నెరవేరనున్న చిరకాల స్వప్నం
జిల్లాకు వైద్య కళాశాల మంజూరు కావడంతో ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనున్నది. దీనికి పరిపాలన పరమైన అనుమతులు ఇస్తూ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. కళాశాల ఏర్పాటుకు రూ.166 కోట్లను మంజూరు చేసింది.
వైద్య కళాశాలకు రూ.166 కోట్లు మంజూరు
సిరిసిల్ల జిల్లా ఆసుపత్రి
న్యూస్టుడే, సిరిసిల్ల (విద్యానగర్): జిల్లాకు వైద్య కళాశాల మంజూరు కావడంతో ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనున్నది. దీనికి పరిపాలన పరమైన అనుమతులు ఇస్తూ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. కళాశాల ఏర్పాటుకు రూ.166 కోట్లను మంజూరు చేసింది. ఇది ఏర్పాటయితే జిల్లా ప్రజలకు ఖరీదైన వైద్యం అందనున్నదని జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రస్తుతం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంది. వైద్య కళాశాల నిర్మాణం జరిగితే ఇది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారనున్నది. దీంతో ఇక్కడ అందనున్న సేవలు కూడా పెరుగుతాయి. జిల్లా ఆసుపత్రి నుంచి పలు సందర్భాల్లో అత్యవసర వైద్యానికి కరీంనగర్, వరంగల్ వంటి పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేస్తూ ఉంటారు. బాధిత బంధువులు హుటాహుటిన తరలించాల్సి వస్తుంది. దీంతో ఎంతో వ్యయ ప్రయాసలకు గురికావాల్సి వస్తుంది. వైద్య కళాశాల ఏర్పాటు చేస్తే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. జిల్లాలోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. గత సంవత్సరం జులైలో సిరిసిల్ల పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు జిల్లాకు వైద్య కళాశాలను మంజూరు చేశారు. వైద్య కళాశాల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనకు రూ.166 కోట్లు మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. ముందుగా వంద సీట్లు కేటాయించి జిల్లా ఏరియా ఆసుపత్రిని బోధనాసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందుబాటులోకి వస్తే జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. జిల్లా ప్రజలకు పెద్ద పెద్ద పట్టణాల్లో లభించే ఖరీదైన వైద్యం అందనుంది.
స్థలాల పరిశీలన
వైద్య కళాశాల కోసం ఇప్పటికే పలు చోట్ల అధికారులు స్థలాలను పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న రెండో బైపాస్ రోడ్డులో జేఎన్టీయూ కళాశాల నిర్మాణానికి స్థలం కేటాయించిన నేపథ్యంలో దాని సమీపంలోనే వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని అధికారులు ఇది వరకే ప్రతిపాదనలు పంపించారు. అక్కడే ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుత దవాఖానాను బోధనాసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాల నిర్మాణ బాధ్యతలు ఆర్అండ్బీ శాఖకు, ఎక్విప్మెంట్ బాధ్యతలు హైదరాబాద్ తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎస్ఐడీసీ)కి అప్పగించారు. డెరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పర్యవేక్షణలో వైద్య కళాశాల నిర్మాణం జరగనున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.
ప్రజలకు ఎంతో మేలు
- డా.మురళీధర్రావు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్
జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేయడం హర్షణీయం. జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందనుంది. జిల్లా ఆసుపత్రిని బోధనాసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య కళాశాల నిర్మాణం పూర్తిగా డీఎంఈ పర్యవేక్షణలో ఉంటుంది. జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనుంది. ప్రజలకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి