logo

భార్యను హత్య చేసిన భర్త అరెస్టు

అనుమానం పెనుభూతమై భార్యను నడిరోడ్డుపై గొంతు కోసి హత్య చేసిన ప్రవీణ్‌ను బుధవారం  అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ శశిధర్‌, ఎస్సై సుధాకర్‌ విలేకరులకు తెలిపారు. వారి వివరాల ప్రకారం... ఇందుర్తి గ్రామానికి చెందిన కనకం ప్రవీణ్‌తో

Published : 18 Aug 2022 06:46 IST

నిందితుడు ప్రవీణ్‌ అరెస్టు చూపుతున్న పోలీసులు

చిగురుమామిడి; న్యూస్‌టుడే: అనుమానం పెనుభూతమై భార్యను నడిరోడ్డుపై గొంతు కోసి హత్య చేసిన ప్రవీణ్‌ను బుధవారం  అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ శశిధర్‌, ఎస్సై సుధాకర్‌ విలేకరులకు తెలిపారు. వారి వివరాల ప్రకారం... ఇందుర్తి గ్రామానికి చెందిన కనకం ప్రవీణ్‌తో కేశవపట్నం గ్రామానికి చెందిన శిరీషతో పది సంవత్సరాల  కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇటీవల  శిరీష తరచూ ఇతరులతో సెల్‌ఫోన్లో మాట్లాడుతుండేది. ఎవరితో మాట్లాడుతున్నావని ప్రశ్నిస్తే జవాబు చెప్పకుండా నిర్లక్ష్యం వహించేది. దీంతో భార్యపై అనుమానం పెరిగింది.  ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి విడివిడిగా ఉంటున్నారు. ఇటీవల భర్త వేధింపులు భరించలేక  శిరీష విడాకుల నోటీసు పంపించింది.  ఈ కోపంతో ఈనెల 15న  ఉదయం  శిరీషను హత్య చేసి ప్రవీణ్‌ పారిపోయాడు. బుధవారం ప్రవీణ్‌ను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ,ఎస్సై  తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని