అభివృద్ధి పేరు... అక్రమాల జోరు
అభివృద్ద్ధి పనుల పేరుతో ఏర్పాటు చేసిన సిమెంట్ కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్ల పనులు నిలిచిపోయినా యథేచ్ఛగా అక్రమ వ్యాపారాన్ని కొసాగిస్తున్నారు. వాస్తవానికి భూగర్భ గనులు, రెవెన్యూ, ఇరిగేషన్, కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల అనుమతులు
శ్రీ యథేచ్ఛగా సిమెంట్ కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్ల జీరో దందా
న్యూస్టుడే, వేములవాడ
అభివృద్ద్ధి పనుల పేరుతో ఏర్పాటు చేసిన సిమెంట్ కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్ల పనులు నిలిచిపోయినా యథేచ్ఛగా అక్రమ వ్యాపారాన్ని కొసాగిస్తున్నారు. వాస్తవానికి భూగర్భ గనులు, రెవెన్యూ, ఇరిగేషన్, కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల అనుమతులు పొందిన తరవాతే సిమెంట్ కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. ఇవేమీ పట్టించుకోకుండా అభివృద్ధి పనుల పేరుతో ఏర్పాటు చేస్తూ నిబంధనలను తుంగలో తొక్కి జీరో దందాకు తెర తీస్తున్నారు. ఇందులో వినియోగించే ఇసుక, కాంక్రీట్కు సంబంధించి ప్రభుత్వ నిబంధనల మేరకు కొనుగోలు చేసి వినియోగించాలి ఉంది. ఇసుకను దొంగచాటున మూలవాగు, మానేరు వాగుల నుంచి తరలించి వినియోగిస్తున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
వేములవాడ పట్టణంలోని బాల్నగర్, జయవరం, వేములవాడ మండలంలోని ఆరెపల్లి వద్ద సిమెంట్ కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్లు నడుస్తున్నాయి. ఇందులో వేములవాడ గుడి చెరువు అభివృద్ధి పనుల కోసం బాల్నగర్ వద్ద దాదాపు 2016లో ఎలాంటి అనుమతులు లేకుండానే సిమెంట్ కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. గుడి చెరువులో చేపట్టిన వివిధ పనులకు ఈ మిక్సింగ్ ప్లాంట్ను వినియోగించారు. పనుల కోసం పెద్ద ఎత్తున ఇసుకను డంప్ చేశారు. మూడేళ్ల క్రితమే గుడి చెరువు పనులు నిలిచిపోయాయి. గుత్తేదారు పనులకు సంబంధించిన టిప్పర్లు, జేసీబీలు వంటి భారీ వాహనాలను తరలించి క్యాంప్ను ఎత్తేశారు. అప్పటి నుంచి సిమెంట్ కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్ ప్రైవేటు వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతుంది. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. ఇక్కడ నుంచి కొంత మంది గుత్తేదారులకు మిక్సింగ్ మెటీరియల్ను నిరంతరాయంగా సరఫరా అవుతుంది. అయినా ఏ శాఖకు సంబంధించిన అధికారులూ అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. సిమెంట్ కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్ నిరంతరాయంగా పెద్ద ఎత్తున నడిపిస్తూ గుడి చెరువు కోసం డంపు చేసిన ఇసుకలో సగం వరకు వినియోగించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ప్లాంట్ బైపాస్ రోడ్డును ఆనుకుని ఉండటంతో దుమ్ము, ధూళితో బాల్నగర్ ప్రజలు, రోడ్డుపై వెళ్లే వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.
అధికారులు ఏమంటున్నారంటే...
జయవరం సిమెంట్ కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్ను తనిఖీ చేసిన సందర్భంలో వెల్లడైన అంశాలపై ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు చర్యలు తీసుకుంటారని మైనింగ్ ఏడీ సైదులు పేర్కొన్నారు. దీనిపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. సిమెంట్ కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్లను పరిశీలించి అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వేములవాడ తహసీల్దార్ రాజు ‘న్యూస్టుడే’కు తెలిపారు.
వేములవాడ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన సిమెంట్ కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్
చెక్డ్యాం పేరుతో మరొకటి...
వేములవాడ పట్టణ శివారులోని జయవరం మూలవాగులో నిర్మిస్తున్న చెక్డ్యాం పేరుతో మూలవాగు ఒడ్డున సిమెంట్ కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్లోని మిక్సింగ్ అయిన సిమెంట్, కాంక్రీట్ చెక్డ్యాం నిర్మాణానికి వినియోగిస్తూనే ఇతర ప్రాంతాలకు మెటీరియల్ను తరలిస్తూ వ్యాపారం కొనసాగించారు. ఒక ట్రిప్పు ఇసుక కూడా నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. పక్కనే ఉన్న వాగులోని ఇసుకతో అక్రమ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగించారు. ఇటీవల ఈ ప్లాంటును సంబంధిత శాఖల అధికారులు ఏక కాలంలో తనిఖీ చేసి కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంటుకు సంబంధించిన పైళ్లను పరిశీలించారు. ఏ ఒక్క శాఖ నుంచి అనుమతులు తీసుకోలేదని వెల్లడైంది. దీంతో ఆయా శాఖల అధికారులు పైళ్లను స్వాధీనం చేసుకున్నారు. మిక్సింగ్ ప్లాంట్ తనిఖీ చేసి దాదాపు నెల రోజులు గడిచిపోయినప్పటికి ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా ఆయా శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమ ప్లాంట్లపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?