అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలి
వస్త్రోత్పత్తి రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతూ నాణ్యమైన ఉత్పత్తులను తీసుకొచ్చినపుడే గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్ పేర్కొన్నారు. కమిషనర్గా బాధ్యతలు
చేనేత, జౌళిశాఖ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్
సిరిసిల్లలో బతుకమ్మ చీరల డిజైన్లను కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్కు వివరిస్తున్న ఆసామి రామచంద్రం
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల: వస్త్రోత్పత్తి రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతూ నాణ్యమైన ఉత్పత్తులను తీసుకొచ్చినపుడే గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్ పేర్కొన్నారు. కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బుధవారం తొలిసారి సిరిసిల్లకు వచ్చారు. సిరిసిల్లలో విస్తృతంగా పర్యటించారు. మరమగ్గాల వస్త్రోత్పత్తి అంటేనే సిరిసిల్లగా గుర్తింపు ఉందని, ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. వారి జీవనస్థితిగతులను మెరుగుపర్చుకోవాలంటే ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని చెప్పారు. తొలుత సిరిసిల్ల పట్టణంలో బతుకమ్మ చీరలు, ఏకరూప దుస్తుల ఉత్పత్తి తీరును పరిశీలించారు. వాటి డిజైన్లు, అందులో వాడే నూలు రకాలను వస్త్రోత్పత్తిదారులను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమలో నూలు నుంచి వస్త్రం ఉత్పత్తి అయ్యే వరకు వివిధ దశలను పరిశీలించారు. అందులో పని చేస్తున్న వార్పిన్, వైపని, డైయింగ్, ప్రాసెసింగ్, కార్మికుల పని తీరు, వేతనాలు తదితరాలను చేనేత, జౌళిశాఖ అధికారులు వివరించారు. ప్రభుత్వ ఆర్డర్లను నిర్ణీత సమయంలోగా ఉత్పత్తి చేసి అప్పగించాలని పరిశ్రమ వర్గాలకు సూచించారు.
పెద్దూరులోని అపారెల్ పార్కులో ఉత్పత్తులను కమిషనర్కు చూపుతున్న కంపెనీ సిబ్బంది
తర్వాత పెద్దూరులోని అపారెల్ పార్కులో గ్రీన్పిన్ కంపెనీని సందర్శించారు. అక్కడ తయారు చేస్తున్న ఉత్పత్తులను చూశారు. కంపెనీలో ప్రస్తుతం యాభైశాతం యంత్రాలతో మాత్రమే ఉత్పత్తి జరుగుతుందని, పరిశ్రమకు సంబంధించి వివిధ దశల్లో గుర్తింపులు వచ్చాక త్వరలోనే వందశాతం ఉత్పత్తులు ప్రారంభిస్తామని నిర్వాహకులు కమిషనర్కు వివరించారు. అందులో పని చేస్తున్న మహిళలతో మాట్లాడి ఉపాధి పొందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. దాని పక్కనే ఉన్న గ్రూప్ వర్క్షెడ్ను సందర్శించారు. కార్మికుల శిక్షణ కోసం తీసుకొచ్చిన యంత్రాల పని తీరు, వాటి ఉత్పత్తి సామర్థ్యం తదితర అంశాలను కంపెనీ సాంకేతిక నిపుణులు వివరించారు. లబ్ధిదారుల ఎంపిక, కార్మికుల శిక్షణను త్వరలో పూర్తి చేయాలని ఆదేశించారు. వర్క్షెడ్ల నిర్మాణ ప్రగతిపై ఆరా తీశారు. అక్కడి నుంచి తంగళ్లపల్లి మండలం మండెపల్లిలోని టెక్స్టైల్ పార్కుకు వెళ్లి అందులోని యజమానులతో సమావేశమయ్యారు. వస్త్రోత్పత్తులతోపాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్కులో పరిశ్రమలు నడపలేక మూసివేసిన వారికి ప్రభుత్వం నుంచి ఎన్ఓసీ క్లియరెన్స్ ఇప్పించాలని కోరారు. నిబంధనల ప్రకారం త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఆయన వెంట కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, చేనేత, జౌళిశాఖ అధికారులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
[ 19-04-2024]
కమాన్పూర్ మండలం రొంపికుంట ఉపకేంద్రం పరిధిలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ట్రాన్స్ కో ఏఈ రాజేంద్ర కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!