స్వచ్ఛతకు పెద్దపీట
స్వచ్ఛత పాటిస్తూ ఆవరణను ఆహ్లాదంగా మారుస్తున్న పాఠశాలలకు స్వచ్ఛ విద్యాలయ్ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఇప్పటికే దరఖాస్తుల పక్రియ పూర్తవగా, జిల్లాలోని 36 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 2021-22 సంవత్సరానికి
ఎనిమిది రాష్ట్రస్థాయి, 28 జిల్లా పురస్కారాలకు ఎంపిక
న్యూస్టుడే-కరీంనగర్ విద్యావిభాగం
స్వచ్ఛత పాటిస్తూ ఆవరణను ఆహ్లాదంగా మారుస్తున్న పాఠశాలలకు స్వచ్ఛ విద్యాలయ్ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఇప్పటికే దరఖాస్తుల పక్రియ పూర్తవగా, జిల్లాలోని 36 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 2021-22 సంవత్సరానికి సంబంధించి జిల్లా స్థాయి స్వచ్ఛ విద్యాలయ్ పురస్కారాలు లభించగా, వీటిలోని ఎనిమిది రాష్ట్ర స్థాయి పురస్కారాలకు అర్హత సాధించాయి.
ఈ అంశాలే ప్రధానం..
పాఠశాలల్లో నీరు, మరుగుదొడ్ల పరిస్థితి, సబ్బుతో బాలలు చేతులు కడుక్కోవడం, ఉపయోగం-నిర్వహణ, విద్యార్థుల ప్రవర్తనలో మార్పు, సామర్థ్యాల నిర్మాణం అంశాలను సక్రమంగా అమలు తీరు ఆధారంగా స్వచ్ఛ గ్రేడ్లు ఇస్తూ పురస్కారానికి ఎంపిక చేస్తారు. అన్ని అంశాల్లో మెరుగ్గా ఉన్న బడులతో పాటు ఒక్కో అంశంలో మెరుగైన వాతావరణం కల్పించే పాఠశాలలు కూడా పురస్కారాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాయి. 2018-19 నుంచి 2020-21 వరకు ఈ పురస్కారాలను ప్రభుత్వం అందించలేదు.
జాతీయస్థాయికి అర్హత...
జిల్లాలో ప్రభుత్వ, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలు 675 ఉండగా, ప్రైవేటు పాఠశాలలు 282 ఉన్నాయి. స్వచ్ఛ విద్యాలయ్ పురస్కారాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాయి. ప్రధానోపాధ్యాయులు స్వచ్ఛ కార్యక్రమాల అమలు, ఫొటోల ఆధారంగా విద్యాశాఖ అధికారులు జిల్లా స్థాయి పురస్కారాల కోసం పరిశీలించారు. వచ్చిన మార్కుల ఆధారంగా 36 పాఠశాలలను పురస్కారాలకు ఎంపిక చేశారు. ఇందులో శ్రీప్రగతి పాఠశాల(రామడుగు), ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల(నర్సింగపూర్, తిమ్మాపూర్ మండలం), ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల(కొండాపూర్, చిగురుమామిడి మండలం), జడ్పీ ఉన్నత పాఠశాల(ఓడ్యారం, గంగాధర్ మండలం), ఆదర్శ పాఠశాల(మానకొండూర్), శ్రీచైతన్య ఉన్నత పాఠశాల(రామడుగు), ఎక్స్ప్లోరికా ప్రాథమికోన్నత పాఠశాల(కరీంనగర్), అల్ఫోర్స్ ఉన్నత పాఠశాల(కరీంనగర్)లు జిల్లాలో అన్ని అంశాల్లో ఉత్తమంగా నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. ఇవి జాతీయ స్థాయి పురస్కారానికి అర్హత సాధించే అవకాశం ఉంది.
జిల్లాలో ఇలా...
చిగురుమామిడి మండలంలో ప్రభుత్వ ప్రాథమికొన్నత పాఠశాల కొండాపూర్, రామడుగు మండలం గోపాల్రావుపేటలోని శ్రీప్రగతి పాఠశాలలు నాలుగు సబ్ కేటగిరిల్లో, గంగాధర మండలంలోని ఓడ్యారం జడ్పీ ఉన్నత పాఠశాల, మానకొండూర్లోని శాంతినికేతన్ ప్రైమరీ స్కూల్ రెండు సబ్ కేటగిరిల్లో ఎంపికయ్యాయి. చొప్పదండిలోని జవహర్ నవోదయ విద్యాలయం, కరీంనగర్లోని ప్రభుత్వ ప్రాథమికొన్నత పాఠశాల(తీగలగుట్టపల్లి), ఎక్స్ప్లోరికా యూపీఎస్, ఆద్విత ఇంటర్నేషనల్ స్కూల్, కాకతీయ ఉన్నత పాఠశాల, విద్యార్థి యూపీఎస్, కేజీబీవీ, కోరా ఉన్నత పాఠశాల, వివేకానంద విద్యానికేతన్, విద్యాసంస్కార్ మంటెస్సోరి పాఠశాల, కరీంనగర్ రూరల్ మండలం నుంచి నగునూర్, చామనపల్లిలలోని జడ్పీ ఉన్నత పాఠశాలలు, కొత్తపల్లి మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాల చింతకుంట, రామడుగు మండలం గోపాల్రావుపేటలోని అల్ఫోర్స్ ఉన్నత పాఠశాల, శంకరపట్నం మండలంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల కరీంపేట, తిమ్మాపూర్ మండలంలోని ఫ్రీడం ఫైటర్ పాఠశాలలు ఎంపికయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!