logo

హామీలు గాలికొదిలిన తెరాస

తెరాస సర్కారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదని  రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ, 57 ఏళ్లకు పింఛన్లు ఇస్తామని ఇచ్చిన హామీలు నీటిమూటలయ్యాయని కరీంనగర్‌ మాజీ పార్లమెంట్‌ సభ్యులు పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు

Published : 14 Aug 2022 06:33 IST

బావుపేటలో పాదయాత్ర నిర్వహిస్తున్నపొన్నం ప్రభాకర్‌

బావుపేట(కరీంనగర్‌ గ్రామీణం), న్యూస్‌టుడే: తెరాస సర్కారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదని  రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ, 57 ఏళ్లకు పింఛన్లు ఇస్తామని ఇచ్చిన హామీలు నీటిమూటలయ్యాయని కరీంనగర్‌ మాజీ పార్లమెంట్‌ సభ్యులు పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. ఆయన చేపట్టిన పాదయాత్ర శనివారం మధ్యాహ్నం జిల్లాలోకి ప్రవేశించింది. కొత్తపల్లి మండలం ఎల్గందల్‌ చౌరస్తాకు పాదయాత్ర ద్వారా వచ్చిన పొన్నం ప్రభాకర్‌ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడారు. స్థానిక శాసనసభ్యుడు ప్రజల సమస్యలు గాలికొదిలేసి జల్సాలకు అలవాటు పడ్డారని ఆరోపించారు. పాదయాత్రలో కరీంనగర్‌ నియోజకవర్గ నాయకుడు మేనేని రోహిత్‌రావు, డీసీసీ పట్టణ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కొత్తపల్లి మండల అధ్యక్షుడు మురళీమనోహర్‌, డీసీసీ సెక్రెటరీ బొమ్మ ఈశ్వర్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు మడుపు మోహన్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు బొబ్బిలి విక్టర్‌, పార్టీ ఎస్టీసెల్‌ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్‌నాయక్‌, జిల్లా కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని