సరకు తీసుకెళ్లడానికి వచ్చి లారీ చోరీ
లారీ దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను సుల్తానాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని ఠాణాలో శనివారం ఏసీపీ సారంగపాణి విలేకరులతో వివరాలు వెల్లడించారు. ఏపీలోని ఏలూరు జిల్లా పెదవేగి మండలం జగన్నాథపురానికి చెందిన వాలేపు బలం, గుంజి జ్వాల బావ, బావమరుదులు.
ఇద్దరు నిందితుల అరెస్టు
నిందితులను, స్వాధీనం చేసుకున్న లారీని చూపుతున్న ఏసీపీ సారంగపాణి
సుల్తానాబాద్, న్యూస్టుడే: లారీ దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను సుల్తానాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని ఠాణాలో శనివారం ఏసీపీ సారంగపాణి విలేకరులతో వివరాలు వెల్లడించారు. ఏపీలోని ఏలూరు జిల్లా పెదవేగి మండలం జగన్నాథపురానికి చెందిన వాలేపు బలం, గుంజి జ్వాల బావ, బావమరుదులు. లారీ డ్రైవర్లుగా పని చేస్తున్న వీరు ఈ నెల 6న ఏలూరు నుంచి కరీంనగర్ జిల్లా మొగ్ధుంపూర్ కోళ్లఫారం వద్దకు తౌడు లోడుతో వచ్చారు. తిరుగు ప్రయాణంలో సరకును తీసుకెళ్లేందుకు సుల్తానాబాద్లోని మండల బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద లారీతో రాత్రంతా వేచి ఉన్నారు. 7న తెల్లవారుజామున 2 గంటలకు తమ లారీ పక్కనే నిలిపి ఉన్న మరో లారీని దొంగిలించి వెంట తీసుకెళ్లారు. సదరు లారీ యజమాని ఫిర్యాదు మేరకు ఈ నెల 7న కేసు నమోదు చేసిన పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలించారు. కాగా మరో లారీ దొంగతనం కోసం 12న కరీంనగర్కు వచ్చిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విచారణలో తాము దొంగలించిన లారీని గుంటూరుకు చెందిన ఫిరోజ్కు రూ.3 లక్షలకు అమ్మినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఈ మేరకు శనివారం గుంటూరు నుంచి లారీని తెప్పించిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వారం రోజుల్లోనే కేసును ఛేదించిన సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సైలు ఉపేందర్రావు, అశోక్రెడ్డి, వినీత, సిబ్బందికి ఏసీపీ నగదు రివార్డు అందజేసి అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకా.. వెంకటస్వామికి ఆ పేరెలా వచ్చింది?
[ 24-04-2024]
కాంగ్రెస్ పార్టీ దివంగత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి ‘కాకా’గానే ఎక్కువ మందికి సుపరిచితులు. ఆయనకు ఈ పేరు రావడం వెనుక ఆసక్తికర అంశం ఉంది. -
యాప్ కష్టాలు
[ 24-04-2024]
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన యాప్ల్లో సమాచారం నిక్షిప్తం చేయాల్సి ఉంది. -
నిర్వహణ భారం.. కమీషన్లో కోత
[ 24-04-2024]
కేంద్రాల నిర్వహణ భారంగా మారగా.. వచ్చిన కమీషన్లో కోత విధించడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. -
ఇక ట్వంటీ20 పోరు!
[ 24-04-2024]
పోలింగ్ తేదీకి బుధవారం నుంచి సరిగ్గా ఇరవై రోజులుంది.. అచ్చంగా ట్వంటీ20 క్రికెట్ ఆటలోని 20 ఓవర్ల మాదిరి సమరం. -
మిగిలింది రెండు రోజులే!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలి అంకం రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల స్వీకరణ పూర్తవనుంది. -
నకిలీ పత్రాలు సృష్టించి.. ఇల్లు ధ్వంసం
[ 24-04-2024]
నకిలీ పత్రాలు సృష్టించి, ఇంటిని ధ్వంసం చేసి, దాడికి పాల్పడిన అయిదుగురిని కరీంనగర్ కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. -
పార్టీ పెద్దల సమ్మతితోనే రాజేందర్ నామినేషన్
[ 24-04-2024]
పార్టీ పెద్దల సమ్మతితోనే తామంతా కలిసి కాంగ్రెస్ తరఫున వెలిచాల రాజేందర్రావుతో నామినేషన్ వేయించామని, గెలిపిం చుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. -
అతివల ఉపాధికి ఆదరువేదీ!
[ 24-04-2024]
రాష్ట్రంలో 6 లక్షల మంది బీడీ కార్మికులుండగా అత్యధికంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నారు. -
ఆ పది మందికే 50 శాతం ఓటర్ల మద్దతు
[ 24-04-2024]
ఎన్నికల్లో ప్రత్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా విజయం సాధించినట్లే. అయితే గెలుపొందిన అభ్యర్థికి నియోజకవర్గంలోని ఎంత మంది ఓటర్ల మద్దతు ఉందనేది పోటీలో ఉన్న అభ్యర్థులు, నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి మారుతుంది. -
ఆయుధాలు అప్పగించారు..
[ 24-04-2024]
వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. -
మాతాశిశుకు తప్పని ఉక్కపోత
[ 24-04-2024]
చంటి బిడ్డలు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వేసవి ఉక్కపోత తప్పడం లేదు. -
బ్యాలెట్ యుద్ధానికి చకచకా సన్నద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. -
పనులకు ఆటంకాలు.. రాకపోకలకు అవస్థలు
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. -
తైబజార్... చిరు వ్యాపారుల బేజార్
[ 24-04-2024]
పురపాలక సంఘంలో తైబజార్ గుత్తేదారు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్