విద్యుత్తు సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తం
మండలంలో విద్యుత్తు సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చొప్పదండి రీజియన్ పరిధిలో అధికారులతో పాటు సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండటంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇక్కడ పనిచేస్తున్న ముగ్గురు లైన్మెన్లను నెల క్రితం బదిలీ చేయగా ఇద్దరిని మాత్రమే కేటాయించారు.
తరచూ అంతరాయం
ఖాళీగా అధికారుల పోస్టులు
చొప్పదండి,న్యూస్టుడే
చెట్టు కింద బిల్లులు వసూలు చేస్తున్న సిబ్బంది
మండలంలో విద్యుత్తు సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చొప్పదండి రీజియన్ పరిధిలో అధికారులతో పాటు సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండటంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇక్కడ పనిచేస్తున్న ముగ్గురు లైన్మెన్లను నెల క్రితం బదిలీ చేయగా ఇద్దరిని మాత్రమే కేటాయించారు. అందులో ఒకరు దీర్ఘకాలిక సెలవులో వెళ్లి ఇటీవలే విధుల్లో చేరారు. ఇద్దరు కొత్తవారు కావడంతో పట్టణంలో విద్యుత్తు సరఫరా వ్యవస్థపై అనుభవం లేకపోవడంతో ఇబ్బందిగా పరిణమిస్తుంది. దీనికి తోడు పక్షం రోజుల క్రితం ఏఈ, సబ్ ఇంజినీర్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ను సైతం బదిలీ చేశారు. వారి స్థానంలో ఇతరులను కేటాయించలేదు.
పని చేయని ఫ్యూజ్ ఆఫ్ కాల్
పట్టణంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు కలిగితే వినియోగదారులు తమ సమస్యలను సిబ్బందికి తెలిసేలా ఏర్పాటు చేసిన ఫ్యూజ్ ఆఫ్ కాల్కు సరైన భవనం లేకపోవడంతో ప్రజలు తమ సమస్యలను ఎక్కడ చెప్పాలో అర్థం కావడంలేదు. విద్యుత్తు శాఖ అందించిన చరవాణికి ఫోన్ చేసిన లైన్మెన్లు ఎవరు స్పందించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపనికి వారాల తరబడి విద్యుత్తు ఉపకేంద్రానికి పరుగులు తీస్తున్నారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులతో సిఫారసు చేసిన వారికి పనులు చేస్తున్నారు. విద్యుత్తు బిల్లుల చెల్లింపు కేంద్రానికి భవనం లేకపోవడంతో చెట్ల కిందనే వసూళ్లు చేస్తున్నారు. గతలో ఓ ప్రైవేటు ఇంటిలో బిల్లుల వసూలు కేంద్రం ఉండగా అద్దె చెల్లించలేదనే కారణంతో కార్యాలయాన్ని తొలగించారు. ప్రజలు ఇబ్బందులు చూడలేక వ్యవసాయ మార్కెట్కు వెళ్లే దారిలోని మండల పరిషత్కు సంబంధించిన భవనంలో ఏర్పాటు చేశారు. అది సైతం వర్షానికి కూలిపోవడంతో అక్కడ నుంచి ఐకేపీ కార్యాలయం ఆవరణలోని చెట్ల కిందకు మార్చారు. అక్కడ వినియోగదారులు రావడంతో ఐకేపీ కార్యాలయ మహిళలు ఇబ్బందిపడుతున్నారు. అలాగే తరుచు వర్షాలు కురుస్తుండటంతో బిల్లుల వసూలుకు వచ్చే సిబ్బంది సైతం ప్రతీరోజు రావడంలేదు. బిల్లులు ఎక్కడ చెల్లించాలో తెలియక అయోమయానికి లోనవుతున్నార. చొప్పదండి పట్టణ పరిధిలో విద్యుత్తు సరఫరా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడో ఉండదో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. విద్యుత్తు ఉన్నత అధికారులు స్పందించి ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
త్వరలోనే సమస్యలకు పరిష్కారం
- శ్రీనివాస్, విద్యుత్తు ఏడీఈ
చొప్పదండి పరిధిలో విద్యుత్తు సిబ్బందిని త్వరలోనే కేటాయింపు చేసేలా చర్యలు తీసుకుంటాం. ఫ్యూజ్ ఆఫ్ కాల్ కోసం సిబ్బంది కేటాయించిన తర్వాత నూతన భవనం కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఏర్పాటు చేసేలా చూస్తాం. సిబ్బంది సక్రమంగా పనిచేసి తరుచు విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలగకుండా చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
మలేరియా నిర్మూలనకు కృషి
[ 26-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకుని గురువారం జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.