కళ మెచ్చేలా.. వీక్షకులకు నచ్చేలా..
వందలాది మంది కళాకారులు.. 20 రాష్ట్రాలకు చెందిన కార్యక్రమాలు.. కళల కాణాచిగా పేరొందిన తెలంగాణ ఖ్యాతిని నిలిపేలా.. ఉమ్మడి జిల్లాలోని ప్రతిభాధీరుల ప్రతిభను చాటేలా రేపటి నుంచి నిర్వహించే కళోత్సవాలకు కరీం‘నగరం’ ముస్తాబైంది.
కళోత్సవాలకు మైదానం ముస్తాబు
ఈనాడు, కరీంనగర్
ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి కమలాకర్, పక్కన అధికారులు
వందలాది మంది కళాకారులు.. 20 రాష్ట్రాలకు చెందిన కార్యక్రమాలు.. కళల కాణాచిగా పేరొందిన తెలంగాణ ఖ్యాతిని నిలిపేలా.. ఉమ్మడి జిల్లాలోని ప్రతిభాధీరుల ప్రతిభను చాటేలా రేపటి నుంచి నిర్వహించే కళోత్సవాలకు కరీం‘నగరం’ ముస్తాబైంది. తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మూడ్రోజులపాటు ముచ్చటైన వేడుకను నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను పూర్తిచేసింది. అంబేడ్కర్ మైదానంలో ఇందుకోసం అవసరమైన వేడుకను సిద్ధం చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు నగరానికి చేరుకున్నారు. ఇక్కడి ఏర్పాట్ల తీరుని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ సునీల్రావు, అదనపు డీసీపీ శ్రీనివాస్లు పర్యవేక్షించారు. మంత్రి గంగుల స్వయంగా రాసిన పాటను పాడారు. రికార్డింగు చేసిన పాటను వేదికపై వినిపించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించే ఈ వేడుకలు.. తెలంగాణ చరిత్రలోనే కరీంనగర్ కళోత్సవాలు ఒక మైలురాయిగా నిలుస్తాయన్నారు. సినీ కళాకారులతోపాటు గాయకులు, జానపద కళాకారులు దాదాపుగా 500 మంది పాల్గొంటారని తెలిపారు.
షెడ్యూల్ ఇలా...
* గురువారం సాయంత్రం 6 గంటలకు బాణాసంచా వెలుగులతోపాటు క్యాంప్పైర్ నిర్వహణ
* 30న సాయంత్రం 5 గంటలకు మంత్రి కేటీఆర్ వేడుకలను ప్రారంభించనున్నారు.
* ప్రతి రోజు సాయంత్రం 5 గంటలనుంచి రాత్రి 11 గంటల వరకు ప్రదర్శనలుంటాయి.
* 1వ తేదీన సర్కస్ మైదానం నుంచి వందలాది మంది కళాకారులతో ప్రదర్శన ర్యాలీ
* 2వ తేదీ కార్యక్రమ ముగింపు వేడుకల్లో బాణా సంచా వెలుగుల ప్రత్యేక ప్రదర్శన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూసేకరణలో జాప్యం
[ 28-03-2024]
భూసేకరణలో జాప్యమే జాతీయ రహదారుల విస్తరణకు శాపంగా మారుతోంది. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిగా మార్చి దశాబ్దం కావస్తున్నా.. నిర్మాణం మొదలు కావటం లేదు -
నత్తనడకన నిర్మాణాలు
[ 28-03-2024]
వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పల్లెదవాఖానాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర(సబ్సెంటర్ల)ను పల్లె దవాఖానాలుగా మార్చారు -
నిధులు వెచ్చించి.. పనులు వదిలేసి
[ 28-03-2024]
పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఆధునిక సాంకేతికను జోడించి పెద్ద నగరాలకు దీటుగా పోటీ పడేందుకు ప్రణాళికలు చేసిన నగరపాలిక.. ఆ విధానం అమలులో వెనుకబడింది -
తాగునీటి వృథా వద్దు : కలెక్టర్
[ 28-03-2024]
అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
కాంగ్రెస్ నిజామాబాద్ లోక్సభ స్థానం టికెట్ జీవన్రెడ్డికే దక్కింది. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది -
తొలిమెట్టు నోడల్ అధికారులకు భత్యం
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక బోధన పద్ధతులతో కొనసాగుతున్న ఈ కార్యక్రమ పర్యవేక్షణకు మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 28-03-2024]
వాతావరణ సమాచారాన్ని ప్రతిఒక్కరి దైనందిన కార్యకలాపాల్లో భాగం చేయాలనే ఉద్దేశంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇటీవల ‘పంచాయత్ మౌసం సేవా’ మొబైల్ యాప్ విడుదల చేసింది. -
పఠనాలయం సద్వినియోగం... కల సాకారం
[ 28-03-2024]
గ్రంథాలయ పుస్తకాలతోనే ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించగలిగాను. తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ నిర్వహించిన ఫలితాల్లో పీజీటీ సాంఘికశాస్త్రం, జూనియర్ కళాశాలలో పౌరశాస్త్రం లెక్చరర్గా ఉద్యోగాలకు ఎంపికయ్యాను -
పంచాయతీల ఖజానా ఖాళీ
[ 28-03-2024]
ఓవైపు ఖజానా ఖాళీ, మరోవైపు సమస్యలు పంచాయతీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జమయ్యే నిధులకు మించిన వ్యయం చేయడంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఓటు నమోదుకు ప్రత్యేక సాధారణ సెలవు
[ 28-03-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!