మళ్లీ తెరపైకి కొత్త మండలాల ప్రతిపాదన..?
జిల్లాలో గతంలో వినిపించిన పలు కొత్త మండలాల ఏర్పాటు విషయమై జిల్లా రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. పరిపాలన సౌలభ్యం కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా 2016లో నాలుగు జిల్లాలుగా విడిపోయిన సంగతి
ఈనాడు, కరీంనగర్: జిల్లాలో గతంలో వినిపించిన పలు కొత్త మండలాల ఏర్పాటు విషయమై జిల్లా రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. పరిపాలన సౌలభ్యం కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా 2016లో నాలుగు జిల్లాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే.! ఇదే సమయంలో అప్పటి పరిస్థితులను బట్టి భౌగోళిక స్థితిగతులు, ఇతరత్రా అంశాలను పరిగణలోకి తీసుకుని 16 మండలాలతో కరీంనగర్ జిల్లాను ఏర్పాటు చేశారు. ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలోనూ ఇల్లందకుంట మండలం వావిలాలపల్లిని, వీణవంక మండలం చల్లూర్ గ్రామాన్ని కొత్త మండలంగా మారుస్తామనే హామీలు అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధుల నుంచి వినిపించాయి. తాజాగా ఇదే విషయమై జిల్లా రెవెన్యూ అధికారులు గతంలో ఉన్న ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కొన్ని మండలాల తహసీల్దార్లకు గతంలో ఉన్న డిమాండ్ల గురించి ఆరా తీసినట్లు తెలిసింది. ఏఏ గ్రామాల పరిధితో నూతన మండల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందనేలా సాధ్యాసాధ్యాల విషయమై సమాచారాన్ని అడిగినట్లు రెవెన్యూ వర్గాల ద్వారా తెలిసింది. ఇందుకోసం ఆయా గ్రామాలతో కూడిన మ్యాప్లను రూపొందించాలని కొందరు తహసీల్దార్లకు జిల్లా కలెక్టరేట్ నుంచి ఆదేశాలందినట్లు వినికిడి. జిల్లాలో ఈ రెండు గ్రామాలే కాకుండా రామడుగు మండలం గోపాల్రావుపేట, గంగాధర మండలం గర్శకుర్తి, మానకొండూర్ మండలంలోని పచ్చనూర్ను ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ఆయా గ్రామాలనుంచి గతం నుంచి వినిపిస్తున్నాయి. కాగా ఈ విషయాన్ని జిల్లాధికారులు బయటకు వెళ్లడించకుండా రహస్యంగా వివరాల్ని సేకరిస్తున్నారు. రాష్ట్రస్థాయి అధికారులు ఏ క్షణాన అడిగినా..ఇక్కడి సమాచారం తెలియజెప్పేలా జిల్లాధికారులు సమాచారాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూసేకరణలో జాప్యం
[ 28-03-2024]
భూసేకరణలో జాప్యమే జాతీయ రహదారుల విస్తరణకు శాపంగా మారుతోంది. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిగా మార్చి దశాబ్దం కావస్తున్నా.. నిర్మాణం మొదలు కావటం లేదు -
నత్తనడకన నిర్మాణాలు
[ 28-03-2024]
వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పల్లెదవాఖానాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర(సబ్సెంటర్ల)ను పల్లె దవాఖానాలుగా మార్చారు -
నిధులు వెచ్చించి.. పనులు వదిలేసి
[ 28-03-2024]
పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఆధునిక సాంకేతికను జోడించి పెద్ద నగరాలకు దీటుగా పోటీ పడేందుకు ప్రణాళికలు చేసిన నగరపాలిక.. ఆ విధానం అమలులో వెనుకబడింది -
తాగునీటి వృథా వద్దు : కలెక్టర్
[ 28-03-2024]
అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
కాంగ్రెస్ నిజామాబాద్ లోక్సభ స్థానం టికెట్ జీవన్రెడ్డికే దక్కింది. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది -
తొలిమెట్టు నోడల్ అధికారులకు భత్యం
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక బోధన పద్ధతులతో కొనసాగుతున్న ఈ కార్యక్రమ పర్యవేక్షణకు మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 28-03-2024]
వాతావరణ సమాచారాన్ని ప్రతిఒక్కరి దైనందిన కార్యకలాపాల్లో భాగం చేయాలనే ఉద్దేశంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇటీవల ‘పంచాయత్ మౌసం సేవా’ మొబైల్ యాప్ విడుదల చేసింది. -
పఠనాలయం సద్వినియోగం... కల సాకారం
[ 28-03-2024]
గ్రంథాలయ పుస్తకాలతోనే ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించగలిగాను. తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ నిర్వహించిన ఫలితాల్లో పీజీటీ సాంఘికశాస్త్రం, జూనియర్ కళాశాలలో పౌరశాస్త్రం లెక్చరర్గా ఉద్యోగాలకు ఎంపికయ్యాను -
పంచాయతీల ఖజానా ఖాళీ
[ 28-03-2024]
ఓవైపు ఖజానా ఖాళీ, మరోవైపు సమస్యలు పంచాయతీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జమయ్యే నిధులకు మించిన వ్యయం చేయడంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఓటు నమోదుకు ప్రత్యేక సాధారణ సెలవు
[ 28-03-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?