నిఘా నీడలో అయిదు ఠాణాలు
సాంకేతిక పరంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకుని మెరుగైన సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రం పరిధిలోకి కరీంనగర్ కమిషనరేట్ సైతం చోటు దక్కించుకుంది.
హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం
హైదరాబాద్ కమాండ్ కంట్రోల్
న్యూస్టుడే, కరీంనగర్ నేరవార్తలు: సాంకేతిక పరంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకుని మెరుగైన సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రం పరిధిలోకి కరీంనగర్ కమిషనరేట్ సైతం చోటు దక్కించుకుంది. జిల్లా పరిధిలో జరిగే సంఘటనలు, స్థానిక పరిస్థితుల పరిశీలన, ఆధారాల సేకరణకు ఉపకరించనుంది. భవిష్యత్తులో చీమ చిటుక్కుమన్నా కమాండ్ కంట్రోల్ కేంద్రంలో నమోదయ్యేలా తీర్చిదిద్దనున్నారు.
ప్రయోగాత్మకంగా..
ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రం పరిధిలో కమిషనరేట్, జిల్లా స్థాయిలోని కొన్ని ఠాణాలను ప్రయోగాత్మకంగా ఎంపిక చేసుకొని రెండు నెలల కిందటనే ఠాణాల్లో నూతన సాంకేతికతో వీడియో, ఆడియో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొదటి విడతగా కరీంనగర్ 1, 2, 3 ఠాణాలతో పాటు మహిళా ఠాణా, సీసీఎస్ ఠాణాలను ఎంపిక చేశారు. ఒక్కో ఠాణాలో 20 సీసీ కెమెరాలను బిగించారు. వివిధ సమస్యలతో ప్రజలు ఠాణాలోకి వచ్చి, వెళ్లే మార్గాలు, అధికారి గది, నిందితులను భద్రపరిచే గది, రైటర్స్ గది, ఫిర్యాదు స్వీకరణ ప్రాంతం, స్వాధీనం చేసుకున్న వాహనాల నిలుపుదల ప్రాంతం ఇలా మొత్తంగా 20 ఆడియో, వీడియో రికార్డింగ్తో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి పలుమార్లు ఆడియో, వీడియో సైతం పరిశీలించి పలు మార్పులు చేశారు.
కరీంనగర్ రెండో ఠాణా వద్ద ఏర్పాటు చేసిన నూతన సిసి కెమెరాలు
మరిన్ని
రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ కేంద్రం హైదరాబాద్లో ప్రారంభం కాగా, మొదటి విడతగా కరీంనగర్ నగర పరిధిలోని ఐదు ఠాణాలను అనుసంధానం చేశారు. త్వరలోనే పట్టణ ప్రాంతాల్లోని ఠాణాల్లో ఆధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు సిద్ధమౌతున్నట్లు తెలిసింది. మరో రెండు, మూడు నెలల్లో స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు వినియోగంలో ఉంటే వాటిని అనుసంధానం చేయడం, కొత్త వాటిని ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది.
ఆధునికీకరిస్తే నిఘా కట్టుదిట్టం
జిల్లాల పునర్విభజనతో భాగంగా 2016 ఆగస్టులో కరీంనగర్ కమిషనరేట్ ఏర్పాటైంది. 2017 నుంచి నేటి వరకు ప్రజల భద్రత కోసం పోలీసు అధికారులు దాతల సహకారం, కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ, స్వచ్ఛంద సంస్థలు, వాణిజ్య, వ్యాపార నిర్వాహకుల సహకారంతో ఇప్పటి వరకు మూడు వేలకు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటి పర్యవేక్షణ బాధ్యతను స్థానికులు చూసేవారు. వాహన రాకపోకల కారణంగా కెమెరాల వైర్లు తెగిపోవడంతో మరమ్మతుకు వేల రూపాయల ఖర్చయ్యేది. తొలుత స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు, పోలీసులు సంయుక్తంగా మరమ్మతులు చేయించినా రానురాను ర్చు పెరిగిపోవడం, మొదటగా ఏర్పాటు చేసిన అనేక సీసీ కెమెరాల పర్యవేక్షణను ఎవరూ పట్టించుకోకపోవడంతో సగానికి పైగా కెమెరాలు మూలన పడ్డాయి. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసినా పర్యవేక్షణ లేక పనిచేయడం లేదు. కొన్ని ప్రాంతాల్లో కాలనీ అభివృద్ధి కమిటీలు వాటిని బాగు చేయించి భద్రతను పర్యవేక్షించుకుంటున్నాయి. ప్రధాన కూడళ్లలో కరీంనగర్ పోలీసులు సైతం ఆధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కమిషనరేట్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు మాత్రమే కంట్రోల్రూం పరిధిలో పర్యవేక్షణ జరుగుతున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. 60 డివిజన్లలో నాలున్నర లక్షల జనాభా కలిగిన స్మార్ట్ సిటీ పరిధిలోని సీసీ కెమెరాలను ఆధునికీకరించి నిరంతరం పర్యవేక్షించడం వల్ల నగరంలో భద్రత కట్టుదిట్టం చేయవచ్చని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ