ఏళ్ల నిరీక్షణకు తెర... దక్కనున్న ఆసరా
ఆదరణ లేని అభాగ్యులకు ఆసరాగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు అందజేస్తుంది. ప్రతి నెలా అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేస్తుంది. చాలా రోజులుగా కొత్త పింఛన్లు మంజూరు కాక దరఖాస్తు చేసుకున్న వారు ఏళ్ల తరబడి
సీఎం ప్రకటనతో దరఖాస్తుదారుల్లో ఆశలు
న్యూస్టుడే, వీర్నపల్లి
ఆదరణ లేని అభాగ్యులకు ఆసరాగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు అందజేస్తుంది. ప్రతి నెలా అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేస్తుంది. చాలా రోజులుగా కొత్త పింఛన్లు మంజూరు కాక దరఖాస్తు చేసుకున్న వారు ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. ప్రతీ సారి వస్తాయన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయినా లబ్ధి చేకూరలేదు. ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటనతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురించాయి.
గతంలో ఎన్నడూ లేని విధంగా 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 2019 నుంచి వృద్ధులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతువులకు రూ. 2,016, దివ్యాంగులకు రూ. 3,016లకు పింఛను మొత్తాన్ని పెంచింది. జిల్లాలో ప్రస్తుతం 1,06,851 మంది లబ్ధిదారులున్నారు. ప్రతి నెలా రూ. 22.58 కోట్లకు పైగా సాయాన్ని ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేస్తుంది.
* ఈ చిత్రంలోని వ్యక్తి పేరు గంగిపెల్లి ఎల్లయ్య. వీర్నపల్లి మండలం మద్దిమల్ల నివాసి. భార్య లక్ష్మి పదేళ్ల క్రితమే మృతి చెందగా కొడుకు ఇల్లరికం వెళ్లాడు. దీంతో ఊరికి చివరన ఉన్న పశువుల పాకలో వృద్ధుడు నివసిస్తున్నాడు. రేషన్కార్డు లేకపోవడంతో స్థానికుల సాయంతో కడుపు నింపుకుంటున్నాడు. ఆసరా కోసం రెండు సార్లు దరఖాస్తు చేసుకున్నాడు. వయస్సు 70కి పైగా ఉన్న ఆధార్లో తప్పుగా నమోదు చేయడంతో తిరస్కరణకు గురైందని వాపోయాడు. చిన్నబోయిన కంటిచూపుతో కార్యాలయాల చుట్టూ తిరిగాడు. ఈ సారైనా ఆసరా వస్తుందేమోన్న ఆశతో ఎదురుచూస్తున్నాడు.
వెల్లువెత్తిన అర్జీలు
రెండేళ్లుగా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, గీత, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, పైలేరియా బాధితులు కలిపి మొత్తం 7,454 మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి ఎప్పుడో అందించాల్సి ఉండగా కాలయాపన చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం వెసులుబాటు కల్పించి 57 సంవత్సరాల పైబడిన వారికి పింఛన్లు అందిస్తామని ప్రకటించడంతో ఎనిమిది నెలల కిందట జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. సుమారు 19,390 మంది ఆసరా కోసం అర్జీలు సమర్పించారు.
* షేక్ సహేరా, ఖాసీం దంపతులకు ముగ్గురు సంతానం. ఖాసీం మోటార్ మెకానిక్గా పని చేస్తుండగా సహేరా బీడీలు చుడుతూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటుంది. వారి రెండో కుమార్తె ఆయీషా పుట్టుకతోనే మెదడులోపం తలెత్తింది. అమాయకంగా చూసే కళ్లు.. నేలపై కదలాడే శారీరక స్థితి ఆమెది. వైద్యం కోసం సుమారు రూ.6 లక్షలు వెచ్చించినా మార్పు కనిపించలేదు. ప్రతినెలా ఔషధాల కొనుగోలుకు రూ. 4 వేల వరకు ఖర్చవుతుందని ఖాసీం తెలిపారు. ఆసరా అందతే చిన్నారి వైద్యం, మందులకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
మంజూరు కాగానే పంపిణీ
- మదన్మోహన్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
జిల్లాలో ప్రస్తుతం లక్షకు పైగా లబ్ధిదారులకు రూ. 22.58 కోట్లను ఆసరా కింద అందిస్తున్నాం. ప్రభుత్వం వృద్ధాప్య పింఛను అర్హత వయస్సు 57 ఏళ్లకు తగ్గించడంతో 19 వేలకు పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు 7,454 మందిని అర్హులుగా గుర్తించాం. ప్రభుత్వం నిధులు మంజూరు చేయగానే పంపిణీ చేస్తాం. స్వాతంత్య్ర దినోత్సవానికి ఆసరా పింఛన్లు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటన ఇచ్చారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా రాలేదు.
జిల్లాలో పింఛన్ల వివరాలు
* జిల్లాలో ప్రస్తుతం లబ్ధిదారులు: 1,06,851
* ప్రతి నెల చెల్లిస్తున్న మొత్తం: రూ. 22.58 కోట్లు
* 57 ఏళ్లు పైబడిన వారి నుంచి వచ్చిన దరఖాస్తులు: 19,390
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!