ధరణి పోర్టల్తో పూర్తి స్థాయి సంరక్షణ
రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2020లో ధరణి పోర్టల్ను తీసుకువచ్చిందని, ధరణి పోర్టల్తో రైతుల భూమికి పూర్తిస్థాయిలో సంరక్షణ ఉంటుందని జిల్లా కలెక్టర్ జి.రవి అన్నారు. కొడిమ్యాల మండల పరిషత్తు కార్యాలయంలో ధరణి పోర్టల్పై మండలంలోని ప్రజాప్రతినిధులు,...
కొడిమ్యాల: సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ రవి
కొడిమ్యాల, న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2020లో ధరణి పోర్టల్ను తీసుకువచ్చిందని, ధరణి పోర్టల్తో రైతుల భూమికి పూర్తిస్థాయిలో సంరక్షణ ఉంటుందని జిల్లా కలెక్టర్ జి.రవి అన్నారు. కొడిమ్యాల మండల పరిషత్తు కార్యాలయంలో ధరణి పోర్టల్పై మండలంలోని ప్రజాప్రతినిధులు, రైతులకు రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైన కలెక్టర్ రవి మాట్లాడుతూ రైతులకు ధరణి పోర్టల్పై అవగాహన లేకపోవడంతో తమ భూసమస్యల పరిష్కారానికై తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, అలాంటి రైతులకు ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించి సరైన మార్గంలో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ స్వర్ణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ధరణి పోర్టల్పై అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్ లత, ఆర్డీవో మాధురి, ఎంపీపీ మేనేని స్వర్ణలత, సర్పంచుల ఫోరం అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు, ఎంపీడీవో పద్మజ, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు సహకరించాలి
జగిత్యాల, న్యూస్టుడే: ప్రభుత్వ లక్ష్యసాధనలో బ్యాంకర్లు లక్ష్యాలను అధిగమించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోతు రవి బ్యాంకర్లను ఆదేశించారు. జిల్లాలోని బ్యాంకు రుణ లక్ష్యాలపై కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు రుణాలు ఎంతమేరకు ఇచ్చారు ఇంకా ఎంతపెండింగ్ ఉంది అనే అంశంపై మాట్లాడారు. జిల్లాలో ఎస్సీ సబ్ప్లాన్ కింద పెండింగ్లో ఉన్న 52 యూనిట్లను తక్షణమే గ్రౌండింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని వ్యవసాయ రుణాలకు సంబంధించి యాసంగిలో రూ.284 కోట్ల పంట రుణంకు గాను రూ.163 కోట్లు రుణాలిచ్చారని వీధి వ్యాపారులకు రూ. మొదటి విడతలో 11,320 మంది, రెండవ విడతలో 4000 మందికి రుణాలు మంజూరు చేశామన్నారు. మూడో విడత రుణాలకు సంబంధించి బ్యాంకులు అర్హులైన లబ్ధిదారులకు రుణాలందించాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ, లీడ్ బ్యాంకు మేనేజర్ పొన్న వెంకటరెడ్డి, ఆర్బీఐ ఎల్.డి.ఓ.కె. అనిల్కుమార్, నాబార్డు ఎజీఎం పి.అనంత్, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా రీజినల్ హెడ్ అరుణ్కుమార్, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ఫణి శ్రీనివాసులతోపాటు వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పత్తి రైతులు, వ్యాపారుల ఆందోళన
[ 23-04-2024]
ఎన్నికల కోడ్ పేరుతో తనిఖీలు నిర్వహించి బ్యాంకుల నుంచి డబ్బును తీసుకొస్తున్న తమను ఇబ్బందులకు గురి చేయవద్దని జమ్మికుంట పత్తి మార్కెట్ వద్ద వ్యాపారులు, పత్తి రైతులు ఆందోళనకు దిగారు. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
[ 23-04-2024]
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
పిల్లల అల్లరిని దారి మళ్లించండి
[ 23-04-2024]
పది నెలలపాటు చదువుతో కుస్తీ పడిన పిల్లలకు వేసవి సెలవులు ఉపశమనం ఇస్తాయి. ఆటాపాటలతో సరదాగా గడపొచ్చని భావిస్తుంటారు. -
మోదీ వ్యాఖ్యల్లో ఓటమి భయం
[ 23-04-2024]
లోక్సభ మొదటి దశ ఎన్నికల తీరును చూసిన ప్రధాని మోదీ ఓటమి భయంతో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తుందని వ్యాఖ్యానించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. -
నాలుగో రోజు 25 నామినేషన్లు
[ 23-04-2024]
నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు సోమవారం కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. -
హామీలను విస్మరించిన ప్రభుత్వం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని కరీంనగర్ భారాస అభ్యర్థి వినోద్కుమార్ అన్నారు. -
సెప్టెంబరులో చక్కెర కర్మాగారం తెరిపిస్తాం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా!
[ 23-04-2024]
ప్రాంతానికి కొత్త కావచ్చు, రాజకీయాలకు, ప్రజా సేవకు కొత్తకాదని, అవకాశమిస్తే పార్లమెంట్ పరిధిని అభివృద్ధి చేసి చూపిస్తానని నిజామాబాద్ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. -
దారులన్నీ కొండగట్టుకే
[ 23-04-2024]
తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి దీక్షాపరులు తరలివస్తున్నారు. -
ఓటరు నమోదులో ఫలించిన చైతన్యం
[ 23-04-2024]
ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కు నమోదుకు యువతలో నూతనోత్సాహం ఉరకలేసింది. -
ప్రత్యేక నిధులు.. తీరనున్న ఇక్కట్లు
[ 23-04-2024]
రామగుండం నగరపాలక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అమృత్-2.0, యు.ఐ.డి.ఎఫ్.(అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్) నిధులతో పరిష్కారం కానున్నాయి. -
కాంగ్రెస్ నైజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 23-04-2024]
భారాస పాలనలోనే అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకున్నారని, గడిచిన నాలుగు నెలల కాలంలో సంక్షేమ పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్ పాలకుల నైజాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పెద్దపల్లి లోక్సభ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. -
లెక్కలు తేలేనా?
[ 23-04-2024]
జిల్లా వస్త్ర పరిశ్రమకు గత ప్రభుత్వం సంక్షేమ, పాఠశాల విద్యాశాఖలకు సంబంధించిన వస్త్రోత్పత్తుల ఆర్డర్లు ఇచ్చింది. -
నిధులున్నా ప్రారంభం కాని పనులు
[ 23-04-2024]
గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగుపరిచి రెండు జిల్లాల గ్రామాలను అనుసంధానం చేయాలనే లక్ష్యంతో తారు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
అమాత్యులుగా ఆ నలుగురు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి లోక్సభా నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎంపీల్లో ఇప్పటివరకు నలుగురికి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM