తెగువ చూపారు.. జెండా ఎగురవేశారు!
దేశమంతటా స్వాతంత్య్ర కాంతులు.. అయినా నిజాం నిరంకుశ పాలనలో చీకట్లు.. ఆనాటి రజాకార్ల దమన నీతిని ధైర్యంగా ఎదుర్కొని ధర్మపురిలో పురాతన చారిత్రాత్మక భవనంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.. సాయుధ
ధర్మపురి స్వాతంత్య్ర సమరయోధుల పోరాట స్ఫూర్తి
సంగనభట్ల మాణిక్యశాస్త్రి, కేవీ కేశవులు
న్యూస్టుడే, ధర్మపురి: దేశమంతటా స్వాతంత్య్ర కాంతులు.. అయినా నిజాం నిరంకుశ పాలనలో చీకట్లు.. ఆనాటి రజాకార్ల దమన నీతిని ధైర్యంగా ఎదుర్కొని ధర్మపురిలో పురాతన చారిత్రాత్మక భవనంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.. సాయుధ పోలీసులు చేరుకునేలోపే చాకచక్యంగా తప్పించుకున్నారు. రజాకార్లను ముప్పుతిప్పలు పెడుతూ.. నిండు గోదావరిని దాటి మంచిర్యాల రైలుమార్గంలో మహారాష్ట్రలోని నాగపూర్కు చేరుకొని మిలట్రీ శిబిరంలో శిక్షణ పొందారు..ధర్మపురికి చెందిన మాజీ మంత్రి దివంగత కేవీ కేశవులు, స్వాతంత్య్ర సమరయోధులు సంగనభట్ల మాణిక్యశాస్త్రి అన్యోన్య స్నేహితులు.. రేడియో ద్వారా స్వాతంత్య్ర పోరాట విశేషాలను అవగాహన చేసుకుని ఈ ప్రాంత ప్రజలను చైతన్యపర్చేవారు. 14వ తేదీ 1947న అర్ధరాత్రి రేడియో ద్వారా స్వాతంత్య్రం వచ్చిందనే విషయాన్ని తెలుసుకొని అత్యవసరంగా అర్ధరాత్రి ధర్మపురిలోని కేవీ కేశవులు ఇంటిలో రహస్యంగా పోరాట యోధులతో సమావేశం నిర్వహించారు. నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని తీర్మానించారు. వెంటనే రాత్రికి రాత్రే త్రివర్ణ పతాకాన్ని ఈ భవనంపై ఎగురవేశారు. రజాకార్లు చేరుకునే సరికి చాకచక్యంగా తప్పించుకుని, నిండు గోదావరిలోకి దూకి తెప్పపై అవతలి తీరానికి, అక్కడి నుంచి మంచిర్యాల రైల్వే మార్గానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నాగపూర్ స్వాతంత్య్ర సమరయోధుల క్యాంప్కి వెళ్లి చాలా నెలల పాటు శిక్షణ పొందారు. ఆనాటి వీరి పోరాట స్ఫూర్తిని స్థానికులు నెమరు వేసుకుంటున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల నేపథ్యంలో నాటి పోరాటానికి గుర్తుకు మిగిలిన పురాతన భవనాన్ని అలంకరించి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు.
కేవీ కేశవులు ఇంటిపై జెండా ఆవిష్కరణ
జైహింద్ ప్రోత్సాహకుల ముందడుగు.. 72 ఏళ్ల కిందటి మహాత్ముడి విగ్రహం
జమ్మికుంటలో గాంధీజీ విగ్రహం
న్యూస్టుడే, జమ్మికుంట: జైహింద్ ప్రోత్సాహకులు ముందడుగుతో 72 ఏళ్ల కిందట ఆవిష్కరించిన మహాత్మా గాంధీ విగ్రహం దేశభక్తి, స్వాతంత్య్ర కీర్తిని, మహాత్ముడి ఆశయాలను స్ఫూర్తింపజేస్తోంది. నాడు రైలు మార్గంలో గాంధీజీ ప్రయాణం సందర్భంగా జమ్మికుంట రైల్వేస్టేషన్లో పలువురు గాంధీని పలువురు కలిశారని చెపుతుంటారు. వావిలాలలో గాంధీజీ శిష్యులు అన్నాసాహెబ్ సహస్రబుద్దే, లేలేజీలు 1929లో మహారాష్ట్ర చరఖా సంఘ్ను ప్రారంభించటంతోనూ, జమ్మికుంటలో గాంధీజీ విగ్రహం ఏర్పాటుకు ముందుకు రావటం విశేషం. మద్రాస్లోని ఓ ప్రైవేట్ కంపెనీతో రూ11వేల వ్యయంతో గాంధీజీ విగ్రహాన్ని తయారు చేయించి తీసుకురావటం విశేషం. పట్టణ కూడలిలో గాంధీ విగ్రహం ఏర్పాటుకు నవంబర్ 3న కరీంనగర్ జిల్లా సివిల్ అడ్మినిస్ట్రేటర్ ఎ.సత్యనారాయణమూర్తి శంకుస్థాపన చేశారు. విగ్రహాన్ని ఫిబ్రవరి 2, 1950లో అప్పటి హైదరాబాద్ ప్రభుత్వ ప్రధాన మంత్రి ఎమ్. కె.వెల్లోడి (సీఐఐసీఎస్) ఆవిష్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..