అంతర్గత దారులు.. అడుగడుగునా గుంతలు
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో వర్షాలకు అంతర్గత రహదారులు అధ్వానంగా మారుతున్నాయి. నెల రోజులుగా కురుస్తున్న వానాలకు పెద్ద గుంతలు ఏర్పడి నరకాన్ని తలపిస్తున్నాయి. తాత్కాలిక మరమ్మతుల పేరిట ఏటా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా ఎక్కడి గుంతలు అక్కడే వదిలేయడంతో నగరవాసులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో మట్టి రోడ్లు నడవడానికి వీల్లేకుండా మారాయి.
న్యూస్టుడే, కరీంనగర్ కార్పొరేషన్
అశోక్నగర్ నుంచి కాపువాడ వెళ్లే దారి సర్కస్ ఫీట్లను తలపిస్తోంది. పెద్ద, చిన్న గుంతలతో రోడ్డు పూర్తిగా శిథిలమైంది. దారి తప్పి ఆ వైపు రాకపోకలు సాగిస్తే ఇబ్బందులు పడాల్సిందే.
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో వర్షాలకు అంతర్గత రహదారులు అధ్వానంగా మారుతున్నాయి. నెల రోజులుగా కురుస్తున్న వానాలకు పెద్ద గుంతలు ఏర్పడి నరకాన్ని తలపిస్తున్నాయి. తాత్కాలిక మరమ్మతుల పేరిట ఏటా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా ఎక్కడి గుంతలు అక్కడే వదిలేయడంతో నగరవాసులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో మట్టి రోడ్లు నడవడానికి వీల్లేకుండా మారాయి.
ఇంకెన్నాళ్లు..మట్టి రోడ్లు
నగరంలో స్మార్ట్సిటీ ప్రాజెక్టులో భాగంగా పలు రహదారులు అభివృద్ధి చెందగా శివారు, వెనుకబడిన ప్రాంతాల్లోని వీధులు చూస్తే భయంకరంగా తయారయ్యాయి. భూగర్భ డ్రైనేజీ పనుల కారణంగా తవ్విన సీసీ రోడ్లు, మట్టి రోడ్లు గుంతలు పడి దారుణంగా మారాయి. వర్షాలు పడితే నీరంతా ఆ గుంతల్లోనే నిలిచి ఉంటుంది. అశోక్నగర్, కాపువాడ, మారుతీనగర్, కోతిరాంపూర్, కట్టరాంపూర్, అలకాపురి, ఆమేర్నగర్, లక్ష్మీనగర్, గాయత్రీనగర్, పోచమ్మవాడ, హుస్సేనీపుర, ఖాన్పుర, సప్తగిరికాలనీ, బ్యాంకుకాలనీ, రాంనగర్, విద్యానగర్, మంకమ్మతోట, వావిలాలపల్లి, సుభాష్నగర్, కిసాన్నగర్ ప్రాంతాల్లో రోడ్లు చెడిపోయాయి. కొన్ని చోట్ల టెండర్లు దక్కించుకొని గుత్తేదారులు పని చేయకపోవడంతో సమస్యలు వస్తున్నాయి.
విలీన కాలనీల్లో అదే పరిస్థితి
విలీన కాలనీల్లోని రోడ్ల పరిస్థితి అలాగే మారింది. ఒక్కో కాలనీ పరిశీలిస్తే విస్తీర్ణంలో పెద్దగా ఉండగా రహదారుల నిర్మాణానికి, మురుగునీటి కాల్వలు నిర్మించేందుకు కేటాయిస్తున్న నిధులు ఏ మూలకు సరిపోవడం లేదు. మూడేళ్లుగా కాలనీల్లో సౌకర్యాలు మెరుగు పడలేదనే ఫిర్యాదులు స్థానికుల నుంచి వినిపిస్తోంది. పంచాయతీ సమయంలో పెద్దగా రోడ్లు వేయకపోవడం, అక్కడి ప్రాంతవాసులు నగరపాలికపై ఆశలు పెంచుకోగా ప్రత్యేక నిధులు ప్రభుత్వం కేటాయిస్తే తప్ప అక్కడ మార్పు వచ్చేలా లేదు.
రూ.60 లక్షలు కేటాయింపు
వర్షాల కారణంగా గుంతలు పడిన రహదారులకు మరమ్మతులు చేసేందుకు నగర మేయర్ వై.సునీల్రావు రూ.60లక్షలు కేటాయించారు. వీటికి టెండర్లు పిలిచి పనులు చేయాల్సి ఉంది. అయితే సీసీ, తారు రోడ్లపై ఉన్న గుంతలను వాటితోనే ప్యాచ్ వర్క్ చేయించాలి. మట్టి రోడ్లపై సిమెంటు, కంకర మిశ్రమంతో వేస్తే మళ్లీ వర్షం పడినా గుంతలు పడే అవకాశం ఉండదు. తూతూ మంత్రంగా కాకుండా పనులను పక్కాగా చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు.
హుస్సేనీపుర ప్రాంతంలో కొన్ని రోడ్లు మాత్రమే పూర్తి కాగా మిగతా మట్టి రోడ్లు ప్రమాదకరంగా మారాయి. సీసీ రోడ్లు మధ్యలో చెడిపోగా వర్షం పడితే నీరు నిలిచి గుంత లోతు తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఆమేర్నగర్-లక్ష్మీనగర్కు వెళ్లే రహదారి రద్దీగా ఉంటుంది. కొన్నేళ్లుగా మరమ్మతులు చేయకుండా అలాగే ఉంటుంది. అన్నీ రోడ్లు బాగు చేస్తుండగా ఈ ఒక్క రోడ్డు మాత్రం వదిలేస్తున్నారు.
కోతిరాంపూర్ నుంచి గిద్దెపేరుమాండ్ల దేవస్థానం వెళ్లే ప్రధాన రహదారి గుంతలు పడి ఇబ్బందికరంగా మారింది. భూగర్భ డ్రైనేజీ పనుల కారణంగా ప్యాచ్ వర్క్ చేయగా అదీ ఊడిపోయింది. వర్షం పడితే చాలు రోడ్డంతా గుంతలమయంగా మారుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం
[ 18-04-2024]
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణోత్సవాన్ని ఆలయ వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
నేటి నుంచి నామినేషన్లు షురూ!
[ 18-04-2024]
ఎన్నికల సమరంలో అసలైన ఘట్టం గురువారం నుంచి మొదలవనుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ నెల రోజుల కిందటే వెలువడినప్పటికీ నేడు వెలువడే అధికారిక నోటిఫికేషన్తో అసలు అంకం షురూ అవనుంది. -
ప్రచార పర్వానికి కాంగ్రెస్ సిద్ధం!
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి గురువారం నామపత్రాల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలో ప్రచార కసరత్తు ప్రారంభించింది. -
కొప్పుల మొదటిసారి.. జీవన్ మూడోసారి
[ 18-04-2024]
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో వేర్వేరు పార్టీలు, వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న తాటిపర్తి జీవన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్లకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలుపొందిన జీవన్రెడ్డి స్వగ్రామం పెగడపల్లి మండలం బతికెపల్లి. -
క్లిక్ దూరంలో సమగ్ర సమాచారం
[ 18-04-2024]
ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వెబ్సైట్ రూపొందించింది. ceotelangana.nic.in లో ఓటరు నమోదుతో పాటు సవరణలు, తొలగింపులు తదితర అంశాలుంటాయి. -
రెండు సార్లు ఎంపీ.. సాధారణ జీవనం
[ 18-04-2024]
వరుసగా రెండు సార్లు ఎంపీగా ఎన్నికైనా చివరి శ్వాస వరకు పల్లెటూరులోనే సాధారణ జీవితం గడిపారు జువ్వాడి రమాపతిరావు. 1916లో గన్నేరువరంలో జన్మించిన ఆయన వివాహం అనంతరం అత్తగారి ఊరైన గంగాధర మండలం సర్వారెడ్డిపల్లికి వచ్చి స్థిరపడ్డారు. -
ఎన్నికల పరిశీలకులొస్తున్నారు
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెంచింది. -
హాట్రిక్ విజేత..అరుదైన ఘనత
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లాలో నలుగురు నేతలు వరుసగా మూడు సార్లు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ రికార్డు సొంతం చేసుకున్నారు. కరీంనగర్ నుంచి ముగ్గురు, పెద్దపల్లి నుంచి ఒకరు గెలుపొంది రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు. -
అక్కడ స్థానికేతరులే అధికం
[ 18-04-2024]
1962లో ఆవిర్భవించిన పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు ఒక్కసారి మినహా అన్ని ఎన్నికల్లో స్థానికేతరులే గెలుపొందారు. 1980లో 7వ లోక్సభ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన కోదాటి రాజలింగం మాత్రమే స్థానికుడు. -
వసతుల మెరుగుకు కార్యాచరణ
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం నగరపాలికల్లో కనీస మౌలిక వసతులు మెరుగుపర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రధానంగా తాగునీరు, భూగర్భ మురుగునీటి వ్యవస్థను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటారు. -
ఆదాయంలో జమ్మికుంట మార్కెట్ టాప్
[ 18-04-2024]
పంటలకు పెరిగిన మద్దతు ధర, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పాత బకాయిలు జమకావటం, చెక్పోస్టులు, గిడ్డంగుల అద్దెలు, లైసెన్సులు, మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాల ద్వారా లభించే ఆదాయంతో ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల వ్యవసాయ మార్కెట్ మినహా కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లు మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన ఆర్థిక ఆదాయ లక్ష్యాన్ని అధిగమించాయి. -
ఓటరు దరఖాస్తులకు త్వరితగతిన పరిష్కారం
[ 18-04-2024]
నామినేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు. బుధవారం ఆయన నిర్వహించిన పెద్దపల్లి నుంచి కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, శ్యామ్ప్రసాద్లాల్లు పాల్గొన్నారు. -
మిల్లుల్లోనే బియ్యం.. ధాన్యానికేదీ స్థలం?
[ 18-04-2024]
గత వానాకాలం సీజన్కు సంబంధించిన బియ్యానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో మిల్లుల్లోనే నిల్వలు పేరుకుపోయాయి. గత సీజన్కు సంబంధించిన సీఎంఆర్ లక్ష్యాలను మిల్లర్లు పూర్తి చేయాలనే గడువును జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నారు.