స్వాతంత్య్రోదమానికి ఆ‘ధారం’
మెట్పల్లి అంటేనే ఖాదీ.. ఖద్దర్ ఉద్యమం.. ఇక్కడి యువకులు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగబాటు ఉద్యమంలో పాల్గొనడం.. ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిల్చి వీరత్వం చాటారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం వేళ ఆనాటి పోరాటాలు,
స్వరాజ్య కాంక్ష రగిల్చిన మెట్పల్లి, వావిలాల ఖాదీ ప్రతిష్ఠాన్లు
న్యూస్టుడే, మెట్పల్లి, జమ్మికుంట
మెట్పల్లి ఖాదీ ముఖద్వారం
మెట్పల్లి అంటేనే ఖాదీ.. ఖద్దర్ ఉద్యమం.. ఇక్కడి యువకులు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగబాటు ఉద్యమంలో పాల్గొనడం.. ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిల్చి వీరత్వం చాటారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం వేళ ఆనాటి పోరాటాలు, కీర్తి శేషులైన మహానుభావులను ఓసారి మననం చేసుకుందాం.
స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరిపోసి నిజాం జాగీర్లకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో మెట్పల్లి ఖాదీ స్ఫూర్తి కేంద్రంగా నిలిచింది. విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తువుల ప్రోత్సాహ లక్ష్యంతో 1929లో గాంధీ శిష్యుడు అన్నాసాహెబ్ సహస్ర బుద్దే ఏర్పాటు చేసిన ఖాదీ జనాల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిల్చడంలో ప్రధాన పాత్ర పోషించింది. మెట్పల్లి ప్రాంతంలో జాగీర్దార్లు, సంస్థానాలు, భూస్వాముల అరాచకాలను ఎదిరించి నిజాం వ్యతిరేక పోరాటం చేశారు. హైదరాబాద్, నాగ్పూర్లో జరిగిన కాంగ్రెస్ మహాసభలకు హాజరై జైలు పాలయ్యారు. పగలు గ్రామాల్లో తిరుగుతూ ఖాదీ సంస్థలో తయారైన స్వదేశీ వస్త్రాలను అమ్ముతూ రాత్రివేళల్లో బుర్రకథలు చెబుతూ సమావేశాలు నిర్వహిస్తూ, నిరక్షరాస్యులకు పాఠాలు బోధిస్తూ ప్రజలను చైతన్య పరిచారు. 1935లో సిరిసిల్లలో మాడపాటి హనుమంతరావు అధ్యక్షతన జరిగిన నాలుగో ఆంధ్ర మహాసభలో పీవీ నరసింహారావు, సురవరం ప్రతాపరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, కె.వి.రంగారెడ్డి పాల్గొన్న మహాసభకు మెట్పల్లి ప్రాంత ఉద్యమకారులు హాజరయ్యారు. 1947లో మెట్పల్లిలో 22 మందిని ఒకే సారి అరెస్టు చేసి రెండునెలలపాటు కరీంనగర్ జైలులో నిర్బంధించారు. తెల్లదొరల పాలన నుంచి 1947లో భారతీయులకు స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల మూకలు సృష్టించిన బీభత్సంతో సంబరాలు జరుపుకోలేక పోయారు. పలువురు ఉద్యమకారులు రహస్యంగా తమ ఇళ్లపై ఖాదీ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఇళ్లలో సంబరాలు జరుపుకున్నారు.
వావిలాల ఖాదీని సందర్శించిన గాంధీ మనవరాలు
ఖాదీ ఉద్యమం
ఖాదీ వ్యాప్తి, హిందూ ముస్లింల మధ్య ఐకమత్యం పెంపొందించడం, అస్పృశ్యత నివారణ లక్ష్యంతో ఖాదీలో పనిచేస్తున్న కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, ఉద్యమకారులు తప్పనిసరిగా ఖాదీ వస్త్రాలు ధరించాలి, ప్రతి నెల ఒక్కొక్కరు 2 వేల గజాల నూలు వడకాలని 1930లో కాంగ్రెస్ నిర్ణయించింది. దీనికి దేశ వ్యాప్తంగా విశేష స్పందన లభించింది. దీంతో మెట్పల్లి ప్రాంతంలో ప్రజలు విదేశీ వస్త్రాలను దహనం చేశారు. స్వదేశీ వస్త్రాల ఉత్పత్తి పెరిగింది. ఖాదీ సంస్థ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ఖాదీ వస్త్రాలను విక్రయించే కేంద్రాలు వెలిశాయి. అప్పటి నుంచి దేశంలో ఖాదీ రాట్నం స్వాతంత్య్ర ఉద్యమ చిహ్నమైంది. ఇక్కడ తయారైన దోమతెరలు విదేశాలకు ఎగుమతి చేశారు. కుట్టులేకుండా రూపొందించిన చొక్కాను నాటి ప్రధానమంత్రి నెహ్రూకు, షేర్వానిని రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్కు అందించిన ఘనత మెట్పల్లి ఖాదీది.'
మెట్పల్లి సంస్థ అధ్యక్షులు
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ఎంపీ చొక్కారావు, మాజీ ఎమ్మెల్యే విజయరంగారావు, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు రాజేశ్వరరావు, హన్మంతరావు మెట్పల్లి ఖాదీ ప్రతిష్ఠాన్కు అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే విద్యాసాగరావు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
రాష్ట్రపతి భవన్కు వావిలాల ఖాదీ జెండాలు
గాంధీ జయంతి సందర్భంగా నూలు వడుకుతున్న కార్యకర్తలు
స్వదేశీ ఉద్యమంలో భాగంగా హైదరాబాద్ ఖాదీ సమితికి అనుబంధంగా 1929లో జమ్మికుంట మండలం వావిలాలలో అన్నాసాహెబ్ సహస్రబుద్దె, లేలేజీలు చరఖా సంఘాన్ని ఏర్పాటు చేసి ఖాదీ వస్త్రోత్పత్తికి శ్రీకారం చుట్టారు. వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తూ వస్త్రోత్పత్తిలో గుర్తింపు పొందింది. దిల్లీలోని రాష్ట్రపతి భవన్కు జాతీయ జెండాలు, అలంకరణ పరదాలు అందించిన ఘనత వావిలాల ఖాదీకి దక్కింది. 1953 నుంచి 1963 వరకు రాష్ట్రపతి భవన్పై వావిలాల ఖాదీ జెండాలు రెపరెపలాడాయని సంస్థ నిర్వాహకులు మననం చేసుకుంటున్నారు. 1968 నుంచి వావిలాల ఖాదీ నిర్వహణను మెట్పల్లి ఖాదీ చేపట్టింది. 1983లో మెట్పల్లి నుంచి విడిపోయింది. వావిలాల, తొర్రూర్, రాంపూర్, మొగుళ్లపల్లి కేంద్రాల్లో ఏటా రూ.3.50 కోట్ల వస్త్రోత్పత్తి జరుగుతుండగా రాష్ట్రంలోని 13 బండార్లలో విక్రయిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు వస్త్రాలను ఎగుతి చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...