యువ నైపుణ్యం.. ఉపాధి సాకారం
గ్రామీణ నిరుపేద యువత ఆలోచన, అభిరుచికి అనుగుణంగా వ్యాపార రంగంలో ఉపాధి కల్పించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. స్థానికంగానే వ్యక్తిగతంగా, సమష్టిగా కుటీర పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన నైపుణ్యం అందిస్తున్నారు.
‘ఉన్నతి’ శిక్షణతో నిరుద్యోగులకు బాసట
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్
కొవ్వొత్తులు తయారు చేస్తున్న యువతులు
గ్రామీణ నిరుపేద యువత ఆలోచన, అభిరుచికి అనుగుణంగా వ్యాపార రంగంలో ఉపాధి కల్పించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. స్థానికంగానే వ్యక్తిగతంగా, సమష్టిగా కుటీర పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన నైపుణ్యం అందిస్తున్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో 100 పని దినాలు పూర్తి చేసిన కుటుంబాల్లోని యువతలో జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ‘ఉన్నతి’ పథకం పేరిట శిక్షణ ఇస్తున్నారు. ఈ పథకం కింద జిల్లాలోని 13 గ్రామీణ మండలాల్లో 2,946 మంది అర్హులున్నట్లు గుర్తించగా ఇప్పటివరకు విడతల వారీగా 266 మందికి వివిధ రంగాల్లో తర్ఫీదునిచ్చారు. జిల్లాల ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా ఈ ఏడాది శిక్షణ ఇవ్వడంతో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
మార్కెటింగ్లో మెలకువలు
* పేదల కుటుంబాల్లోని చాలా మంది యువత డిగ్రీ, ఐటీఐ తదితర చదువులు పూర్తి చేసినా సరైన మార్గదర్శకం లేక ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నారు. చిరు వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు స్థాపించాలనే ఉత్సాహం ఉన్నా నైపుణ్యం, అనుభవం లేక వెనుకాడుతున్నారు.
* జిల్లాలో 2018-19 ఆర్థిక సంవత్సరంలో ‘ఉన్నతి’ పథకానికి 18-40 ఏళ్లలోపు 2,946 మంది అర్హులు తేలారు. విద్యార్హత ఆధారంగా తాపీమేస్త్రీ, ఎలక్ట్రిషియన్, ప్లంబర్, శానిటేషన్ పనిలో నైపుణ్యం పెంచడంతో పాటు అగరుబత్తులు, కొవ్వొత్తులు, ల్యాండ్ సర్వేయర్, స్టోర్, కుట్టు శిక్షణ, కీపర్ తదితర రంగాల్లో పది రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు.
* పెద్దపల్లి మండలం రాఘవాపూర్లో జనపనార, శ్రీరాంపూర్, ఓదెల మండలాల్లోని వారికి కొవ్వొత్తుల తయారీ, మంథని, ముత్తారం మండలాల్లో వర్మీకంపోస్టు, కూరగాయల సాగు, అంతర్గాం, పాలకుర్తి మండలాలకు అగరుబత్లు తయారీపై తర్ఫీదునిచ్చారు.
మా కాళ్లపై మేం నిలబడతాం: కల్యాణి, పెద్దంపేట, అంతర్గాం మం.
ఏదైనా వ్యాపారం చేయాలన్న ఆలోచన ఉండేది. నైపుణ్యం లేక, మార్కెటింగ్ ఎలా చేయాలో తెలియక ముందుకెళ్లలేని పరిస్థితి. అగరుబత్తుల తయారీ, విక్రయంలో మెలకువలు నేర్చుకున్నాను. మా కాళ్లపై మేం నిలబడగలమన్న ధైర్యం వచ్చింది.
ఊరిలోనే ఉపాధి: సాయిప్రమోద్, మల్యాల, శ్రీరాంపూర్ మం.
ఐటీఐ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాను. కొవ్వొత్తు తయారీపై శిక్షణ పొందాను. పది రోజుల్లోనే ఉత్పత్తి, ముడి పదార్థాలపై అవగాహన పెంచుకున్నాను. వివిధ ఆకృతుల్లో ఆకర్షణీయంగా తయారు చేయడం నేర్చుకున్నాను. ఊరిలోనే ఉపాధి దొరుకుతోంది.
స్థానికంగానే ఆదాయ మార్గం: బండి కావ్య, పెద్దంపేట, శ్రీరాంపూర్ మం.
ఉపాధిహామీలో మా కుటుంబం వంద రోజులు పని పూర్తి చేయడంతో శిక్షణ పొందే అవకాశం వచ్చింది. నేను వ్యవసాయ పనులకు వెళ్తున్నాను. శిక్షణలో కొవ్వొత్తుల తయారీపై నేర్చుకున్నాను. ప్రస్తుతం ఎక్కడో తయారైన అగరుబత్తులను ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. కుటీర పరిశ్రమ ఏర్పాటుతో ఆదాయ మార్గం దొరికింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు