిగిన పీవీసీ బ్యానర్లు, బెలూన్లకు కట్టే ప్లాస్టిక్ స్టిక్స్ వంటివి పూర్తిగా నిషేధించనున్నట్లు ఉత్తర్వులో వివరించారు.
తనిఖీలు..అవగాహన కార్యక్రమాలు
ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ సంచులను, వస్తువులను పూర్తిగా నిషేధిత జాబితాలోకి చేర్చడంతో అన్ని మున్సిపాలిటీలు, నగరపాలికల్లో సిటీ లెవల్ టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో కమిషనర్, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, ఎన్జీవో, పోలీసు కానిస్టేబుల్ కమిటీలో ఉంటారు. వీరంతా శుక్రవారం నుంచి తనిఖీలు చేయడంతో పాటు జరిమానా విధిస్తారు. ప్రజలకు, వ్యాపారులకు ప్రత్యామ్నాయంగా వాడుకునే వస్తువులను వివరించనున్నారు. దీనికోసం ప్రధాన రహదారులపై ప్రచారబోర్డులు, హోర్డింగ్ ఏర్పాటు చేయనున్నారు. విస్తృతంగా ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
కఠిన నిబంధనలు అమలు
కరీంనగర్ గ్రామీణం, న్యూస్టుడే: నేటి నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, క్షేత్రస్థాయిలో 75 మైక్రాన్ల కంటే తక్కువ ప్లాస్టిక్ సంచులను ఎవరూ వాడరాదని, నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని జిల్లా పాలనాధికారి కర్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈమేరకు గురువారం ఒక ప్రకట విడుదల చేశారు. మున్సిపాలిటీల్లో కమిషనర్లు, గ్రామాల్లో గ్రామ కార్యదర్శులు కచ్చితంగా అమలు చేయాలని ఆప్రకటనలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
[ 19-04-2024]
కమాన్పూర్ మండలం రొంపికుంట ఉపకేంద్రం పరిధిలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ట్రాన్స్ కో ఏఈ రాజేంద్ర కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!