విన్నపాలు..బుట్టదాఖలు!
భూమి ఉన్నా.. పట్టా లేదు.. వైకల్యం బాధిస్తున్నా.. పింఛన్ రాలేదు.. నీడ లేదు.. సొంత గూడు కావాలని.. స్వయం ఉపాధి కల్పించాలని.. ఇలా ప్రజావాణికి బాధితులు పోటెత్తుతున్నారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ సమక్షంలో నిర్వహించే
ప్రజావాణి దరఖాస్తులకు మోక్షం కరవు
నోటీసులతో సరిపెడుతున్న అధికారులు
న్యూస్టుడే-పెద్దపల్లి కలెక్టరేట్, కరీంనగర్ గ్రామీణం
పెద్దపల్లి: ప్రజావాణిలో బారులు తీరిన ఫిర్యాదుదారులు(పాతచిత్రం)
భూమి ఉన్నా.. పట్టా లేదు.. వైకల్యం బాధిస్తున్నా.. పింఛన్ రాలేదు.. నీడ లేదు.. సొంత గూడు కావాలని.. స్వయం ఉపాధి కల్పించాలని.. ఇలా ప్రజావాణికి బాధితులు పోటెత్తుతున్నారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ సమక్షంలో నిర్వహించే కార్యక్రమంలో తమ బాధ చెప్పుకుంటే పరిష్కరిస్తారని ఆశగా వస్తున్నారు. కానీ, వారికి అడియాసే ఎదురవుతోంది. పట్టువదలని విక్రమార్కుల్లా పదేపదే ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఉమ్మడి జిల్లాలో ప్రజావాణి తీరుపై ప్రత్యేక కథనమిది..
బాధితులకు భరోసా ఏదీ?
కరోనా అనంతరం రెండున్నరేళ్ల తర్వాత కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. చాలా కాలం తర్వాత అధికారులను ప్రత్యక్షంగా కలిసి సమస్యను చెప్పుకునే అవకాశం రావడంతో పెద్దఎత్తున తరలివస్తున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకు గురై జిల్లా కేంద్రానికి చేరుకొని దరఖాస్తు చేసుకుంటున్నారు. అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడి ఏళ్లగా దరఖాస్తులకు పరిష్కారం దొరకడంలేదు. పరిష్కారం చేయకుండానే అధికారులు నోటీసులు ఇచ్చి పరిష్కరించామని ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ప్రజావాణి దరఖాస్తుల ప్రగతిపై ప్రతి గురువారం కలెక్టర్ సమీక్షిస్తున్నారు. పరిష్కారంలో నిర్లక్ష్యం చేయరాదని ఆదేశిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో దరఖాస్తు తీసుకుని రశీదుతో సరిపెడుతున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో ప్రజల దరఖాస్తులకు మోక్షం లేదు.
మండల కేంద్రాల్లో కనిపించని ప్రజా‘వాణి’
దూరప్రాంతాల నుంచి ప్రజలు జిల్లాకేంద్రానికి రావడంలో ప్రయాణ ఖర్చు, ఇతర ఇబ్బందుల దృష్ట్యా మండల కేంద్రాల్లోనే ప్రజావాణి నిర్వహించేవారు. కరోనా కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడింది.. పరిస్థితి సాధారణ స్థితిలోకి వచ్చినప్పటికీ మండల కేంద్రాల్లో అమలు చేయడంలేదు. దీంతో ప్రజలు దూరభారమైనా జిల్లాకేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. మండలాల్లో ప్రజావాణి ఉంటే ప్రయాస తగ్గనుందని ప్రజలు అంటున్నారు. తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదంటూ మండల అధికారులు చేతులెత్తేస్తున్నారు.
సాంకేతిక సేవలకు మంగళం
జిల్లాల ఆవిర్భావం తర్వాత అప్పటి పాలనాధికారిణి అలగు వర్షిణి ప్రజావాణి కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించారు. ఒక గదిలో ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు బాధితుల దరఖాస్తును స్కానింగ్ చేసి ఒక సంఖ్య కేటాయించి ఆన్లైన్లో నిక్షిప్తం చేసేవారు.. సంబంధిత బాధితుడు ప్రజావాణి వేదిక వద్దకు వెళ్లగానే కలెక్టర్ సంఖ్య ఆధారంగా సమస్యను చూసి అక్కడికక్కడే సంబంధిత అధికారికి పంపించేవారు.. జిల్లా స్థాయిలో పారదర్శకత పెరిగింది. కొవిడ్తో ఈ విధానం అటకెక్కింది.
అత్యధికం భూ సమస్యలే
ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా భూ సమస్యల ఫిర్యాదులే వస్తున్నాయి. భూదస్త్రాల ప్రక్షాళనలో జరిగిన తప్పిదాలతో ఒకటికి పలుమార్లు రావాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్త చట్టంలో ఐచ్ఛికాలు లేకపోవడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
ఇలా చేస్తే.. పారదర్శకతతో పాటే సాంత్వన
ప్రతి దరఖాస్తు పరిష్కరించేందుకు నిర్ణీత గడువు ఉంటే పారదర్శకత పెరుగుతుంది. ప్రస్తుతం జిల్లాల నుంచి మండల స్థాయిలోని అధికారికి దరఖాస్తు చేరిన వెంటనే కొన్ని చోట్ల మీ అర్జీ పరిశీలనలో ఉందుంటూ నోటీసులతో సరిపెడుతున్నారు. అలా కాకుండా పరిష్కారం ఏ స్థాయిలో ఉందనే సమాచారం ఇస్తే బాధితుల్లో కొంత భరోసా కలగనుంది. ప్రతి దరఖాస్తు పురోగతి ఆన్లైన్లో ఉంటే పర్యవేక్షణ చేసేందుకు వీలుంటుంది.
ఈయన పేరు సదయ్య.. తన తండ్రి పేరిట పెద్దపల్లి మండలం మూలసాల శివారులో సర్వే నంబర్ 3లో పాత పట్టా పుస్తకం ఉంది. ఏళ్లతరబడి సాగు చేస్తూ ప్రతిఫలం పొందుతున్నారు. కొత్త పాసుపుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్న ఫలితంలేదు. ప్రజావాణిలో అర్జీ పెట్టుకున్నా ఫలితం శూన్యం
కరీంనగర్కు చెందిన దొమ్మడి రాజు నగర శివారులోని గ్రామాల్లో ప్రభుత్వ భూములను పరిరక్షించాలని నాలుగేళ్లుగా ప్రజావాణిలో దరఖాస్తు చేస్తున్నారు. కొందరు అక్రమంగా వెంచర్లు చేసి భూముల అమ్మకాలు చేస్తుండటంతో ప్రభుత్వ ఆదాయం కోల్పోతుందని ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడు..
ఈమె కమాన్పూర్ మండలం కల్వచెర్లకు చెందిన పద్మ.. ఏడేళ్ల క్రితం రహదారి ప్రమాదంలో భర్త మృతిచెందాడు. ఆపద్బంధు పథకంలో పరిహారం కోసం ఉమ్మడి జిల్లాతో పాటు ప్రస్తుత జిల్లాలో నాలుగుసార్లు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంది. కడు పేదరికంలో జీవిస్తోంది. ఈమె గోడును పట్టించుకునే వారే కరవయ్యారు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్