logo

ఘనంగా ఫ్రీడం ర్యాలీ

జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం ఫ్రీడం ర్యాలీ ఘనంగా జరిగింది. టవర్‌ నుంచి తహసీల్‌చౌరస్తా మీదుగా మినీస్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువకులు,

Published : 14 Aug 2022 06:32 IST

ర్యాలీలో కలెక్టర్‌ రవి, ఎస్పీ సింధుశర్మ, జడ్పీ ఛైర్‌పర్సన్‌ వసంత, ఎమ్మెల్యే సంజయ్‌

జగిత్యాల, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం ఫ్రీడం ర్యాలీ ఘనంగా జరిగింది. టవర్‌ నుంచి తహసీల్‌చౌరస్తా మీదుగా మినీస్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువకులు, కళాకారులు పాల్గొన్నారు. కలెక్టర్‌ రవి, ఎస్పీ సీహెచ్‌.సింధుశర్మ, జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత, ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్లు బీఎస్‌ లత, జె.అరుణశ్రీ, జిల్లాస్థాయి అధికారులు, అర్బన్‌ తహసీల్దార్‌ ఆరిఫొద్దీన్‌, నాయబ్‌ తహసీల్దార్‌ రాజేందర్‌, పురపాలక కమిషనర్‌ స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల వేషధారణ, వందలాది మీటర్ల భారీ జెండా, మహిళల కోలాటం, డోలు కళాకారుల విన్యాసాలు అందరినీ అలరించాయి. జిల్లా కలెక్టర్‌ రవి, ఎస్పీ సింధుశర్మ ర్యాలీ పొడవునా జాతీయ జెండాతో నడుస్తూ ఉత్సాహం నింపారు.

భారీ జాతీయ జెండాతో విద్యార్థుల ర్యాలీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని