ప్రయాణికులకు ఉత్తమ సేవలు... ఉద్యోగులకు అవార్డులు
ఆధ్యాత్మిక క్షేత్రమైన వేములవాడలోని ఆర్టీసీ డిపోకు ముఖ్యంగా రాజన్న భక్తులతోపాటు ప్రయాణికుల వల్ల ఆదాయం సమకూరుతోంది. వేములవాడ డిపో అధికారులు ప్రయాణికులకు మంచి సేవలందించడంతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు.
లాభాల బాటలో ఆర్టీసీ వేములవాడ డిపో
న్యూస్టుడే, వేములవాడ
ఆధ్యాత్మిక క్షేత్రమైన వేములవాడలోని ఆర్టీసీ డిపోకు ముఖ్యంగా రాజన్న భక్తులతోపాటు ప్రయాణికుల వల్ల ఆదాయం సమకూరుతోంది. వేములవాడ డిపో అధికారులు ప్రయాణికులకు మంచి సేవలందించడంతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రయాణికులు ఎటుంటే అటువైపే బస్సులను నడిపిస్తూ వారి ఆదరణను పొందుతూ లాభాల బాటలో పయనిస్తోంది.
కరోనా తగ్గిన తరవాత ప్రయాణికుల కోసం ఆర్టీసీ అనేక రాయితీ పథకాలను అమలు చేసింది. శుభకార్యాలకు రాయితీతో ప్రజలకు బస్సు సౌకర్యం కల్పిస్తోంది. గర్భిణులు, డయాలసిస్, హెచ్ఐవీ రోగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. కార్గో ద్వారా వస్తువులను ఇంటికి చేర్చడం వంటివి చేపట్టడంతో ఆదరణ పెరుగుతూ వస్తోంది. కళాకారుల ద్వారా ఆర్టీసీ పథకాలపై విస్తృత ప్రచారం కల్పిస్తోంది. దీంతో కరీంనగర్ రీజియన్లోని 11 డిపోల్లో వేములవాడ డిపో అత్యుత్తమంగా సేవలందిస్తూ ఆదాయాన్ని పెంచుకుంటూ లాభాల బాటలో పయనిస్తోంది. వేములవాడ డిపోలో మొత్తం 66 బస్సులుండగా రోజూ రూ.9 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. శ్రావణ మాసంలో రోజుకు రూ.11.50 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఈ సీజన్లో డిపో బస్సులు 8.60 లక్షల కిలో మీటర్లు తిప్పడంతో కిలో మీటరుకు రూ.6.44ల చొప్పున రూ.55 లక్షలపైన లాభం ఆర్జించి రీజియన్లో వేములవాడ డిపో మొదటి స్థానంలో నిలిచింది.
ప్రత్యేక శిక్షణ తరగతులతో...
ఆర్టీసీలో ఇప్పటి వరకు కేవలం సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యోగులకు సూచనలు, సలహాలు అందించేవారు. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తరవాత అనేక సంస్కరణలకు రూపకల్పన చేసి అమలుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఫైనాన్సియల్ మేనేజ్మెంట్, ట్రెస్ మేనేజ్మెంట్, సంస్థ ఆర్థిక స్థితిగతులు, ప్రయాణికులతో వ్యవహరించాల్సిన తీరుపై ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతూనే ఆర్టీసీకి లాభాలు వచ్చే విధంగా సౌకర్యాలను మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్వహించిన ఆర్టీసీ ఉద్యోగుల శిక్షణ కార్యక్రమంలో వేములవాడ డిపో మేనేజరు భీమ్రెడ్డి పాల్గొని ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. దీంతో రాష్ట్ర స్థాయిలో డీఎం బెస్ట్ టీచింగ్ అవార్డు అందుకున్నారు. వంద రోజుల ఛాలెంజ్ కార్యక్రమంలో డిపో ఉద్యోగులు తమ ప్రతిభను చాటారు. ఆదాయం పెంచడంలో కీలక పాత్ర పోషించి ఉత్తమ అవార్డులను తీసుకున్నారు. డిపోకు చెందిన కండక్టర్ మొండయ్య, డ్రైవర్లు ఆంజనేయులు, శ్రీనివాస్, మెకానిక్లు శ్రీధర్, ఎం.ఎ.రవూఫ్, కమలాకర్, రామకృష్ణ ఏడీసీ (టైర్)లు ఉత్తమ అవార్డులు సొంతం చేసుకున్నారు. డిపోలో డీఎంతో పాటు మొత్తం 8 మంది హైదరాబాద్లోని ఆర్టీసీ భవన్లో జరిగిన కార్యక్రమంలో మంగళవారం ఆర్టీసీ ఎండీ చేతుల మీదుగా అవార్డులతో పాటు ప్రశంసలు అందుకున్నారు.
అవార్డు అందుకుంటున్న డీఎం భీమ్రెడ్డి
అందరి సహకారంతో లాభాలు : -భీమ్రెడ్డి, డిపో మేనేజరు, వేములవాడ
అందరి సహకారంతోనే డిపో లాభాల బాటలో నడుస్తోంది. ప్రస్తుతం ప్రజలు ఆర్టీసీని ఆదరించడంతోనే ఆదాయం బాగుంది. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సంస్థ అనేక రాయితీ పథకాలను ప్రవేశపెట్టింది. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఆర్టీసీ ఉద్యోగులకు అత్యుత్తమ శిక్షణ ఇవ్వడంతో ఉత్తమ అవార్డు లభించడం ఆనందంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న