కట్టారు... కళ్లు మూసుకున్నారు!
అంత్యక్రియలకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పల్లెల్లో సకల సౌకర్యాలతో వైకుంఠధామాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రెండు నమూనాల్లో 255 పంచాయతీల్లో సుమారు రూ.28 కోట్లతో పనులు చేపట్టారు.
అసంపూర్తి పనులతో ఆఖరి మజిలీకి అవస్థలు
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల
ముస్తాబాద్ మండలం ఆవునూరు వద్ద వాగులో మధ్యలో ఆగిన పనులు
అంత్యక్రియలకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పల్లెల్లో సకల సౌకర్యాలతో వైకుంఠధామాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రెండు నమూనాల్లో 255 పంచాయతీల్లో సుమారు రూ.28 కోట్లతో పనులు చేపట్టారు. వీటి నిర్మాణ బాధ్యతలను ఆయా పంచాయతీల ప్రజాప్రతినిధులకే అప్పగించారు. చాలా చోట్ల నిధులు సరిపోక అప్పులు చేసి మరీ నిర్మించారు. రూ.కోట్లు వెచ్చించి నిర్మించి వాటి వినియోగాన్ని పూర్తిగా విస్మరించారు. జిల్లా అధికారుల వద్ద మాత్రం వినియోగంలో ఉన్నట్లు చూపుతున్నా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. అసంపూర్తి పనులు, అరకొర వసతులతో నిర్వహణ లేక ఆఖరి మజిలీలో అవస్థలు తప్పడం లేదు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలుత 73 పంచాయతీలకు ఒక్కో నిర్మాణానికి రూ.10లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. నమూనాలో లోపాలు, కేటాయించిన నిధులు సరిపోక చాలా వరకు పనులు చేసేందుకు ముందుకు రాలేదు. తర్వాత 182 పంచాయతీల్లో ఒక్కో నిర్మాణానికి రూ.12.60 లక్షలు కేటాయించారు. పాత ప్రణాళికలోని వాటికి అదనంగా పంచాయతీ సాధారణ నిధులు కేటాయించారు. పనుల బాధ్యత ప్రజాప్రతినిధులకే అప్పగించారు. అయితే చాలా చోట్ల వీటిని చెరువు శిఖం, వాగుల్లో నిర్మించడంతో వర్షాలకు నీట మునగడం, గ్రామ శివారులోని ప్రభుత్వ భూముల్లో నిర్మించినా చాలా వాటికి రహదారి సౌకర్యం లేదు. కొన్ని చోట్ల పనులు నాసిరకంగా ఉండటంతో వర్షాలకు పగుళ్లు బారాయి. దీంతో ఎప్పటి మాదిరిగానే పంట పొలాలు, మరికొందరు ముంపు ప్రాంతం లేని చోట అంత్యక్రియలు నిర్వహించుకుంటున్నారు. స్నానాలు చేయడానికి, దుస్తులు మార్చుకోవడానికి మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం అన్ని పంచాయతీల్లో వందశాతం వైకుంఠ ధామాల నిర్మాణాలు పూర్తయ్యాయి. మానేరు, మూలవాగు సమీపంలోని గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, తంగళ్లపల్లి, వేములవాడ మండలాల పరిధిలోని పలు గ్రామాలు వాగు సమీపంలో నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడికి వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేక వర్షాకాలంలో వెళ్లలేని పరిస్థితి. మరికొన్నింటికి వసతి గదులు లేవు. వాగులు పొంగిపొర్లితే చాలా రోజుల పాటు అటువైపు వెళ్లలేరు. మెజారిటీ గ్రామాల్లో ఇప్పటికీ చెరువు శిఖం, వాగు ఒడ్డున, పొలం గట్లు, తమ సొంత పంట క్షేత్రాల్లో ఆఖరి మజిలీ కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. నీటి వసతి లేని చోట పంచాయతీ ట్రాక్టర్లు ఉపయోగిస్తున్నారు. అందుబాటులో లేకుంటే వ్యవసాయ బోరుబావులే దిక్కు. కార్యక్రమం తర్వాత స్నానం చేసేందుకు మహిళలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 94 వైకుంఠధామాల్లో విద్యుత్తు సౌకర్యం లేదు. దీనికి కోసం సెస్కు విద్యుత్తు వరుసలను అమర్చేందుకు రూ.4 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశారు. డబ్బులు చెల్లిస్తే పనులు చేస్తామని సెస్ అధికారులు చెబుతున్నారు.
వీర్నపల్లి మండలం బావుసింగ్నాయక్తండాలో రహదారి లేక నిరుపయోగంగా మారిన దృశ్యం
కొరవడిన ప్రణాళిక
వైకుంఠధామాల నిర్మాణాల్లో ప్రణాళికలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చెరువు శిఖం, వాగులు, వరద ప్రవాహాలు ఉన్నచోట నిర్మాణాలు చేపట్టరాదు. వీటికి జలవనరులశాఖ నుంచి అనుమతులు పొందలేదు. ఇవేవీ పరిశీలించకుండానే ఇంజినీరింగ్శాఖ బిల్లులు మంజూరు చేసింది. కొన్ని చోట్ల రెవెన్యూ అధికారులు ఎక్కడ స్థలాలు చూపిస్తే అక్కడ నిర్మించారు. ముంపు ప్రాంతం, దారి సౌకర్యం వంటికి పట్టించుకోలేదు. నిర్మాణాలు చేసే సమయంలోలైనా సంబంధిత ఇంజినీరింగ్ అధికారులూ ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామాలు నిరుపయోగంగా మారాయని గ్రామస్థులు వాపోతున్నారు.
రహదారి లేక ఇబ్బందులు : -దాసరి గణేష్, రాచర్ల గొల్లపల్లి, ఎల్లారెడ్డిపేట మండలం
గంగమ్మ ఆలయం వద్ద రహదారిపై వంతెన నిర్మాణంతో వైకుంఠధామానికి వెళ్లలేని పరిస్థితి ఉంది. ఒకవైపు దారిలేదు. మరోవైపు నుంచి వెళదామంటే మానేరువాగు ఉంది. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన వైకుంఠ ధామానికి దారి లేక నిరుపయోగంగా మారింది. వర్షాలు ఎక్కువగా కురిసినపుడు అంత్యక్రియలకు ఇబ్బందిగా మారుతుంది. అధికారులు స్పందించి కొత్తగా నిర్మించిన వంతెన నుంచి రహదారి ఏర్పాటు చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
[ 19-04-2024]
కమాన్పూర్ మండలం రొంపికుంట ఉపకేంద్రం పరిధిలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ట్రాన్స్ కో ఏఈ రాజేంద్ర కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు