Huzurabad : సవాళ్ల పోరు.. విమర్శల జోరు
హుజూరాబాద్లో రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. తెరాసతోపాటు భాజపా శ్రేణులు నువ్వా-నేనా అనేలా ఇక్కడి నియోజకవర్గ అభివృద్ధిపై సవాళ్లు ప్రతి సవాళ్లు విసుకుంటున్నారు. దాదాపు పది నెలల కిందట జరిగిన ఉప ఎన్నికలతో ఇక్కడి హోరాహోరీ
హుజూరాబాద్లో తెరాస, భాజపా ఘర్షణ
నేటి బహిరంగ చర్చపై ఉత్కంఠ
ఈనాడు, కరీంనగర్
తెరాస, భాజపా కార్యకర్తల ఘర్షణను నివారిస్తున్న పోలీసులు
హుజూరాబాద్లో రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. తెరాసతోపాటు భాజపా శ్రేణులు నువ్వా-నేనా అనేలా ఇక్కడి నియోజకవర్గ అభివృద్ధిపై సవాళ్లు ప్రతి సవాళ్లు విసుకుంటున్నారు. దాదాపు పది నెలల కిందట జరిగిన ఉప ఎన్నికలతో ఇక్కడి హోరాహోరీ తీరు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపును అందుకుంది. ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించడంతో అధికార తెరాస కూడా తమ పార్టీ ప్రాబల్యాన్ని నిలుపుకొనేలా పలు కార్యక్రమాలతో ఇన్నాళ్లుగా జోరుని చూపిస్తోంది. ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి తెరాసకు మారి ఎమ్మెల్సీ పదవిని అందుకున్న పాడి కౌశిక్రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే ఈట రాజేందర్ కూడా రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూనే నియోజకవర్గంలో పర్యటిస్తూ తన మార్క్ను వేసుకుంటున్నారు. గడిచిన వారం రోజులుగా ఇటు తెరాస, అటు భాజపా నియోజకవర్గ అభివృద్ధి విషయమై సవాళ్ల జోరుని చూపిస్తున్నాయి. తెరాస అందిస్తున్న ప్రగతియే నియోజకవర్గంలో కనిపిస్తుందని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొంటూనే.. తనతో నియోజకవర్గ అభివృద్ధి విషయమై బహిరంగ చర్చకు ఈటల రావాలని డిమాండ్ చేశారు. ఇందుకు ప్రతిగా స్పందించిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. హుజూరాబాద్లో కళ్లకు కనిపిస్తున్న అభివృద్ధి అంతా తానే చేసిందని.. తన రాజీనామా వల్లనే ప్రగతి ఫలాలు అందాయనేలా తన వాణిని వినిపించారు. ప్రజలకే తాను జవాబుదారినని విలువలు లేని నాయకులను పట్టించుకోనని తనదైన తరహాలో ప్రత్యర్థి నేత సవాలుని తిప్పికొట్టారు.
పోటాపోటీగా ఫ్లెక్సీలు..
మొదట తెరాస ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి చర్చకు తాను సిద్ధమేనని తేదీని ఖరారు చేస్తూ.. ఎమ్మెల్యేను చర్చకు రావాలనేలా భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయించడం చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమక్షంలో స్థానిక అంబేడ్కర్ కూడలి వద్దకు 5వ తేదీన(నేడు) ఉదయం 10 గంటలకు సమయానికి రావడానికి తెరాస శ్రేణులంతా సిద్ధమేనని అందులో పేర్కొనడంతో ఇది రాజకీయ దుమారాన్ని రేపింది. దీనికి స్పందించిన భాజపా నాయకులు కూడా ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి వైఖరిని తెలియజెప్పేలా పెద్ద ఫ్లెక్సీని పట్టణంలో ఏర్పాటు చేశారు. అభివృద్ధిపై చర్చకు భాజపా సిద్ధమని తమ నేత ఈటల రాజేందర్తో చర్చకు కూర్చునే అనుభవం ప్రత్యర్థులకు లేదనేలా ఫ్లెక్సీలో ఎదుటి పార్టీ నేతల వైఖరిని ఖండించేలా వ్యాఖ్యల్ని రాశారు. గురువారం సాయంత్రం పట్టణంలో కూడలి వద్ద ఇరుపార్టీల నాయకులు పార్టీ తోరణాల్ని కట్టే సమయంలో మాటామాట పెరిగి ఘర్షణకు దిగారు. కర్రలతో దాడులు చేసుకున్నారు. పోలీసులు తెరాస- భాజపా శ్రేణుల్ని సముదాయించే ప్రయత్నం చేశారు. ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలోనే సీఐకి స్వల్ప గాయాలయయ్యాయి. నేటి ఉదయం 10 గంటలకు బహిరంగ చర్చ విషయమై ఉద్రిక్తత వాతావరణం ఉండటంతో పోలీసులు తమదైన భద్రతా పరమైన చర్యల్ని తీసుకుంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ముందుగానే ఇరుపార్టీల నేతల్ని గృహనిర్బంధం చేసేలా ప్రయత్నిస్తున్నారు. నేడు ఎం జరుగుతుందోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది. మరోవైపు ఈ నియోజకవర్గంలోని తెరాస నేతలైన ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, ఇటీవల ఉప ఎన్నికల్లో పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ల మధ్య ఉన్న దూరం మరోసారి వారి మాటలతో బహిర్గతమైంది. శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. తనకు నేటి బహిరంగ చర్చ గురించి తెలవదని.. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే వెళ్తానని చెప్పడం గమనార్హం.! మరోవైపు వచ్చే ఎన్నికల్లో తెరాస తరపున తనకే టికెట్ వస్తుందనే ఆశాభావాన్ని బాహాటంగా వెళ్లడించగా.. రెండు మూడురోజుల కిందట పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తానే గెలుస్తాననడం.. పార్టీలో ఇప్పుడే వీరిద్దరి మధ్య టికెట్ విషయమై జరుగుతున్న పోటీ మరో చర్చనీయాంశంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూసేకరణలో జాప్యం
[ 28-03-2024]
భూసేకరణలో జాప్యమే జాతీయ రహదారుల విస్తరణకు శాపంగా మారుతోంది. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిగా మార్చి దశాబ్దం కావస్తున్నా.. నిర్మాణం మొదలు కావటం లేదు -
నత్తనడకన నిర్మాణాలు
[ 28-03-2024]
వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పల్లెదవాఖానాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర(సబ్సెంటర్ల)ను పల్లె దవాఖానాలుగా మార్చారు -
నిధులు వెచ్చించి.. పనులు వదిలేసి
[ 28-03-2024]
పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఆధునిక సాంకేతికను జోడించి పెద్ద నగరాలకు దీటుగా పోటీ పడేందుకు ప్రణాళికలు చేసిన నగరపాలిక.. ఆ విధానం అమలులో వెనుకబడింది -
తాగునీటి వృథా వద్దు : కలెక్టర్
[ 28-03-2024]
అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
కాంగ్రెస్ నిజామాబాద్ లోక్సభ స్థానం టికెట్ జీవన్రెడ్డికే దక్కింది. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది -
తొలిమెట్టు నోడల్ అధికారులకు భత్యం
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక బోధన పద్ధతులతో కొనసాగుతున్న ఈ కార్యక్రమ పర్యవేక్షణకు మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 28-03-2024]
వాతావరణ సమాచారాన్ని ప్రతిఒక్కరి దైనందిన కార్యకలాపాల్లో భాగం చేయాలనే ఉద్దేశంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇటీవల ‘పంచాయత్ మౌసం సేవా’ మొబైల్ యాప్ విడుదల చేసింది. -
పఠనాలయం సద్వినియోగం... కల సాకారం
[ 28-03-2024]
గ్రంథాలయ పుస్తకాలతోనే ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించగలిగాను. తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ నిర్వహించిన ఫలితాల్లో పీజీటీ సాంఘికశాస్త్రం, జూనియర్ కళాశాలలో పౌరశాస్త్రం లెక్చరర్గా ఉద్యోగాలకు ఎంపికయ్యాను -
పంచాయతీల ఖజానా ఖాళీ
[ 28-03-2024]
ఓవైపు ఖజానా ఖాళీ, మరోవైపు సమస్యలు పంచాయతీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జమయ్యే నిధులకు మించిన వ్యయం చేయడంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఓటు నమోదుకు ప్రత్యేక సాధారణ సెలవు
[ 28-03-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!