విద్యార్థుల చూపు గురుకులాల వైపు
ఒకప్పుడు విద్యార్థులతో సందడిగా ఉన్న వసతి గృహాలు ప్రస్తుతం పిల్లలు లేక వెలవెలబోతున్నాయి. కొన్ని మూతబడ్డాయి. అరకొర విద్యార్థులతో మరికొన్ని మూసివేసే పరిస్థితికి చేరుకున్నాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన వసతి గృహాలు
వెలవెలబోతున్న వసతి గృహాలు
వేములవాడలోని బీసీ బాలుర వసతి గృహం
న్యూస్టుడే, వేములవాడ: ఒకప్పుడు విద్యార్థులతో సందడిగా ఉన్న వసతి గృహాలు ప్రస్తుతం పిల్లలు లేక వెలవెలబోతున్నాయి. కొన్ని మూతబడ్డాయి. అరకొర విద్యార్థులతో మరికొన్ని మూసివేసే పరిస్థితికి చేరుకున్నాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన వసతి గృహాలు నామమాత్రపు విద్యార్థులతో కొనసాగుతున్నాయి. గతంలో వందల సంఖ్యలో ప్రవేశాలు పొందేవారు. ప్రస్తుతం ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను ప్రవేశపెట్టడంతో వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
వేములవాడ డివిజన్లోని వేములవాడ, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాల్లో ఎస్సీ, బీసీ బాలురు, బాలికల వసతి గృహాలున్నాయి. పలు మండలాల్లోని వసతి గృహాలు విద్యార్థులు లేక బోసిపోతున్నాయి. ఒక్కొక్క వసతి గృహంలో వంద మంది ఉండాల్సిన విద్యార్థుల సంఖ్య నామమాత్రంగా ఉంది. రికార్డుల్లో ఎక్కువ సంఖ్యలో విద్యార్థుల నమోదు ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికే వేములవాడ పట్టణంలో ఎస్సీ బాలుర వసతి గృహం మూతపడగా అందులో వేములవాడ గ్రామీణ మండల తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేశారు. భిక్షాటన చేసుకునే వారి పిల్లల కోసం వసతి గృహం ఉండేది. అయిదేళ్ల క్రితం ఇది మూతపడింది. మూడేళ్ల క్రితం బీసీ బాలికల వసతి గృహం విద్యార్థులు లేక మూతపడింది. దీంతో ఇదే భవనంలో మార్పులు చేసి ప్రస్తుతం బీసీ బాలుర వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు. చందుర్తిలోని బాలుర వసతి గృహాన్ని సిరిసిల్ల బాలుర వసతి గృహానికి మార్పు చేశారు. ఇలా విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న కొద్దీ వసతి గృహాలు మూతపడుతున్నాయి.
రెండూ ఒకేచోట ఉండటంతో అటువైపు వెళుతున్నారు
- గంగయ్య, బీసీ వసతి గృహ సంక్షేమాధికారి, వేములవాడ
వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య చాలా వరకు తగ్గింది. గ్రామాల నుంచి విద్యార్థులు వివిధ గురుకులాల్లో ప్రవేశం పొందడంతో వసతి గృహాలకు వచ్చే వారి సంఖ్య తగ్గుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడ వారి పిల్లలను గురుకులాల్లో చేర్పించేందుకే ఆసక్తి చూపుతున్నారు. వసతి గృహం, పాఠశాల ఒకేచోట ఉండటంతో అటువైపు మొగ్గు చూపుతున్నారు.
వంద మందికి అవకాశం ఉన్నా...
గతంలో ఒక్కొక్క వసతి గృహంలో వంద మంది విద్యార్థులు ఉండేందుకు అవకాశం ఉండేది. ఇలాంటి సందర్భంలో చాలా వరకు వంద సీట్లు కొన్ని రోజుల్లోనే భర్తీ అయ్యేవి. దీంతో చాలా వసతి గృహాల్లో ప్రవేశాలు లభించక విద్యార్థులు నిరాశతో వెనుదిరిగేవారు. కొన్ని సందర్భాల్లో పలువురి ప్రజా ప్రతినిధులు, ఇతరత్రా నాయకుల సిఫారసు లేఖలతో వసతి గృహాల్లో సీటు కోసం పైరవీలు చేసిన సందర్భాలుండేవి. అలాంటిది ప్రస్తుతం ఉన్న వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయి మూతపడే స్థితికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. జ్యోతిబాఫులే, సోషల్ వెల్ఫేర్, బీసీ, మైనార్టీ వెల్ఫేర్, ప్రతి మండలంలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఇలా విరివిగా పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం నెలకొల్పడంతో వసతి గృహాలకు ఆదరణ పూర్తిగా తగ్గిపోయింది. గ్రామాల నుంచి చాలా మంది విద్యార్థులు గురుకులాల్లో చేరుతున్నారు. గురుకులాల్లో చదువుతో పాటు వసతి గృహాలు కొనసాగడంతో తల్లిదండ్రులు అందులో చేర్పించేందుకే మొగ్గు చూపుతున్నారు. గురుకులాల్లో వందల సంఖ్యలో విద్యార్థులతో కిటకిటలాడుతుండగా వసతి గృహాలు మాత్రం విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. వసతి గృహాల సంక్షేమ అధికారులు (వార్డెన్లు) విద్యార్థులను చేర్పించేందుకు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు లేకపోతే మూతపడుతుందనే ఆందోళన వారిలో నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పత్తి రైతులు, వ్యాపారుల ఆందోళన
[ 23-04-2024]
ఎన్నికల కోడ్ పేరుతో తనిఖీలు నిర్వహించి బ్యాంకుల నుంచి డబ్బును తీసుకొస్తున్న తమను ఇబ్బందులకు గురి చేయవద్దని జమ్మికుంట పత్తి మార్కెట్ వద్ద వ్యాపారులు, పత్తి రైతులు ఆందోళనకు దిగారు. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
[ 23-04-2024]
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
పిల్లల అల్లరిని దారి మళ్లించండి
[ 23-04-2024]
పది నెలలపాటు చదువుతో కుస్తీ పడిన పిల్లలకు వేసవి సెలవులు ఉపశమనం ఇస్తాయి. ఆటాపాటలతో సరదాగా గడపొచ్చని భావిస్తుంటారు. -
మోదీ వ్యాఖ్యల్లో ఓటమి భయం
[ 23-04-2024]
లోక్సభ మొదటి దశ ఎన్నికల తీరును చూసిన ప్రధాని మోదీ ఓటమి భయంతో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తుందని వ్యాఖ్యానించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. -
నాలుగో రోజు 25 నామినేషన్లు
[ 23-04-2024]
నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు సోమవారం కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. -
హామీలను విస్మరించిన ప్రభుత్వం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని కరీంనగర్ భారాస అభ్యర్థి వినోద్కుమార్ అన్నారు. -
సెప్టెంబరులో చక్కెర కర్మాగారం తెరిపిస్తాం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా!
[ 23-04-2024]
ప్రాంతానికి కొత్త కావచ్చు, రాజకీయాలకు, ప్రజా సేవకు కొత్తకాదని, అవకాశమిస్తే పార్లమెంట్ పరిధిని అభివృద్ధి చేసి చూపిస్తానని నిజామాబాద్ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. -
దారులన్నీ కొండగట్టుకే
[ 23-04-2024]
తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి దీక్షాపరులు తరలివస్తున్నారు. -
ఓటరు నమోదులో ఫలించిన చైతన్యం
[ 23-04-2024]
ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కు నమోదుకు యువతలో నూతనోత్సాహం ఉరకలేసింది. -
ప్రత్యేక నిధులు.. తీరనున్న ఇక్కట్లు
[ 23-04-2024]
రామగుండం నగరపాలక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అమృత్-2.0, యు.ఐ.డి.ఎఫ్.(అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్) నిధులతో పరిష్కారం కానున్నాయి. -
కాంగ్రెస్ నైజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 23-04-2024]
భారాస పాలనలోనే అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకున్నారని, గడిచిన నాలుగు నెలల కాలంలో సంక్షేమ పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్ పాలకుల నైజాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పెద్దపల్లి లోక్సభ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. -
లెక్కలు తేలేనా?
[ 23-04-2024]
జిల్లా వస్త్ర పరిశ్రమకు గత ప్రభుత్వం సంక్షేమ, పాఠశాల విద్యాశాఖలకు సంబంధించిన వస్త్రోత్పత్తుల ఆర్డర్లు ఇచ్చింది. -
నిధులున్నా ప్రారంభం కాని పనులు
[ 23-04-2024]
గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగుపరిచి రెండు జిల్లాల గ్రామాలను అనుసంధానం చేయాలనే లక్ష్యంతో తారు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
అమాత్యులుగా ఆ నలుగురు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి లోక్సభా నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎంపీల్లో ఇప్పటివరకు నలుగురికి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ