లక్ష్యం దాటితే.. ప్రోత్సాహకం
సహజ ప్రసవాలను పెంచేందుకు ప్రభుత్వం కొన్నేళ్లుగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆశించిన మేరకు లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది. దీంతో సహజ ప్రసవాలను ప్రోత్సహించే వైద్యులు, వైద్య సిబ్బందికి ఆర్థిక ప్రోత్సాహకాలు అందించేందుకు తెలంగాణ వైద్య
వైద్య సిబ్బందికి ఆర్థిక ప్రయోజనాలు
సహజ ప్రసవాల పెంపునకు ప్రభుత్వ నిర్ణయం
గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రసూతి వార్డు
న్యూస్టుడే, గోదావరిఖని పట్టణం: సహజ ప్రసవాలను పెంచేందుకు ప్రభుత్వం కొన్నేళ్లుగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆశించిన మేరకు లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది. దీంతో సహజ ప్రసవాలను ప్రోత్సహించే వైద్యులు, వైద్య సిబ్బందికి ఆర్థిక ప్రోత్సాహకాలు అందించేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం 85 శాతం సహజ ప్రసవాలే ఉండాల్సి ఉండగా, చాలా ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇందులో సగం కూడా చేరుకోవడం లేదు. గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతి నెలా 190 నుంచి 230 వరకు ప్రసవాలు జరుగుతుండగా సహజ ప్రసవాల శాతం 30 నుంచి 37 శాతం వరకే ఉంటుంది. ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం అక్కడ జరిగే శస్త్ర చికిత్స ప్రసవాలను సహజ ప్రసవాలుగా దస్త్రాల్లో నమోదు చేస్తున్న వైనం ఇటీవల వెలుగులోకి రావడం గమనార్హం. శస్త్రచికిత్సతో జరిగే ప్రసవానికి ‘ఆరోగ్యశ్రీ’లో రూ.11 వేలు చెల్లిస్తుండడంతో ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుమతి పొందిన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు సైతం శస్త్ర చికిత్స ప్రసవాలపైనే దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. తాజాగా శస్త్రచికిత్స ప్రసవాలకు ‘ఆరోగ్యశ్రీ’ చెల్లింపులను నిలిపివేయడంతో పాటు సహజ ప్రసవాలను పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అవగాహన పెరగాలి...
* సహజ ప్రసవాలతో తల్లి, బిడ్డకు ఆరోగ్యపరంగా ఒనగూరే ప్రయోజనాలపై గర్భిణుల్లో అవగాహన కల్గించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంది.
* ఇటీవల జిల్లా పాలనాధికారి తీసుకున్న ప్రత్యేక చర్యలపై ముహూర్తపు ప్రసవాల సంఖ్య కాస్త తగ్గినప్పటికీ సహజ ప్రసవాలు ఆశించిన మేరకు పెరగడం లేదు.
* సహజ ప్రసవాలతో ప్రయోజనాలపై గర్భిణితో పాటు ఆమె బంధువుల్లో సరైన అవగాహన లేకపోవడం, కళ్లముందే గర్బిణి పురుటి నొప్పులతో బాధపడుతుంటే చూడలేని బంధువులు వెంటనే శస్త్రచికిత్సతో ప్రసవాలు చేయాలంటూ వైద్యులపై ఒత్తిళ్లు తెస్తున్నారు.
* తప్పనిసరిగా సహజ ప్రసవమయ్యే అవకాశముందని, లేనిపక్షంలో శస్త్రచికిత్స చేస్తామని వైద్యులు, వైద్య సిబ్బంది నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ప్రయోజనం ఉండడం లేదు.
* సహజ ప్రసవాలు చేయడంలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ప్రత్యేక శిక్షణతో సిద్ధంగా ఉన్నప్పటికీ గర్భిణులు, బంధువులు సహకరించకపోవడంతోనే సఫలం కాలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
* సంబంధిత ఉన్నతాధికారులు మాత్రం ఇవేం పట్టించుకోకుండా సహజ ప్రసవాలను ఎందుకు పెంచడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం వైద్యులు, వైద్య సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తోంది.
యోగాసనాల నుంచి ప్రోత్సాహకాల దాకా
సహజ ప్రసవాలను పెంపొందించాలనే లక్ష్యంతో పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాలుగేళ్ల క్రితమే గర్భిణుల కోసం యోగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నర్సింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మొదట్లో ఈ యోగా కేంద్రాలు అత్యంత ఉత్సాహంగా పనిచేసినప్పటికీ క్రమంగా గాడి తప్పాయి. మళ్లీ ఇటీవల కొంత మేరకు నిర్వహణ చేపడుతున్నారు. నెలసరి చికిత్స కోసం వచ్చే గర్భిణులకు యోగా కేంద్రాల్లో సహజ ప్రసవానికి అవసరమైన యోగాసనాలను నేర్పించి పంపించేవారు. ఇంటి దగ్గర అవే యోగాసనాలను ప్రాక్టీస్ చేస్తే సహజ ప్రసవాలు సుసాధ్యమయ్యేవి. సహజ ప్రసవాలపై గర్భిణుల్లో అవగాహన కల్గించేందుకు ఆశ, ఎ.ఎన్.ఎం. కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఎప్పటికప్పుడు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నారు. అయినా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన 85 శాతం సహజ ప్రసవాల లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సహజ ప్రసవాలను పెంపొందించే వైద్యులు, వైద్య సిబ్బందిని మరింత ప్రోత్సహించేలా ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. నిర్దేశిత లక్ష్యం దాటాక నిర్వహించే ఒక్కో సహజ ప్రసవానికి రూ.3 వేలు ఆర్థిక ప్రోత్సాహకాన్ని వైద్యులు, వైద్య సిబ్బందికి అందించనుంది. ఆస్పత్రుల స్థాయిని బట్టి సహజ ప్రసవాల లక్ష్యాలను నిర్దేశించారు. వాటిని అధిగమిస్తేనే ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకం అందనుంది. గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతి నెల 190 నుంచి 230 వరకు ప్రసవాలు జరుగుతుండగా ఇందులో సహజ ప్రసవాలు 60 నుంచి 80 వరకున్నాయి. బోధనాస్పత్రిగానున్న ఈ ఆస్పత్రిలో సహజ ప్రసవాల సంఖ్య 350 దాటితేనే ఒక్కో సహజ ప్రసవానికి రూ.3 వేలు ప్రోత్సాహకం అందనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్