బోసిపోయిన పర్యాటకం
ఉమ్మడి జిల్లాలో అనేక ప్రాంతాలు పర్యాటకానికి అనువుగా ఉన్నా.. అభివృద్ధి కరవైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నో చారిత్రక ప్రాంతాలు, ఔషధ గుణాలున్న మొక్కలతో నిండిన కొండ ప్రాంతాలున్నాయి. ఏటా శ్రావణ మాసంలో ఆహ్లాదం గొలిపే ప్రాంతాలు
పడవలు తెచ్చి వదిలేశారు..
ప్రతిపాదనలు దాటని పనులు
న్యూస్టుడే, గోదావరిఖని, గంగాధర, హుజూరాబాద్
సైదాపూర్ మండలం రాయికల్ ప్రాంతంలోని ఆహ్లాదం గొలుపుతున్న జలపాతం
ఉమ్మడి జిల్లాలో అనేక ప్రాంతాలు పర్యాటకానికి అనువుగా ఉన్నా.. అభివృద్ధి కరవైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నో చారిత్రక ప్రాంతాలు, ఔషధ గుణాలున్న మొక్కలతో నిండిన కొండ ప్రాంతాలున్నాయి. ఏటా శ్రావణ మాసంలో ఆహ్లాదం గొలిపే ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడుతాయి. కానీ అక్కడ కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరినది నిండుకుండలా ఉంటోంది. పరివాహక ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్న ప్రజాప్రతినిధుల హామీలు నెరవేరడం లేదు. నదుల్లో విహరించేందుకు బోటింగ్, ఆహ్లాదంగా గడిపేందుకు పచ్చని మైదానాలు, హరిత హోటళ్లతో సందడిగా ఉండాల్సిన కేంద్రాల్లో ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో సందర్శకులు కనిపించడం లేదు.
ఆధ్యాత్మిక కేంద్రాల్లో పట్టింపేది?
దక్షిణకాశీగా గుర్తింపు పొందిన వేములవాడ పుణ్యక్షేత్రం నిత్యం భక్తులతో సందడిగా ఉంటుంది. ఆలయానికి పక్కనే ఉన్న చెరువును విహార కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు ముందుకు సాగడం లేదు. అత్యంత విశిష్టమైన ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ సమీపంలోని గోదావరినది తీరాన్ని కూడా పర్యాటకంగా అభివృద్ధి చేయాలని తలచినా నిర్లక్ష్యానికి గురవుతోంది. మల్యాల మండలంలోని కొండగట్టు అంజన్న స్వామి ఆలయానికి చేరుకోవడానికి రోప్వే నిర్మించాలన్నదీ కార్యారూపం దాల్చడం లేదు. కోటిలింగాల ఆలయానికి నిత్యం వచ్చే భక్తులకు ఆహ్లాదం కోసం గోదావరినది తీరంలో ఆహ్లాదం కల్పించేందుకు పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. ఉమ్మడి జిల్లాలో జలపాతాలతో పాటు పచ్చని చెట్లతో విహారయాత్రకు వెళ్లి సరదగా గడిపే సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్య కేంద్రాలున్నా కనీసం అభివృద్ధిని విస్మరించారు.
పెద్దపల్లి జిల్లాలో..
మంథని మండలంలో ఎల్-మడుగు ప్రకృతి వనంతో పాటు గోదావరినదీ నీటితో జలాశయం మాదిరిగా ఆకర్శిస్తుంది.. అందులో పడవ ద్వారా విహరించే వారికి ఎంతో పర్యాటక అనుభూతి కలుగుతుంది. రామగిరిఖిల్లా శత్రుదుర్భేద్యమైన కోట. ఔషధ గుణాలున్న ఎన్నో రకాల మొక్కలున్నాయి. పర్యాటక కేంద్రంగా తయారు చేయడంతో పాటు ఔషధ మొక్కల పరిశోధన కేంద్రంగా తయారు చేయాలన్న ప్రతిపాదనకు మోక్షం లభించలేదు. సబితం గ్రామ సమీపంలో ఎత్తైన కొండల మధ్య నుంచి వచ్చే జలపాతం ఆహ్లాదాన్ని గొలుపుతుంది. ఏటా ఎంతో మంది సందర్శకులు సేదదీరుతుంటారు. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. బసంత్నగర్ వద్ద బుగ్గగుట్ట ప్రాంతం పర్యాటకానికి అనుకూలం. ఏడాది పొడవునా సందర్శకులతో సందడిగా ఉంటుంది.
కరీంనగర్లో..
ఎలగందుల చారిత్రాత్మకమైన ఖిల్లాను వీక్షించేందుకు ఎంతో మంది సందర్శకులు వస్తుంటారు. ఇక్కడ కేవలం మ్యూజికల్ లైటింగ్ను ఏర్పాటు చేశారు. అవీ పనిచేయడం లేదు. సైదాపూర్ మండలం రాయికల్ గ్రామ శివారులో సహజసిద్ధ జలపాతం చూపరులను ఆకర్శిస్తోంది. అక్కడ ఎలాంటి సౌకర్యాల్లేవు. జిల్లా కేంద్రంలోని ఉజ్వలపార్కులో సందర్శకులను ఆకట్టుకోవడానికి మరింత మెరుగైన పనులు చేపట్టాలి. గంగాధర మండలం బొమ్మలగుట్టను పర్యాటక క్షేత్రంగా తయారు చేస్తామని ప్రతిపాదించారు. కేవలం మెట్లు మాత్రమే నిర్మించారు.
జగిత్యాలలో..
వెల్గటూరు మండలంలోని మునులగుట్ట పచ్చని చెట్లతో ఆహ్లాదం గొలుపుతుంది. ఈ గుట్టను పర్యాటక క్షేత్రంగా మార్చేందుకు అనుకూలం. మల్లాపూర్ మండలంలోని సోమేశ్వరాలయం గోదావరినదీ తీరంలో ఉంటుంది. ఎంతో ప్రశిష్టమైన ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. గోదావరి తీరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని కూడా పర్యాటక క్షేత్రంగా మార్చే అవకాశాలున్నాయి. రాయికల్ మండలంలోని కొత్తపేటలో త్రికూటాలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయవచ్చు.
సిరిసిల్లలో..
వేములవాడ సమీపంలోని నాంపల్లి గుట్ట ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయవచ్ఛు పర్యాటకానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. రుద్రంగి సమీపంలో సహజసిద్ధ నీటి జలపాతాలున్నాయి. ఎల్లారెడ్డిపేట మండలంలో రాశిగుట్ట ఒక ప్రత్యేకమైంది. గుట్టవద్ద పడే సూర్యకిరణాలు శరీరంపై పడగానే రంగు మారుతుంది. ఇక్కడ ఎంతో ప్రత్యేకత ఉన్న రాశిగుట్ట ప్రాంతాన్ని పర్యాటకంగా మార్చవచ్ఛు ఇదే మండలంలో సముద్రలింగాపూర్ వద్ద జలాశయం ఆకర్షణీయంగా ఉంటుంది.
పనుల ప్రతిపాదనలు పంపించాం
- వెంకటేశ్వర్రావు, కరీంనగర్ పర్యాటక శాఖ అధికారి
పర్యాటక శాఖ ద్వారా కొన్ని ప్రతిపాదనలు పంపించాం. కొన్ని పనులు సాగుతున్నాయి. బొమ్మలమ్మగుట్ట ప్రాంతంలో మెట్లదారి, రేయిలింగ్ పనులు పూర్తయ్యాయి. ఎల్ఎండీలో ఒక్క పడవ మాత్రమే నడవడం లేదు. జెట్ పడవలు నడుస్తున్నాయి. మానేరు రివర్ఫ్రంట్ పనులు తీగల వంతెన సమీపంలో నడుస్తున్నాయి. నీటిపారుదల శాఖ, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పనులు చేపడుతున్నాం.
ఇక్కడ అహ్లాదంగా కనిపిస్తున్నది జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల.. గోదావరి పరివాహక ప్రాంతం, ఆధ్యాత్మిక కేంద్రంలో అభివృద్ధికి చేయాలి రెండు పడవలను పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. రెండు పెద్ద పడవలు, ఒక స్పీడ్ బోట్ను ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్నా.. అడుగు కూడా ముందుకు పడలేదు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో గోదావరి సమీపంలో పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేశారు. 60 సీట్ల పడవను ఏర్పాటు చేశారు. నిర్వహణ లేకపోవడంతో నది ఒడ్డున ఖాళీగా ఉంటుంది. నదీ తీరంలో హరిత హోటల్తో పాటు పిల్లల పార్కు, బోటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినా నిధులు కేటాయించలేదు.
ఈ పడవ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని దిగువ మానేరు జలాశయంలోనిది. క్రూయిజర్ డబుల్డక్కర్ పడవను ఏర్పాటు చేసినప్పటికీ విహరించేందుకు ఇంకా అనుమతులు రాలేదు. పడవ విహారం కోసం ప్లాట్ఫాం నిర్మించలేదు. సందర్శకులతో నిత్యం సందడిగా ఉండే దిగువ మానేరు జలాశయం పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చేపట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి.
ఈ పడవ సిరిసిల్ల జిల్లా ఎగువ మానేరు జలాశయంలోనిది. కేవలం పడవ మాత్రమే తెప్పించారు. విహరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టలేదు. ఎగువ మానేరు ప్రాంతంలో ఆహ్లాదం కోసం ఎలాంటి పనులు చేపట్టలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్ఎం కార్యాలయానికి ఆరుగురు ఉద్యోగుల సరెండర్
[ 20-04-2024]
హుజూరాబాద్ ఆర్టీసీ డిపోనకు చెందిన ఆరుగురు ఉద్యోగులను కరీంనగర్ ఆర్ఎం కార్యాలయానికి సరెండర్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్థానిక డిపోలో పనిచేసే డ్రైవర్ రవీందర్ వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ డిపో మేనేజర్ శ్రీకాంత్ ఈ నెల 15న అనిశా అధికారులకు చిక్కిన విషయం విదితమే. -
ఉక్కపోతతో తల్లీబిడ్డల ఉక్కిరిబిక్కిరి
[ 20-04-2024]
భానుడి భగభగలకు ఉదయం 9 గంటలు దాటితే ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం భయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎండలు 40 డిగ్రీల కంటే అధికంగానే ఉంటున్నాయి. -
కాంగ్రెస్ నేతలకు మానసిక చికిత్స అవసరం
[ 20-04-2024]
కాంగ్రెస్ నేతలకు మానసిక చికిత్స అవసరమని హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు అన్నారు. వారికి చికిత్స అందేలా చూడాలని శుక్రవారం కరీంనగర్లో ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కి వినతిపత్రం అందజేశారు. -
గంగుల, బండిల స్నేహం అందరికీ తెలుసు
[ 20-04-2024]
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ల మధ్య స్నేహం అందరికీ తెలుసునని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను ఓడించేందుకు గంగుల కమలాకర్ భాజపాతో కుమ్మకైనట్లు ఆరోపించారు. -
వారసత్వ సంపద పరిరక్షణకు ఓటేద్దాం
[ 20-04-2024]
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటేనే ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు, వారసత్వ కట్టడాలకు పెట్టింది పేరు. శాతవాహనులు, కాకతీయులు, నిజాముల కాలంలో నిర్మించిన కోటలు, మెట్ల బావులు, ఆలయాలు ఇక్కడ కనిపిస్తాయి. -
ఇదీ అన్నదాత ఎజెండా!
[ 20-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం వ్యవసాయపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. భిన్న వ్యవసాయ ఉత్పత్తులతో రాష్ట్రంలోనే ప్రత్యేకత చాటుకుంటోంది. దేశ విదేశాలకు ఎగుమతి చేసే పసుపు, మామిడి, మొక్కజొన్న, సన్న వరి, చెరకు, ఆవాలు, ఎర్రజొన్న, తెల్లజొన్న, సజ్జ తదితర పంటల దిగుబడిలో ఆదర్శంగా నిలుస్తున్నా అన్నదాతను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. -
ఒక ఎంపీ.. అయిదు జిల్లాలు
[ 20-04-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు గతంలో ఒకే జిల్లా పరిధిలో ఉండేవి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జిల్లాల పునర్విభజనతో ఎంపీ స్థానం అయిదు జిల్లాలకు విస్తరించింది. -
నీటి తొట్టిలో పడి బాలుడి మృతి
[ 20-04-2024]
ఇటుక బట్టీ వద్ద నీటి తొట్టిలో పడి ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. కుటుంబసభ్యులు పోలీసుల కథనం ప్రకారం.. -
శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోండి
[ 20-04-2024]
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కేజీబీవీల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థినులకు కరీంనగర్ కేజీబీవీలో నిర్వహిస్తున్న ఎప్సెట్ శిక్షణ తరగతులను సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు అధికారి మల్లయ్య భట్టు శుక్రవారం సందర్శించారు. -
కరీంనగర్లో రూ.15.81 లక్షల పట్టివేత
[ 20-04-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా శుక్రవారం పోలీసులు కరీంనగర్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రూ.15.81 లక్షల నగదును పట్టుకున్నట్లు కమిషనర్ కార్యాలయం తెలిపింది. -
ఇంటి నుంచే ఓటింగ్పై అధికారులకు శిక్షణ
[ 20-04-2024]
ఇంటినుంచే ఓటింగ్పై పాటించాల్సిన నిబంధనలపై అధికారులకు మంథని శాసనసభ సెగ్మెంట్ అధికారి హనుమనాయక్ అవగాహన కల్పించారు. శుక్రవారం మంథని ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులకు శిక్షణ ఇచ్చారు. -
అడుగడుగునా తనిఖీలతో ప్రలోభాలకు అడ్డుకట్ట
[ 20-04-2024]
ఎన్నికల్లో డబ్బు, మద్యం, మాదకద్రవ్యాల పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. లోక్సభ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో జిల్లా సరిహద్దు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
పెరుగుతున్న పసిడి ధరలు... తగ్గుతున్న వ్యాపారం
[ 20-04-2024]
బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకి వెళుతున్నాయి. గతంలో పెళ్లి ముహూర్తాల సమయంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టేవి. దీనికి భిన్నంగా మార్కెట్లో ప్రస్తుతం పసిడి ధర పది గ్రాములు(తులం) రూ.76,000 వరకు పలుకుతోంది. -
కిట్టు సరే.. పరీక్ష చేసేవారేరీ?
[ 20-04-2024]
కలుషిత నీటితో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో ప్రజలకు శుద్ధ జలం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అక్కడక్కడ పైపులు పగిలి లీకేజీతో కలుషితమైన నీరు సరఫరా అయ్యే అవకాశం ఉంది. -
ఆరేళ్లుగా ఉపాధి కరవు
[ 20-04-2024]
వలసల నివారణకు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల కోసం ఆరేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఆ కుటుంబాలకు పనులు కల్పించడం లేదు. -
ప్రజలు మళ్లీ మోసపోవద్దు
[ 20-04-2024]
భాజపా అభ్యర్థి అర్వింద్ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. పొద్దునలేస్తే హిందూ-ముస్లిం, పాకిస్థాన్-ఇండియా, రోహింగ్యాంటూ మాటలు చెప్పడమే గాని ఎంపీగా ప్రజలకు చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. -
‘పసుపు బోర్డు పేరుతో మోసం’
[ 20-04-2024]
పసుపు బోర్డు పేరుతో ఎంపీ ధర్మపురి అర్వింద్ రైతులను మోసం చేశారని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు కూడా మభ్యపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!