ప్రజల మధ్యకు రావడానికి బందోబస్తు ఎందుకు?
ప్రజలతో ఎన్నికైన శాసనభ్యుడు, మంత్రి కేటీఆర్, ప్రజల్లోకి రావడానికి పోలీసుల రక్షణ కవచం ఎందుకని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా ఎల్లారెడ్డిపేటకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు, వంద పడకల ఆసుపత్రిని
ఎల్లారెడ్డిపేటలో పాదయాత్ర నిర్వహిస్తున్న పొన్నం
ఎల్లారెడ్డిపేట, న్యూస్టుడే: ప్రజలతో ఎన్నికైన శాసనభ్యుడు, మంత్రి కేటీఆర్, ప్రజల్లోకి రావడానికి పోలీసుల రక్షణ కవచం ఎందుకని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా ఎల్లారెడ్డిపేటకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు, వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రెండో రోజు బుధవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుంచి వెంకటాపూర్ వరకు పాదయాత్ర కొనసాగింది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోకి ప్రవేశించింది. వర్షానికి తమ ఇల్లు కూలిపోయినా ఎలాంటి నష్టపరిహారం అందలేదని, రెండు పడక గదుల ఇంటిని మంజూరు చేయలేదని పేర్కొంటూ కోనేటి అనిత అనే మహిళ పొన్నం ఎదుట వాపోయింది. మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయాలని పేర్కొంటూ జూనియర్ కళాశాల విద్యార్థులు పొన్నంకు వినతిపత్రం సమర్పించారు. వీఆర్ఏలు, సుంకరి ఇస్సాదారుల సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి డిమాండ్లను తీర్చేందుకు సీఎంకు లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కేటీఆర్ పర్యటించిన ప్రతిసారి ప్రతిపక్ష నాయకులను ఎందుకు అరెస్ట్ చేయిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. పేదలు, టెక్స్టైల్ పార్కుపై కేంద్రం పన్నులు వేస్తే ఎంపీ బండి సంజయ్ మౌనంగా ఉండటం సిగ్గు చేటని పేర్కొన్నారు.
సిరిసిల్లకు చేరిన పాదయాత్ర
సిరిసిల్ల గ్రామీణం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను గ్రామ గ్రామాన వివరించడానికే పాదయాత్ర చేస్తున్నట్లు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్గౌడ్ పేర్కొన్నారు. బుధవారం రెండో రోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుంచి సిరిసిల్ల పట్టణ పరిధిలోకి 14 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని సర్దాపూర్, పెద్దూరు గ్రామాల్లో మహిళలతో ముచ్చటించారు. విలీన గ్రామాల సమస్యలను గ్రామస్థులు ఆయనకు వివరించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యానారాయణగౌడ్, మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్, రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక, శ్రీనివాస్, సూర దేవరాజు, దొమ్మాటి నర్సయ్య పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూసేకరణలో జాప్యం
[ 28-03-2024]
భూసేకరణలో జాప్యమే జాతీయ రహదారుల విస్తరణకు శాపంగా మారుతోంది. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిగా మార్చి దశాబ్దం కావస్తున్నా.. నిర్మాణం మొదలు కావటం లేదు -
నత్తనడకన నిర్మాణాలు
[ 28-03-2024]
వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పల్లెదవాఖానాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర(సబ్సెంటర్ల)ను పల్లె దవాఖానాలుగా మార్చారు -
నిధులు వెచ్చించి.. పనులు వదిలేసి
[ 28-03-2024]
పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఆధునిక సాంకేతికను జోడించి పెద్ద నగరాలకు దీటుగా పోటీ పడేందుకు ప్రణాళికలు చేసిన నగరపాలిక.. ఆ విధానం అమలులో వెనుకబడింది -
తాగునీటి వృథా వద్దు : కలెక్టర్
[ 28-03-2024]
అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
కాంగ్రెస్ నిజామాబాద్ లోక్సభ స్థానం టికెట్ జీవన్రెడ్డికే దక్కింది. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది -
తొలిమెట్టు నోడల్ అధికారులకు భత్యం
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక బోధన పద్ధతులతో కొనసాగుతున్న ఈ కార్యక్రమ పర్యవేక్షణకు మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 28-03-2024]
వాతావరణ సమాచారాన్ని ప్రతిఒక్కరి దైనందిన కార్యకలాపాల్లో భాగం చేయాలనే ఉద్దేశంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇటీవల ‘పంచాయత్ మౌసం సేవా’ మొబైల్ యాప్ విడుదల చేసింది. -
పఠనాలయం సద్వినియోగం... కల సాకారం
[ 28-03-2024]
గ్రంథాలయ పుస్తకాలతోనే ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించగలిగాను. తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ నిర్వహించిన ఫలితాల్లో పీజీటీ సాంఘికశాస్త్రం, జూనియర్ కళాశాలలో పౌరశాస్త్రం లెక్చరర్గా ఉద్యోగాలకు ఎంపికయ్యాను -
పంచాయతీల ఖజానా ఖాళీ
[ 28-03-2024]
ఓవైపు ఖజానా ఖాళీ, మరోవైపు సమస్యలు పంచాయతీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జమయ్యే నిధులకు మించిన వ్యయం చేయడంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఓటు నమోదుకు ప్రత్యేక సాధారణ సెలవు
[ 28-03-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!