అమ్మా లే.. అమ్మా ..!
హృదయ విధారకమైన ఈ సంఘటన కరీంనగర్ నగరపాలక సంస్థలోని అలుగునూర్లో చోటుచేసుకుంది. సిల్ల అనూష(26) కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో బుధవారం మృతి చెందింది.
తల్లి మృతదేహం వద్ద పిల్లల వేదన
తల్లిని పిలుస్తున్నచిక్కీ
ఆ చిన్నారులకేమి తెలుసు అమ్మలేదని.. ఇక తిరిగి రాదని..
అందుకే ఎప్పటిలాగే తల్లి పక్కనే ఆడుకుంటున్నారు..
మమతానురాగాల మాతృ ప్రేమకై ఇలా తల్లడిల్లుతున్నారు..
చుట్టూ గుమిగూడిన జనాలు రోదిస్తుంటే దీనంగా చూస్తున్నారు..
ఆప్యాయంగా బోసినవ్వుల పాప అమ్మ మోమును చూస్తుంటే..
ఏడాదిన్నర వయసున్న కొడుకు అమ్మ నుదురుని ముద్దాడుతుంటే..
ఊహ తెలియని చిన్నారి ‘అమ్మా లెమ్మని’ సైగలతో చేయిపట్టుకుంటుంటే..
పాలు కావాలనేలా.. ప్రేమ పంచాలనేలా అమ్మా.. రమ్మని బాబు పిలుస్తుంటే...
చుట్టూ ఉన్న వారి గుండెలు కరిగిపోయాయి. ఆగని వేదనతో చూపరులకు కన్నీళ్లు రాలాయి.
ఈ మరణాన్ని చూసి అందరి కళ్లు చెమర్చాయి. విధి ఆడిన నాటకమీ.. ఘోరమనే వేదనను మిగిల్చాయి.
హృదయ విధారకమైన ఈ సంఘటన కరీంనగర్ నగరపాలక సంస్థలోని అలుగునూర్లో చోటుచేసుకుంది. సిల్ల అనూష(26) కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో బుధవారం మృతి చెందింది. దీంతో ఆమె ఇద్దరు పిల్లలకు ఏమి జరిగిందో కూడా తెలియని పరిస్థితి.. ఏడాదిన్నర ఉన్న బాబు(రిషికేష్)తోపాటు 8నెలల చిన్నారి(చిక్కీ) తల్లి మృతదేహం వద్ద రోదిస్తున్న తీరు బంధువులను అయినవారిని కన్నీటి సంద్రంలో ముంచింది. మృతురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. అనూష కిడ్నీలో రాళ్లున్నాయనే బాధతో గత కొన్నాళ్లుగా భర్త అనిల్కుమార్తో కలిసి నగరంలోని పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగింది. రెండు కిడ్నీలలో రాళ్లున్న ఇబ్బందికి వైద్యుల సూచనతో మందులు వాడారు. ఇంతలోనే ఆమె ఆరోగ్య సమస్య విషమించడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లినా.. అప్పటికే ఆమె ఆరోగ్యం క్షీణించి మృతి చెందింది. ఆస్పత్రిలో చికిత్స కోసం దాదాపుగా రూ.లక్షకుపైగా వెచ్చించినా తన భార్య బతకలేదనే వేదనను భర్త విలపిస్తూ తెలిపారు. తల్లి మృతితో రెండేళ్లలోపున్న చిన్నారుల వేదన కలచివేస్తోంది..
-ఈనాడు, కరీంనగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.