నిరంతర నిఘా.. నేరాల నియంత్రణ..
పోలీసు యంత్రాంగం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. అదే కోణంలో రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే రాష్ట్ర రాజధానిలో తెలిసే విధంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్
కమాండ్ కంట్రోల్కు సీసీ కెమెరాల అనుసంధానం
న్యూస్టుడే, గోదావరిఖని
ఠాణాలో ఏర్పాటు చేసిన తెర
పోలీసు యంత్రాంగం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. అదే కోణంలో రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే రాష్ట్ర రాజధానిలో తెలిసే విధంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేస్తున్నారు. రామగుండం కమిషనరేట్కు అందులో చోటు కల్పించారు. ఇప్పటికే గోదావరిఖని 32, పెద్దపల్లి ఠాణాల పరిధిలో 72 కెమెరాలను అనుసంధానం చేశారు. పట్ణంలోని ప్రధాన కూడళ్లతో పాటు ఠాణాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకున్నారు. దీంతో ఇక్కడ ఏ సంఘటన జరిగినా సీసీ కెమెరా ఉన్న పరిధిలోని ప్రతి అంశం కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఉన్న వారు పరిశీలించే అవకాశం ఉంది. పెద్దపల్లి జిల్లాలో గోదావరిఖని-1, 2, రామగుండం, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ సర్కిల్ స్టేషన్లతో పాటు ప్రతి మండలానికి ఒకటి చొప్పున 13 ఠాణాలున్నాయి. వీటి పరిధిలో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలు చిత్రీకరించే వీడియోలు కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి పర్యవేక్షించే విధంగా పోలీసు శాఖ ఏర్పాట్లు చేసింది.
మొదలైన ప్రక్రియ...
రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లాలో ఉన్న నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఉన్న సీసీ కెమెరాలను అనుసంధానం చేసే ప్రక్రియ సాగుతోంది. జిల్లాలో మొత్తం 3,500 పైగా నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్ కింద కొన్ని, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార వర్గాలు, పరిశ్రమల సహకారంతో నగరాలు, పట్టణాల్లోని ముఖ్యమైన రద్దీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి ఏర్పాటు చేసిన ప్రాంతంలో జరిగే ప్రతి సంఘటన సీసీ కెమెరాలో నిక్షిప్తమవుతోంది. ఇదే వీడియో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రానికి చేరుతుంది. ఒకవేళ ఆ ఠాణా పరిధిలో ఉన్న అధికారులు స్పందించని పక్షంలో అక్కడి నిఘా కెమెరాల దృశ్యాల ఆధారంగా అప్రమత్తం చేసే అవకాశం ఉంది. నిర్లక్ష్యం.. కేసు విచారణలో పారదర్శకత లోపించినా వెంటనే అక్కడి నుంచి అధికారులు స్పందించే అవకాశం ఉంటుంది. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్న ఆలోచన మేరకు పోలీసుశాఖ అన్ని ఠాణాల పరిధిలో నిఘానేత్రాలను ఏర్పాటు చేయించింది. వీటిపై ప్రజలు, వ్యాపారులు, అపార్టుమెంట్లటో నివాసంటున్న వారికి అవగాహన కల్పించింది. చోరీలు జరిగినా.. రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నా.. అపహరణలు.. ఇతర నేర సంఘటనలకు సంబంధించిన అంశాల్లో నిఘా కెమెరాలే కీలకంగా మారాయి.
చాలా చోట్ల నిర్వహణ లోపం
కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు చాలా చోట్ల పనిచేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. ప్రధాన కేంద్రాల్లో ఉన్న నిఘా కెమెరాలు సైతం పనిచేయకపోవడంతో కొన్ని సందర్భాల్లో అక్కడ జరిగిన సంఘటనలను అవి చిత్రీకరించలేకపోయాయి. నేర సంఘటనలు, ఇతర సంఘటనలు జరిగిన సమయంలో అక్కడి ఫుటేజీలు అందుబాటులో లేక స్థానికంగా ఉన్న వారిపైనే ఆధారపడాల్సి వచ్చింది. ఓవ్యక్తి మృతి సంఘటనలో కారణాలు తెలియరాలేదు. అక్కడున్న సీసీ కెమెరా పనిచేయకపోవడంతో రహదారి ప్రమాదమా.. సాధారణ మరణమా అన్నది తెలియలేదు. ఏదైనా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడా అన్న విషయాన్ని కనుక్కోవడం కష్టతరంగా మారింది. చివరికి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన సంఘటన గోదావరిఖనిలో నెలకొంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించే వరకు ఆసక్తి చూపుతున్న పోలీసు అధికారులు అవి నిరంతరం పనిచేసే విధంగా చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇళ్లలో వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలపై ఆధారపడాల్సి వస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..