పట్టణాభివృద్ధే ప్రధాన లక్ష్యం
పట్టణ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని పుర అధ్యక్షురాలు బోగ శ్రావణి అన్నారు. జగిత్యాల పురపాలక సాధారణ సమావేశం బుధవారం నిర్వహించారు.
జగిత్యాల బల్దియా సమావేశం
మాట్లాడుతున్న ఛైర్పర్సన్ శ్రావణి
జగిత్యాల పట్టణం, న్యూస్టుడే: పట్టణ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని పుర అధ్యక్షురాలు బోగ శ్రావణి అన్నారు. జగిత్యాల పురపాలక సాధారణ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ ఘాట్ల వద్ద బతుకమ్మ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు రూ.2.60 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పట్టణంలో విద్యుద్దీపాలంకకరణకు కూడా నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. మొత్తం ఎజెండాలోని 27 అంశాలు ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ గంగాధర్ పాల్గొన్నారు. అభివృద్ధి, మహనీయుల వర్ధంతి, జయంతి పేరిట బల్దియా అక్రమాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఫ్లోర్లీడర్ కల్లపల్లి దుర్గయ్య ఆరోపించారు. ఒక్కో కార్యక్రమానికి రూ.30 వేల వ్యయం పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని సభ దృష్టికి తెచ్చారు. డీజిల్ బిల్లుల పేరిట మళ్లీ దోపిడీకి తెరలేపారని జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమాలన్నింటిపైనా కలెక్టర్, అదనపు కలెక్టర్లు విచారణ చేపట్టాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు నక్క జీవన్, అసియా సుల్తానా, సహరాభాను, ఫర్హీన్సుల్తానా, ములస్తం లలితలు కోరారు.
24 అంశాలకు ఆమోదం
కోరుట్ల: పట్టణాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే విద్యాసాగర్రావు పేర్కొన్నారు. బుధవారం పురపాలక సంఘ సమావేశంలో ఛైర్పర్సన్ అన్నం లావణ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. 24 అంశాలకు కౌన్సిల్ సభ్యులు ఏకగీవ్రంగా అమోదం తెలిపారు. ఛైర్పర్సన్ మాట్లాడుతూ కోరుట్ల మున్సిపల్కు జాతీయస్థాయిలో రెండు అవార్డులు రావడం అదృష్టంగా భావిస్తుమన్నారు. ఈఅవార్డు రావడానికి కృషి చేసిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జాతీయ నాయకుల విగ్రహాలను కూడళ్లలో, డివైడర్ల మధ్యలో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు పాతబకాయిల చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే, ఛైర్పర్సన్, వైస్ఛైర్మన్లను పారిశుద్ధ్య కార్మికులు ఘనంగా సన్మానించారు. వైస్ఛైర్మన్ గడ్డమీది పవన్, కమిషనర్ అయాజ్, డీఈఈ అభినయ్, ఏసీపీ శ్రీనివాస్రావు, ఏఈ లక్ష్మి, మేనేజర్ శ్రీనివాస్, సానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్ తదితరులు పాల్గొన్నారు.
కోరుట్లలో పారిశుద్ధ్య కార్మికులకు పాతబకాయిల చెక్కులను అందజేస్తున్న దృశ్యం
భగీరథ పనులపై ఎమ్మెల్యే ఆగ్రహం
మెట్పల్లి పట్టణం: పట్టణంలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారని అధికారులపై ఎమ్మెల్యే విద్యాసాగర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుర అధ్యక్షురాలు రాణవేని సుజాత అధ్యక్షతన బుధవారం బల్దియా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఉద్యోగి అజెండాలోని 25 అంశాలను చదివి వినిపించగా కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించారు. సత్వరమే భగీరథ పనులను పూర్తి చేయాలని భగీరథ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ సమ్మయ్య, వైస్ ఛైర్మన్ చంద్రశేఖర్రావు, పుర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?