logo

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రామడుగు మండలం దేశ్రాజ్‌పల్లి బస్‌స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐలవేని తిరుపతి(35) మృతి చెందాడు. మంగళవారం రాత్రి కరీంనగర్‌ నుంచి వెదిర వైపు బైక్‌పై ప్రయాణిస్తుండగా లారీ ఢీకొని తల పగిలిపోయింది. తీవ్ర రక్తస్రావం

Published : 10 Aug 2022 04:55 IST

రామడుగు: రామడుగు మండలం దేశ్రాజ్‌పల్లి బస్‌స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐలవేని తిరుపతి(35) మృతి చెందాడు. మంగళవారం రాత్రి కరీంనగర్‌ నుంచి వెదిర వైపు బైక్‌పై ప్రయాణిస్తుండగా లారీ ఢీకొని తల పగిలిపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో సంఘటన స్థలంలోనే తుదిశ్వాస విడిచాడు. తిరుపతి కరీంనగర్‌లో సరకు రవాణా వాహనం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో నిత్యం తన స్వగ్రామం కొరిటపల్లి నుంచి కరీంనగర్‌ రాకపోకలు సాగిస్తున్నారు. అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కోరిటపల్లిలో విషాదం నెలకొంది. రామడుగు ఎస్సై కె.అంజయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని