కొరవడిన నిఘా
పంటల్లో చీడపీడల నిరోధానికివాడే సస్యరక్షణ మందుల అమ్మకాలపై నిఘాకొరవడి రైతులకు ఆర్థిక నష్టాన్ని మిగులుస్తోంది. ఉత్పాదకాలను ఇష్టారీతిన అమ్మటంతో దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి.
ఇష్టారాజ్యంగా పురుగు మందుల అమ్మకం
న్యూస్టుడే, జగిత్యాల వ్యవసాయం
దుకాణంలో సస్యరక్షణ మందులు
పంటల్లో చీడపీడల నిరోధానికివాడే సస్యరక్షణ మందుల అమ్మకాలపై నిఘాకొరవడి రైతులకు ఆర్థిక నష్టాన్ని మిగులుస్తోంది. ఉత్పాదకాలను ఇష్టారీతిన అమ్మటంతో దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. జిల్లాలో 1.75 లక్షల మంది రైతులు సాధారణ పరిస్థితుల్లో ఒక సీజన్లో 4.42 లక్షల ఎకరాల్లో ఆహార, ఉద్యాన పంటలను సాగుచేస్తారు. దిగుబడుల సాధనకు ఇటీవల ప్రతి పంటలోనూ రసాయన ఎరువులు, పురుగు మందులు, కలుపు నివారణ, పోషకాల వాడకం తప్పనిసరిగా మారింది. పత్తిలో హెక్టారుకు 3.6 లీటర్ల నుంచి 5-8 లీటర్ల వరకు పురుగు మందులను వాడుతున్నారు. వరిలో హెక్టారుకు 3.2 లీటర్ల క్రిమిసంహారక మందులు, 10 కిలోల గుళికలను వేస్తుండగా మొక్కజొన్నలో 7.0 కిలోల గుళికలు, మామిడిలో 15 లీటర్ల మందు, మిగిలిన పంటల్లోనూ 1.5-3.5 లీటర్ల మందును రైతులు వాడుతున్నారు.
నష్టం ఇలా..
పలుచోట్ల వ్యవసాయశాఖ లైసెన్స్ లేనివారు, శిక్షణ పొందనివారు, కిరాణాలు, గ్రామాల్లో తిరిగే కంపెనీల ప్రతినిధులు రైతులకు పంట ఉత్పాదకాలను విక్రయిస్తున్నారు. గంట గుళికలు, పసలేని పోషకాలు, బయోలు, సేంద్రియ ఎరువులను అంటగడుతున్నారు. చాలామంది రైతులు తమ పంట నమూనాలను దుకాణాలకు తీసుకువచ్చి సస్యరక్షణ మందులను కొని తీసుకెళ్లి వాడుతున్నారు. ఇదే సమయంలో అనుభవంలేని కొందరు దుకాణాదారులు పురుగుమందు, తెగుళ్లమందు, పోషకాన్నిఇచ్చి ఒకేసారి పంటపై వాడాలని రైతులకు సూచిస్తున్నారు. దీనివల్ల రైతుకు ఖర్చు పెరగటం, మొక్కల్లో మందుల అవశేషాలు పెరిగి ఆరోగ్యాలకు నష్టంచేస్తోంది. సరైన మందు ఇవ్వనపుడు చీడపీడలు, కలుపు నివారణ జరగక మరోసారి మందులను మార్చి పిచికారి చేయాల్సి వస్తోంది. మందుల తీవ్రతను తెలపకపోవటం, మందులను చల్లుతున్నపుడు జాగ్రత్తలను చెప్పక పోవటంతో రైతులు మృత్యువాత పడుతున్న సంఘటనలూ జరుగుతున్నాయి.
అర్హులకు అవకాశం..
పంట ఉత్పాదకాలను విక్రయించేచోట నిపుణులైనవారు అందుబాటులో ఉన్నట్లయితే రైతులకు అనవసర మందుల వాడకం తగ్గి ఆర్థికంగా కలిసివస్తుంది. ఇప్పటికే జిల్లాలో పలువురు దుకాణాలు నిర్వహిస్తున్నవారు వ్యవసాయ వర్సిటీ కోర్సును పూర్తిచేసి సర్టిఫికెట్ పొందారు. ఏజీబీఎస్సీ, రసాయనశాస్త్ర డిగ్రీ లేదా వ్యవసాయ వర్సిటీ డిప్లొమా పూర్తిచేసినవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ సర్టిఫికెట్లు లేనివారి దుకాణాల్లో పురుగు మందులను విక్రయించకుండా వ్యవసాయ అధికారులు చర్యలు చేపట్టాలి. కేవీకేలు, వ్యవసాయశాఖ సమేతి, హైదరాబాద్లోని మేనేజ్సంస్థ ద్వారానూ పురుగుమందుల అమ్మకాలపై సర్టిఫికెట్ కోర్సును నేర్చుకోవచ్చు. ఈ నిబంధనలతో పాటుగా అధికారులు చీటీ రాసిస్తేనే దుకాణదారులు రైతులకు మందులను అమ్మాలనే నిబంధనలను కూడా అమలు చేయాల్సిఉంది. దీనిపై డీఏవో పి.సురేశ్కుమార్ మాట్లాడుతూ రైతులు లైసెన్స్ గల దుకాణాల్లోనే మందులను తీసుకోవాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూసేకరణలో జాప్యం
[ 28-03-2024]
భూసేకరణలో జాప్యమే జాతీయ రహదారుల విస్తరణకు శాపంగా మారుతోంది. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిగా మార్చి దశాబ్దం కావస్తున్నా.. నిర్మాణం మొదలు కావటం లేదు -
నత్తనడకన నిర్మాణాలు
[ 28-03-2024]
వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పల్లెదవాఖానాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర(సబ్సెంటర్ల)ను పల్లె దవాఖానాలుగా మార్చారు -
నిధులు వెచ్చించి.. పనులు వదిలేసి
[ 28-03-2024]
పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఆధునిక సాంకేతికను జోడించి పెద్ద నగరాలకు దీటుగా పోటీ పడేందుకు ప్రణాళికలు చేసిన నగరపాలిక.. ఆ విధానం అమలులో వెనుకబడింది -
తాగునీటి వృథా వద్దు : కలెక్టర్
[ 28-03-2024]
అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
కాంగ్రెస్ నిజామాబాద్ లోక్సభ స్థానం టికెట్ జీవన్రెడ్డికే దక్కింది. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది -
తొలిమెట్టు నోడల్ అధికారులకు భత్యం
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక బోధన పద్ధతులతో కొనసాగుతున్న ఈ కార్యక్రమ పర్యవేక్షణకు మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 28-03-2024]
వాతావరణ సమాచారాన్ని ప్రతిఒక్కరి దైనందిన కార్యకలాపాల్లో భాగం చేయాలనే ఉద్దేశంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇటీవల ‘పంచాయత్ మౌసం సేవా’ మొబైల్ యాప్ విడుదల చేసింది. -
పఠనాలయం సద్వినియోగం... కల సాకారం
[ 28-03-2024]
గ్రంథాలయ పుస్తకాలతోనే ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించగలిగాను. తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ నిర్వహించిన ఫలితాల్లో పీజీటీ సాంఘికశాస్త్రం, జూనియర్ కళాశాలలో పౌరశాస్త్రం లెక్చరర్గా ఉద్యోగాలకు ఎంపికయ్యాను -
పంచాయతీల ఖజానా ఖాళీ
[ 28-03-2024]
ఓవైపు ఖజానా ఖాళీ, మరోవైపు సమస్యలు పంచాయతీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జమయ్యే నిధులకు మించిన వ్యయం చేయడంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఓటు నమోదుకు ప్రత్యేక సాధారణ సెలవు
[ 28-03-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా