సై అంటే సై
అభివృద్ధిపై చర్చ హుజూరాబాద్ను అట్టుడికించింది. హోరాహరీ నినాదాలతో అంబేడ్కర్ చౌరస్తా మారుమోగింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూడు గంటల పాటు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తెరాసకు చెందిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఇటీవల ఉప ఎన్నికల్లో గెలుపొందిన భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు సవాలు విసిరారు.
హుజూరాబాద్లో భాజపా, తెరాస రాజకీయ పోరు
మూడు గంటలపాటు ఉద్రిక్తత
ఈనాడు, కరీంనగర్, న్యూస్టుడే, హుజూరాబాద్, పట్టణం, గ్రామీణం
భాజపా కార్యకర్తలను పోలీసు స్టేషన్కు తరలిస్తున్న దృశ్యం
అభివృద్ధిపై చర్చ హుజూరాబాద్ను అట్టుడికించింది. హోరాహరీ నినాదాలతో అంబేడ్కర్ చౌరస్తా మారుమోగింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూడు గంటల పాటు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తెరాసకు చెందిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఇటీవల ఉప ఎన్నికల్లో గెలుపొందిన భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు సవాలు విసిరారు. బహిరంగ చర్చకు రావాలనేలా తేదీని, సమయాన్ని ఖరారు చేసి శుక్రవారం తాను తన శ్రేణులతో వస్తానని ప్రకటించారు. ఇందుకు ప్రతిగా భాజపా నాయకులు కూడా సవాలును స్వీకరించారు.
భాజపా శ్రేణులు ఇక్కడి చర్చాస్థలికి రాకుండా పోలీసులు ఎక్కడకిక్కడే ముందస్తు చర్యల్లో భాగంగా నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు. జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాలకు చెందిన కమలం పార్టీ ముఖ్య నాయకుల్ని పోలీసులు నిలువరించి ఠాణాలకు తరలించారు. మరోవైపు తెరాస శ్రేణులు మాత్రం నియోజకవర్గ కేంద్రంలోని బహిరంగ చర్చ కోసం ఏర్పాటు చేసిన వేదిక వద్దకు పెద్దఎత్తున చేరుకున్నారు. వారిని ఏ ఒక్క చోట కూడా పోలీసులు అడ్డుకోలేదు. ఉదయం 11 గంటల సమయంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి వేదిక వద్దకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చున్నారు. మరో కుర్చీని ఎమ్మెల్యే కోసం వేయించారు. దాదాపుగా 25 నిమిషాలపాటు వేచి చూసిన తరువాత పాడి కౌశిక్రెడ్డి గులాబీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. పెద్ద ఎత్తున శ్రేణులు తరలిరావడంతో అక్కడి ప్రాంగణమంతా గులాబీ మయమైంది. తెరాసకు, కౌశిక్కు అనుకూలంగా చేసిన నినాదాలతో ఆ ప్రాంతాన్ని మారుమోగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి తెరాస నాయకులు పాలాభిషేకం చేశారు. ఎస్సీకార్పొరేషన్ ఛైర్మన్ బండ శ్రీనివాస్తోపాటు జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెరాస తరపున మొన్నటి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ గైర్హాజరయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా కాషాయ జెండా పట్టుకుని ఇక్కడికి వచ్చేందుకు సిద్ధమైన 152 మందిని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. చర్చాస్థలి వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు డీసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో బందోబస్తుని నిర్వహించాయి. ప్రయాణ ప్రాంగంణం ఇవతలి గేటు నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు వాహనాల రాకపోకలకు ఒకవైపునకు మాత్రమే పోలీసులు అనుమతినిచ్చారు. హుజూరాబాద్-జమ్మికుంట మార్గంలోనూ పట్టణంలో ఆంక్షలు విధించారు.
వేదికపైకి వచ్చిన భాజపా మహిళా కార్యకర్తను కిందకు నెట్టివేస్తున్న తెరాస శ్రేణులు
కాషాయదళం దూకుడు..
ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకుని వేదిక వద్దకు రాకుండా నిలువరించినా.. భాజపా శ్రేణులు మాత్రం తమ పట్టుని నిలుపుకొనేలా చర్చ జరిపే స్థలం వద్దకు దూసుకొచ్చారు. కౌశిక్రెడ్డి వేదిక మీద ఉన్న సమయంలోనే భాజపాకు చెందిన ఇద్దరు మహిళలు సిగ లత, పంజాల లక్ష్మీలు వేదికపైకి దూసుకొచ్చారు. ఒకరు వేదికపైకి ఎక్కి తాము చర్చకు సిద్ధమనేలా తెరాస శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు పంపించారు. కౌశిక్రెడ్డి ప్రసంగం ముగిసిన కాసేపటికే చౌరస్తా సమీపంలోని ఓ వీధిలో నుంచి భాజపా నాయకులు సుమారు 60 మంది వరకు కాషాయం జెండాలు పట్టుకుని ఈటల రాజేందర్కు జేజేలు పలుకుతూ ఒక్కసారిగా దూసుకొచ్చారు. అప్పటికే రోడ్డుపై అడ్డుగా ఉన్న భారీకేడ్లతో పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. ఒక వైపు తెరాస, మరోవైపు భాజపా నాయకులు హోరాహోరీ నినాదాలు చేపట్టడంతో పోలీసులు వారిని సముదాయించేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది. ఒక దశలో ఇరుపార్టీల వాళ్లు చెప్పులను విసురుకున్నారు. తమ జెండా కర్రలను ప్రత్యర్థులపైకి విసిరారు. దీంతో పోలీసులు రెండు పార్టీకు చెందిన నాయకుల్ని చెదరగొట్టేందుకు శ్రమించారు. సుమారు 20 నిమిషాలపాటు అక్కడి ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. ఎట్టకేలకు ఆందోళన చేస్తున్న భాజపా నాయకులు, కార్యకర్తలను విడతల వారీగా అరెస్ట్ చేసిన పోలీసులు గొడవను సద్దుమణిచారు. మరోవైపు కౌశిక్రెడ్డి దిష్టిబొమ్మలను నియోజకవర్గంలోని పలు చోట్ల కమలం పార్టీ నేతలు తగులబెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM