‘పట్టు’ క్షేత్రం... ఆక్రమణల పర్వం
మెట్ట ప్రాంతమైన జిల్లాలో ఒకప్పుడు ఉద్యానవన పంటలు ఎక్కువగా సాగయ్యేవి. అందులో మల్బరీ వేల ఎకరాల్లో ఉండేది. దీనికి అనుబంధంగా పట్టుగూళ్ల పెంపకం చేపట్టేవారు. ప్రస్తుతం జిల్లాలో 30 ఎకరాల్లో ఉన్నట్లు అంచనా. ఉమ్మడి కరీంనగర్
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల, న్యూస్టుడే, గంభీరావుపేట
పట్టుక్షేత్ర ప్రాంగణం
మెట్ట ప్రాంతమైన జిల్లాలో ఒకప్పుడు ఉద్యానవన పంటలు ఎక్కువగా సాగయ్యేవి. అందులో మల్బరీ వేల ఎకరాల్లో ఉండేది. దీనికి అనుబంధంగా పట్టుగూళ్ల పెంపకం చేపట్టేవారు. ప్రస్తుతం జిల్లాలో 30 ఎకరాల్లో ఉన్నట్లు అంచనా. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు పట్టు గూళ్లు, మల్బరీ మొక్కలను పంపిణీ చేసే పట్టు క్షేత్రం నిరాదరణకు గురవుతోంది. శిథిలమైన భవనాలు, కనీస వసతులు లేక పర్యవేక్షణ కరవైంది. చుట్టూ ఆక్రమణలతో పట్టు తప్పుతోంది.
జిల్లా పూర్తిగా మెట్టప్రాంతం కావడంతో వాణిజ్య పంటలకు ప్రత్యామ్నాయంగా మల్బరీ సాగును ప్రోత్సహించేవారు. దీనికోసం గంభీరావుపేట మండలం నర్మాలలో నిజాం కాలంలో పట్టు క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. మల్బరీ సాగుకు మొక్కల పంపిణీ, పట్టుగూళ్ల పెంపకం, మార్కెటింగ్ అవకాశాలపై ఇక్కడ రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించేవారు. ప్రస్తుతం నీటి లభ్యత పెరుగుతుండటం, ప్రత్యామ్నాయ పంటలు రావడంతో మల్బరీ సాగు, పట్టుగూళ్ల పెంపకం కనుమరుగవుతుంది. దీనితోపాటే ఈ క్షేత్రంపై ఉద్యానవనశాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఈ క్షేత్రంలో ఉద్యానవన అధికారి, పరిశోధన, సాంకేతిక సహాయకులు పని చేసేందుకు 15 మంది సిబ్బంది ఉండాలి. ప్రస్తుతం ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇందులో ఒకరు జిల్లా ఉద్యానవనశాఖ కార్యాలయంలో పని చేస్తుండగా మరొకరు స్థానిక క్షేత్రంలో ఉన్నారు. రెండేళ్ల క్రితం పట్టు పరిశ్రమను ఉద్యానవనశాఖలో విలీనం చేయడంతో ఇందులో ప్రత్యేకంగా ఉద్యోగ నియామకాలు లేవు.
సరిహద్దులు లేక...
నర్మాలలోని 27.11 ఎకరాల విస్తీర్ణంలోని ఈ క్షేత్రం చుట్టూ సరిహద్దులు లేవు. దీంతో దీని చుట్టూ ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. 2017లో దీనిపై ఫిర్యాదులు రావడంతో రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో సర్వే చేసి హద్దురాళ్లు ఏర్పాటు చేశారు. తర్వాత పర్యవేక్షణ కొరవడంతో తిరిగి యథాస్థితి పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల నివాసానికి ఏర్పాటు చేసిన గృహాలు, కార్యాలయం, పరిశోధన భవనాలు నిరుపయోగంగా మారడంతో దీనికి ఉన్న తలుపులు, కిటికీలు అపహరణకు గురవుతున్నాయి.
ప్రహరీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం - జ్యోతి, జిల్లా ఉద్యానవన అధికారి
పట్టుక్షేత్రం చుట్టూ ప్రహరీ, నీటి వసతి ఏర్పాటుకు రూ. 40 లక్షలతో ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపాం. నిధుల కేటాయింపును బట్టి క్షేత్రం అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. సిబ్బంది కొరత ఉండటంతో మల్బరీసాగు, పట్టుగూళ్ల పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులకు వివరిస్తున్నాం. జిల్లాలో ముస్తాబాద్, ఇల్లంతకుంట, వేములవాడలో మల్బరీ సాగుకు రైతులు ముందుకొస్తున్నారు.
శిథిలమైన భవనం
అవసరాలు అనేకం
జిల్లాలో ఆయిల్పాం సాగుపై రెండేళ్లుగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో సిరిసిల్ల శివారు రగుడులో 20 ఎకరాల్లో ఆయిల్పాం మొక్కల పెంపకం చేపడుతున్నారు. సాగుపై ఆసక్తితో ముందుకొచ్చే రైతులకు ఈ నర్సరీ నుంచి ఉద్యానవనశాఖ ద్వారా మొక్కలు అందించనున్నారు. ప్రస్తుతం జిల్లా సాగు విస్తీర్ణంలో ఉద్యానవన పంటలు 20 శాతానికి మించడం లేదు. కూరగాయలు, పండ్లను ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. వ్యవసాయ, ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో ఈ క్షేత్రంలో కూరగాయలు, జిల్లా నేలలకు అనువైన ఉద్యానవన పంటలను ప్రోత్సహించేలా నర్సరీలను ఏర్పాటు చేసిన రైతులకు అందజేస్తే జిల్లాలో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయ, పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులకు అధ్యయన కేంద్రంగా వినియోగంలోకి తీసుకొస్తే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండో రోజు నలుగురు నామినేషన్
[ 20-04-2024]
కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ స్థానాలకు రెండో రోజు శుక్రవారం కేవలం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్ స్థానం కోసం భాజపా అభ్యర్థి బండి సంజయ్ తరఫున ఆ పార్టీ నాయకులు ఎన్నికల అధికారికి నామపత్రాలను అందజేశారు. -
ఆర్ఎం కార్యాలయానికి ఆరుగురు ఉద్యోగుల సరెండర్
[ 20-04-2024]
హుజూరాబాద్ ఆర్టీసీ డిపోనకు చెందిన ఆరుగురు ఉద్యోగులను కరీంనగర్ ఆర్ఎం కార్యాలయానికి సరెండర్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్థానిక డిపోలో పనిచేసే డ్రైవర్ రవీందర్ వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ డిపో మేనేజర్ శ్రీకాంత్ ఈ నెల 15న అనిశా అధికారులకు చిక్కిన విషయం విదితమే. -
ఉక్కపోతతో తల్లీబిడ్డల ఉక్కిరిబిక్కిరి
[ 20-04-2024]
భానుడి భగభగలకు ఉదయం 9 గంటలు దాటితే ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం భయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎండలు 40 డిగ్రీల కంటే అధికంగానే ఉంటున్నాయి. -
కాంగ్రెస్ నేతలకు మానసిక చికిత్స అవసరం
[ 20-04-2024]
కాంగ్రెస్ నేతలకు మానసిక చికిత్స అవసరమని హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు అన్నారు. వారికి చికిత్స అందేలా చూడాలని శుక్రవారం కరీంనగర్లో ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కి వినతిపత్రం అందజేశారు. -
గంగుల, బండిల స్నేహం అందరికీ తెలుసు
[ 20-04-2024]
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ల మధ్య స్నేహం అందరికీ తెలుసునని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను ఓడించేందుకు గంగుల కమలాకర్ భాజపాతో కుమ్మకైనట్లు ఆరోపించారు. -
వారసత్వ సంపద పరిరక్షణకు ఓటేద్దాం
[ 20-04-2024]
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటేనే ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు, వారసత్వ కట్టడాలకు పెట్టింది పేరు. శాతవాహనులు, కాకతీయులు, నిజాముల కాలంలో నిర్మించిన కోటలు, మెట్ల బావులు, ఆలయాలు ఇక్కడ కనిపిస్తాయి. -
ఇదీ అన్నదాత ఎజెండా!
[ 20-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం వ్యవసాయపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. భిన్న వ్యవసాయ ఉత్పత్తులతో రాష్ట్రంలోనే ప్రత్యేకత చాటుకుంటోంది. దేశ విదేశాలకు ఎగుమతి చేసే పసుపు, మామిడి, మొక్కజొన్న, సన్న వరి, చెరకు, ఆవాలు, ఎర్రజొన్న, తెల్లజొన్న, సజ్జ తదితర పంటల దిగుబడిలో ఆదర్శంగా నిలుస్తున్నా అన్నదాతను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. -
ఒక ఎంపీ.. అయిదు జిల్లాలు
[ 20-04-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు గతంలో ఒకే జిల్లా పరిధిలో ఉండేవి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జిల్లాల పునర్విభజనతో ఎంపీ స్థానం అయిదు జిల్లాలకు విస్తరించింది. -
నీటి తొట్టిలో పడి బాలుడి మృతి
[ 20-04-2024]
ఇటుక బట్టీ వద్ద నీటి తొట్టిలో పడి ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. కుటుంబసభ్యులు పోలీసుల కథనం ప్రకారం.. -
శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోండి
[ 20-04-2024]
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కేజీబీవీల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థినులకు కరీంనగర్ కేజీబీవీలో నిర్వహిస్తున్న ఎప్సెట్ శిక్షణ తరగతులను సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు అధికారి మల్లయ్య భట్టు శుక్రవారం సందర్శించారు. -
కరీంనగర్లో రూ.15.81 లక్షల పట్టివేత
[ 20-04-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా శుక్రవారం పోలీసులు కరీంనగర్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రూ.15.81 లక్షల నగదును పట్టుకున్నట్లు కమిషనర్ కార్యాలయం తెలిపింది. -
ఇంటి నుంచే ఓటింగ్పై అధికారులకు శిక్షణ
[ 20-04-2024]
ఇంటినుంచే ఓటింగ్పై పాటించాల్సిన నిబంధనలపై అధికారులకు మంథని శాసనసభ సెగ్మెంట్ అధికారి హనుమనాయక్ అవగాహన కల్పించారు. శుక్రవారం మంథని ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులకు శిక్షణ ఇచ్చారు. -
అడుగడుగునా తనిఖీలతో ప్రలోభాలకు అడ్డుకట్ట
[ 20-04-2024]
ఎన్నికల్లో డబ్బు, మద్యం, మాదకద్రవ్యాల పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. లోక్సభ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో జిల్లా సరిహద్దు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
పెరుగుతున్న పసిడి ధరలు... తగ్గుతున్న వ్యాపారం
[ 20-04-2024]
బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకి వెళుతున్నాయి. గతంలో పెళ్లి ముహూర్తాల సమయంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టేవి. దీనికి భిన్నంగా మార్కెట్లో ప్రస్తుతం పసిడి ధర పది గ్రాములు(తులం) రూ.76,000 వరకు పలుకుతోంది. -
కిట్టు సరే.. పరీక్ష చేసేవారేరీ?
[ 20-04-2024]
కలుషిత నీటితో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో ప్రజలకు శుద్ధ జలం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అక్కడక్కడ పైపులు పగిలి లీకేజీతో కలుషితమైన నీరు సరఫరా అయ్యే అవకాశం ఉంది. -
ఆరేళ్లుగా ఉపాధి కరవు
[ 20-04-2024]
వలసల నివారణకు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల కోసం ఆరేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఆ కుటుంబాలకు పనులు కల్పించడం లేదు. -
ప్రజలు మళ్లీ మోసపోవద్దు
[ 20-04-2024]
భాజపా అభ్యర్థి అర్వింద్ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. పొద్దునలేస్తే హిందూ-ముస్లిం, పాకిస్థాన్-ఇండియా, రోహింగ్యాంటూ మాటలు చెప్పడమే గాని ఎంపీగా ప్రజలకు చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. -
‘పసుపు బోర్డు పేరుతో మోసం’
[ 20-04-2024]
పసుపు బోర్డు పేరుతో ఎంపీ ధర్మపురి అర్వింద్ రైతులను మోసం చేశారని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు కూడా మభ్యపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తాజా వార్తలు (Latest News)
-
వేధింపులు.. ఊడిగంలో తగ్గేదే లేదు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి