గ్యాస్బండ భారమే
చమురు సంస్థలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను మళ్లి పెంచాయి. నెల గడవటమే తరువాయి మరింత భారం మోపాయి. ఈ ఏడాది మే నెలలో రూ.50.50పైసలు పెంచిన కంపెనీలు ప్రస్తుతం మరో రూ.50 పెంచుతూ ప్రకటనల
అందనంత దూరంలో ఎల్పీజీ ధరలు
భగత్నగర్, న్యూస్టుడే: చమురు సంస్థలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను మళ్లి పెంచాయి. నెల గడవటమే తరువాయి మరింత భారం మోపాయి. ఈ ఏడాది మే నెలలో రూ.50.50పైసలు పెంచిన కంపెనీలు ప్రస్తుతం మరో రూ.50 పెంచుతూ ప్రకటనల జారీ చేశాయి. ప్రస్తుతం రూ.1074 ధర పలుకుతున్న గ్యాస్ సిలిండర్ పెరిగిన ధరతో రూ.1124కు చేరుకుంది. అసలే ఉపాధి అవకాశాలు అడుగంటుతూ నిత్యావసర సరకుల ధరలు పెరుగుతున్న తరుణంలో గ్యాస్ సిలిండర్ ధర పెరగడంతో వినియోగదారులకు మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా మారింది. కరోనా కల్లోల పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కొలుకుంటున్న సామాన్య ప్రజలకు పులిమీద పుట్రలా ఉక్రెయిన్-రష్యా యుద్ధం వంటింటి నూనె ధరలను అమాంతం పెంచేశాయి. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరగడంతో జిల్లాలో సుమారు 2,89,500 మంది ఎల్పీజీ కనెక్షన్ దారులకు రూ.1,44,75000 భారం పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
మేలో మురిపించారు..
చమురు సంస్థలు గత రెండేళ్లుగా క్రమం తప్పకుండా గ్యాస్ ధరలను పెంచుతూ వస్తున్నాయి తప్పితే తగ్గించడంలేదు. మే 7న రూ.50.50 పెంచిన చమురు సంస్థలు ఇదే నెల 19న రూ.2.50లు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. వినియోగదారుల్లో కొంత ఆశలు చిగురించాయి. ఇక నుంచి ధరలు తగ్గే అవకాశం ఉందని ఆశించారు. అంతలోనే వారి ఆశలను ఆవిరిచేస్తూ మరోమారు పెంచేశాయి. పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.
కిరోసిన్ వాడకాన్ని దూరం చేశారు
కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ వాడకాన్ని పెంచుతూ కిరోసిన్ వాడకాన్ని తగ్గించేసింది. రెండేళ్ల కిందటి వరకు జిల్లాలో 71,529 లీటర్ల కిరోసిన్ వంటకోసం వాడుకునేవారు. ఈ కిరోసిన్ సరఫరాను ప్రభుత్వం క్రమంగా తొలగించేసింది. పేదలు ఎల్పీజీ గ్యాస్ వాడాల్సిన పరిస్థితిని కల్పించింది. కిరోసిన్ నిలిపివేసిన సమయంలో సిలిండర్ ధర రూ.656.50 ఉండేది. ప్రస్తుతం సుమారు రెండింతలు పెరిగింది. నిరుపేదలు గ్యాస్ కొనలేక.. కిరోసిన్ అందుబాటులో లేక మళ్లీ కట్టెలపొయ్యి ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఉజ్వల పథకం కొందరికే..
ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద ఎల్పీజీ కనెక్షన్ పొందిన వారికి రాయితీ రూ.250 బ్యాంకు ఖాతాలో జమచేస్తోంది. జిల్లాలో సుమారు 14,480 మందికి ఈ పథకం కింద కనెక్షన్లు ఇచ్చినట్లు సమాచారం. కాగా ఈ కనెక్షన్లు పొందిన వారిలో పేదలకన్న రాజకీయ నాయకుల అనుచరులే ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిరుపేదల కోసం రాయితీతో ఇస్తున్న ఉజ్వల పథకం పక్కదారి పట్టడంతో వారు బహిరంగమార్కెట్ ధరకే ఎల్పీజీ గ్యాస్ను కొనుగోలు చేయాల్సి వస్తోంది.
గతంలో మాదిరిగా రాయితీ ఇవ్వాలి
-సంధ్య, గృహిణి
అడ్డగోలుగా గ్యాస్ ధర పెంచారు. గతంలో ధర పెంచినా రాయితీ ఇవ్వడంతో పెద్దగా భారం అనిపించేది కాదు. ప్రస్తుతం రాయితీ కొన్ని వర్గాలకే పరిమితం చేయడంతో నష్టపోతున్నాం. రాయితీని పునరుద్ధరించాలి.
ఇబ్బందులు పడుతున్నాం..
- బచ్చు ప్రభాకర్, టైలరింగ్
గ్యాస్ ధర రూ.వెయ్యి దాటడంతో కొనడానికి ఇబ్బంది పడుతున్నాం. ధర తగ్గించాలి. పెద్దమొత్తం వెచ్చించాలంటే ఇబ్బంది అనిపిస్తోంది. అన్ని వస్తువుల ధరలు పెరిగిన స్థాయిలో ఆదాయం పెరగడంలేదు. ఇబ్బందిపడుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..