logo

ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు

మంథని పట్టణంలోని ఆర్సీకట్ట ప్రాథమిక పాఠశాలలోని ఇద్దరు ఉపాధ్యాయులకు అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 2న పాఠశాలను సందర్శించినప్పుడు కిశోర్‌

Published : 11 Aug 2022 06:46 IST

మంథని గ్రామీణం, న్యూస్‌టుడే: మంథని పట్టణంలోని ఆర్సీకట్ట ప్రాథమిక పాఠశాలలోని ఇద్దరు ఉపాధ్యాయులకు అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 2న పాఠశాలను సందర్శించినప్పుడు కిశోర్‌ అనే ఉపాధ్యాయుడు ఆలస్యంగా విధులకు హాజరు కావడం, డిప్యూటేషన్‌ ఉత్తర్వులు ఇచ్చినా పాటించకపోవడంతో ఒక రోజు వేతనం నిలిపివేస్తూ డీఈవో షోకాజ్‌ నోటీసు జారీ చేశారని ఎంఈవో లక్ష్మి తెలిపారు. ఆ పాఠశాలలో మధ్యాహ్న భోజన రిజిస్టరును సరిగ్గా నిర్వహించకపోవడం, తక్కువ విద్యార్థులున్నా ఎక్కువ మంది నమోదు చేయడంపై ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్‌రెడ్డికి జిల్లా అధికారి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారని చెప్పారు. ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని