ఆహ్లాదం.. అందనంత దూరం
పట్టణ ప్రజలకు ఆహ్లాదం అందనంత దూరంగా మారింది.. ఉద్యానవనాలు, మినీట్యాంక్ బండ్ నిర్మాణం కోసం రూ.కోట్లు వెచ్చించినా ఏళ్ల తరబడి పనులను మధ్యలోనే వదిలేసి నిర్లక్ష్యం చేస్తున్నారు.. పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రాకుండానే
న్యూస్టుడే, కోరుట్ల
కోరుట్లలో మినీ ట్యాంక్బండ్
కోరుట్ల పట్టణంలో మద్దుల చెరువును మినీట్యాంకు బండ్గా మార్చేందుకు సుమారు ఐదేళ్ల క్రితం రూ.2 కోట్లకుపైగా నిధులను కేటాయించి పనులు ప్రారంభించారు. చెరువు కట్ట విస్తీర్ణం, ఎత్తును పెంచారు. కట్టకు ఇరువైపులా ఇనుప రెయిలింగ్ను ఏర్పాటు చేసి కట్టపై సీసీరోడ్డును నిర్మించారు. కట్టకు ఇరువైపులా గేట్లను బిగించి, లైటింగ్ను ఏర్పాటు చేశారు. చెరువులో ఎక్కువైన నీరు వెళ్లేందుకు నూతనంగా మత్తడి నిర్మాణ పనులు చేశారు. మినీ ట్యాంకుబండ్ పనులు పూర్తిచేసి మూడేళ్లుగా సుందరీకరణ పనులు చేపట్టకుండా వదిలేశారు. మినీ ట్యాంకుబండ్ సుందరీకరణ కోసం టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.1.20 కోట్లను మూడేళ్ల క్రితం కేటాయించారు. సుందరీకరణ పనులు ప్రారంభించి ఏడాది గడుస్తున్నా మధ్యలోనే వదిలేశారు. ఈ నిధులతో స్వాగత తోరణం, బతుకమ్మగాట్, గార్డెనింగ్, పిల్లల పార్కు, నీడనిచ్చే, పూల మొక్కల పెంపకం, ధ్యాన మందిరం, గార్డ్ గది, ఫుడ్కోర్, లైటింగ్, కుర్చీలు, మూత్రశాలల నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది.
బోటింగ్ ఏర్పాటు ఎప్పుడో?
ట్యాంకుబండ్ పనులు పూర్తయ్యేలోపు చెరువులో బోట్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ట్యాంకుబండ్ వద్దకు వచ్చే చిన్నారులు గార్డెన్లో ఆడుకోవడంతోపాటు బోటులో షికారు చేసేలా ప్రణాళికలను రూపొందించారు. ఉదయం, సాయంత్రం వేళలో వాకింగ్కు వచ్చే వారి కోసం, వారు సేదతీరేందుకు కుర్చీలు, కట్టపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. మద్దుల చెరువు(మినీ ట్యాంకుబండ్) పూర్తి విస్తీర్ణంను గుర్తించి చుట్టూ శాశ్వతంగా హద్దులను ఏర్పాటు చేయాల్సి ఉంది. చెరువు శిఖం భూమిలో ఎలాంటి నిర్మాణాలు జరగకుండా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి. పైభాగం నుంచి వచ్చే మురుగు కాలువ నీరు చెరువులో చేరి నీరంతా పూర్తిగా కలుషితమౌతోంది. చెరువులో గుర్రపుడెక్క పెరిగి, కట్టపై పిచ్చిమొక్కలు పెరిగి పూర్తి ఆధ్వానంగా తయారైంది. చెరువు పైభాగంలో కాలువలను నిర్మించి మురుగు నీరు చేరకుండా, పాదచారుల నడక కోసం ఫుట్ఫాత్, రెయిలింగ్ నిర్మాణం కోసం రూ.2.5 కోట్ల కేటాయించి ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభానికి నోచుకోలేదు.
నిర్మాణ దశలో పిల్లల పార్క్
అధ్వానంగా ఉద్యానవనాలు
పట్టణంలోని చిన్నారులు ఆడుకునేందుకు సుమారు 16 ఏళ్ల క్రితం సాయిరాంపురకాలనీలో మున్సిపల్ పార్క్ను ఏర్పాటు చేశారు. మూడేళ్ల క్రితం పార్క్ను ఆధునికీకరించేందకు టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.50 లక్షలను మంజూరు చేశారు. పనులు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా మధ్యలోనే వదిలేశారు. చుట్టూ నూతనంగా ప్రహరీ నిర్మించి రంగులను వేయించారు. టైల్స్ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. చిన్నారులు ఆడుకునేందుకు పలు పరికరాలు, వ్యాయామం చేసేందుకు జిమ్ పరికరాలను ఏర్పాటు చేసినా అసంపూర్తిగా వదిలేశారు. పార్క్లో పిచ్చిమొక్కలు పెరిగి కళావిహీనంగా కనిపిస్తుంది. దీంతో చిన్నారులకు ఉద్యానవనం అందుబాటులో లేకుండా పోయింది. బాబుజగ్జీవన్రామ్ విగ్రహం ఆవరణలోని వాగులో ఉద్యానవనం నిర్మించేందుకు 3.20 ఎకరాల స్థలం, టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.40 లక్షలను కేటాయించారు. పార్క్ నిర్మాణ పనులను ఏడాదిన్నర క్రితం ప్రారంభించారు. వాగులోని స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణం కోసం పిల్లర్లను నిర్మించారు. రెండేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలకు పార్క్ స్థలం వరద నీటిలో మునిగిపోయింది. ప్రహరీ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన పిల్లర్లు ఓవైపు కూలిపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్