రుణమాఫీ నిధులు అందేనా..!
పంటరుణమాఫీ నిధుల కోసం అన్నదాతలు పడిగాపులు పడుతున్నారు. ఒక్కో రైతుకు రూ.లక్ష వరకు పంట రుణాన్ని మాఫీచేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించగా పూర్తిస్థాయి నిధుల విడుదలపై ఇప్పటికీ స్పష్టతలేక కర్షకులు
అన్నదాతలకు తప్పని నిరీక్షణ
జగిత్యాల వాణిజ్యం, న్యూస్టుడే
పంటరుణమాఫీ నిధుల కోసం అన్నదాతలు పడిగాపులు పడుతున్నారు. ఒక్కో రైతుకు రూ.లక్ష వరకు పంట రుణాన్ని మాఫీచేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించగా పూర్తిస్థాయి నిధుల విడుదలపై ఇప్పటికీ స్పష్టతలేక కర్షకులు కలవరపడుతున్నారు. ప్రభుత్వ హామీ మేరకు 2018 డిసెంబరు 11వ తేదీకంటే ముందు తీసుకున్న రూ.లక్షలోపు రుణాలకు మాఫీ వర్తిస్తుందని కటాఫ్ తేదీని ప్రకటించారు. ఈ క్రమంలో జిల్లాలో మొత్తం 1.03 లక్షల మంది రైతులకు రూ.711.62 కోట్ల పంటరుణ మాఫీ నిధులు అందించాల్సి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు రెండేళ్లక్రితం రూ.25 వేలవరకు పంటరుణం గల 9,328 మంది రైతులకు రూ.13.81 కోట్ల మాఫీ నిధులను విడుదల చేశారు. రూ.25 వేలనుంచి రూ.50 వేల వరకు పంటరుణ మాఫీ మొత్తాన్ని 2021 ఆగస్టు నెలాఖరులోగా రైతుల ఖాతాలకు జమచేస్తామని ప్రభుత్వం ప్రకటించినా కొన్ని రోజులపాటు మాత్రమే రూ.33 వేల వరకు రుణమున్న కొందరికే నిధులను బదిలీచేశారు. 2022 ఆగస్టు వచ్చినా కనీసం రూ.50 వేల వరకుకూడా మాఫీ నిధులను విడుదల చేయకపోవటంతో ఇక నిధులు ఇస్తారా ఇవ్వారా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
* 2022 మార్చి నెలలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో పంటరుణ మాఫీకిగాను రూ.16,144 కోట్లను కేటాయించి మార్చి నెలాఖరులోపు రూ.50 వేల వరకుగల రుణాలకు నిధులను విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో జిల్లాలో రూ.50 వేల వరకు పంటరుణం గల 16,796 మందికి రూ. 58.88 కోట్ల నిధులు రావాల్సిఉండగా ఇప్పటికీ నిధులను విడుదల చేయటంలేదు. రూ.50వేల నుంచి రూ.75వేల వరకు రుణమున్న రైతులకు ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో నిధులను విడుదల చేసి రూ.75 వేల నుంచి రూ.1 లక్ష వరకు గల రైతులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో నిధులను అందిస్తామని ప్రభుత్వం పేర్కొన్నా ఎంతమంది రైతులకు పంట రుణమాఫీ నిధులందుతాయనేది సందేహంగా మారింది.
* రాష్ట్రప్రభుత్వం 2014లో తొలిసారి రూ.ఒక లక్ష వరకు పంటరుణాన్ని మాఫీ చేసినపుడు నిధులను నేరుగా రైతుల ఎస్బీ ఖాతాలకు విడుదల చేశారు. ఈ మొత్తాన్ని ఏడాదికి పావుశాతం చొప్పున నాలుగేళ్లలో నాలుగు దఫాలుగా రైతులకు అందించారు. కాగా ప్రస్తుతం మాఫీ నిధులను రైతుల ఎస్బీ ఖాతాలకు కాకుండా నేరుగా పంటరుణ ఖాతాకే బదిలీచేయటం పెద్దసమస్యగా మారింది. కొన్ని బ్యాంకుల విలీనం, రైతుల రుణఖాతా నెంబరు మారటం, బంగారం కుదువపెట్టి తీసుకున్న సాగురుణ ఖాతాలను మూసేయటం, బ్యాంకులు మారటం తదితర కారణాలతో వేలాదిమంది నిధులందే అవకాశాన్ని కోల్పోయారు. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా పొదుపు ఖాతాలకు నిధులను విడుదల చేయాలని, ప్రభుత్వ ఏర్పడి నాలుగో సంవత్సరంనకు చేరినందున రూ.లక్ష వరకు పంటరుణాన్ని ఒకేదఫాలో మాఫీచేయాలని రైతులు కోరుతున్నారు.
వివరాలు గతంలోనే సమర్పించాం
- పాక సురేశ్కుమార్, వ్యవసాయాధికారి, జగిత్యాల జిల్లా
జిల్లాలో రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితాను గతంలోనే ప్రభుత్వానికి సమర్పించాము. దాదాపుగా రూ.33 వేల వరకు పంటరుణం గలవారికి నిధులందాయి. నిధులు చేరిన రైతుల జాబితాలు సైతం ప్రభుత్వం వద్దే ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరీంనగర్ టికెట్ ఎవరి చేతికి?
[ 29-03-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారుపై ఆ పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది.. ఇప్పటికే భారాస, భాజపాల అభ్యర్థులు ఖరారవగా.. హస్తం పార్టీ తరఫున బరిలో నిలిచేదెవరో తెలియకపోవడంతో కాంగ్రెస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు అభ్యర్థి తేలేదెప్పుడు.. అని ఆందోళన చెందుతున్నారు. -
కనుల పండువగా శివయ్య కల్యాణం
[ 29-03-2024]
ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో గురువారం శివ కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. -
ఆందోళన వద్దు.. అవకాశాలు కోకొల్లలు!
[ 29-03-2024]
విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ పదో తరగతి పూర్తి చేశారు. ఒకట్రెండు రోజుల్లో పరీక్షలు కూడా పూర్తి చేసి ఉన్నతవిద్య వైపు అడుగులు వేయనున్నారు. -
అవసరాల మేరకు ఏదీ అనుసంధానం!
[ 29-03-2024]
ఈ రెండు అంశాల్లోనే కాదు. ప్రయాణికుల అవసరాలు తీర్చడంలో ద.మ.రై.అధికారులు ఆది నుంచీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. రైల్వే ఉద్యోగుల అవసరాలు, అధికారులు, నాయకులు లాబీయింగులతోనే కొత్త హాల్టింగులు, ఇతర వసతులు కల్పిస్తున్నారు. -
కరీంనగర్ బస్స్టేషన్ ఆస్తి పన్ను రూ.1.88 కోట్లు చెల్లింపు
[ 29-03-2024]
ఆస్తిపన్ను బకాయిలపై 90 శాతం రాయితీ గడువు మూడు రోజుల్లో ముగుస్తుందని నగరపాలక కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ తెలిపారు. -
భార్య చేతిలో భర్త హతం
[ 29-03-2024]
భర్త మద్యానికి బానిసై శారీరకంగా.. మానసికంగా వేధిస్తున్నాడని వేదనకు గురైన ఓ భార్య తనకు తెలిసిన ఇద్దరి సహాయంతో తాళ్లతో కట్టేసి.. కళ్లలో కారం చల్లి... ఒంటిపై వేడి నీళ్లు పోసి తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయి మృతి చెందాడు. -
లోక్సభ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పరీక్ష
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
వేసవి గట్టెక్కేనా!
[ 29-03-2024]
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ పట్టణాలకు డబ్బాలోని గ్రిడ్ ద్వారా మిషన్ భగీరథ పథకం నీరు సరఫరా అవుతోంది. ధర్మపురి పట్టణానికి డబ్బా నుంచి పైపులైన్లు వేసినా చివరి ప్రాంతం కావడంతో నీరు సరఫరా సక్రమంగా కావడం లేదు. -
మట్టి గుట్టలు మాయం!
[ 29-03-2024]
మండలంలోని వరద కాలువ మట్టిని కొందరు గుత్తేదార్లు, స్తిరాస్థి వ్యాపారులు అక్రమంగా తరలించుకుపోతుండటంతో మట్టికట్టలు మాయమవుతున్నాయి. -
నిధులు దూరం.. నిర్వహణ భారం
[ 29-03-2024]
వ్యవసాయ శాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో గత ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించింది. శాఖాపరంగా రైతులకు ఆధునిక సాగు విధానంపై సలహాలు, సూచనలు ఇవ్వాలనేది ప్రధాన లక్ష్యం. -
లక్ష్యానికి చేరువగా సింగరేణి
[ 29-03-2024]
సింగరేణి సంస్థ తొలిసారిగా 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి చేరువ అవుతోంది. మూడేళ్లుగా ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సంస్థ ఇప్పటివరకు ఆ మేరకు బొగ్గు ఉత్పత్తిని చేరుకోలేకపోయింది. -
బయో మైనింగ్ ప్రక్రియకు అవాంతరాలు
[ 29-03-2024]
పెరుగుతున్న నగరీకరణ.. అందుకు అనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణ ప్రభుత్వ యంత్రాంగానికి సవాల్గా మారుతోంది. ఈ క్రమంలో చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేసేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
భాజపా పాలనపై ప్రజల్లో విసుగు
[ 29-03-2024]
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని భారాస ఎంపీ అభ్యర్థులు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్, కొప్పుల ఈశ్వర్లు అన్నారు. -
మతం పేరిట కేసీఆర్ రాజకీయం చేయలేదు: కేటీఆర్
[ 29-03-2024]
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో ఏ రోజు కూడా మతం పేరిట రాజకీయం చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
రాష్ట్రాన్ని దోచుకుంది భారాసనే: ఆది శ్రీనివాస్
[ 29-03-2024]
తెలంగాణ ఏర్పడిన తరవాత రూ.16 వేల కోట్ల నిల్వ బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పగిస్తే భారాస తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రాబంధుల్లా దోచుకుందని, రూ.6.67 లక్షల కోట్ల అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.