మట్టి యంత్రం.. ఉపాధి మంత్రం
‘అత్యధిక ఎర్త్మూవర్స్(పొక్లెయిన్లు) కలిగిన గ్రామంగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రాఘవపేట నిలుస్తుంది. గతంలో ఉపాధి కరవై గల్ఫ్ బాట పట్టిన వారితో పాటు డిగ్రీ పట్టాలను పక్కన పెట్టిన యువత పొక్లెయిన్లతో ఉపాధి మార్గాన్ని ఎంచుకుంది.
రాఘవపేట గ్రామం
న్యూస్టుడే, మల్లాపూర్: ‘అత్యధిక ఎర్త్మూవర్స్(పొక్లెయిన్లు) కలిగిన గ్రామంగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రాఘవపేట నిలుస్తుంది. గతంలో ఉపాధి కరవై గల్ఫ్ బాట పట్టిన వారితో పాటు డిగ్రీ పట్టాలను పక్కన పెట్టిన యువత పొక్లెయిన్లతో ఉపాధి మార్గాన్ని ఎంచుకుంది. రాష్ట్రంలోని పది జిల్లాలతో పాటు దేశంలోని ఆరు రాష్ట్రాల్లో చేపట్టే తవ్వకాలకు సంబంధించిన పనులకు ఇక్కడ యంత్రాలను పంపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వంటి భారీ ప్రాజెక్టులతో పాటు క్వారీల్లో రాళ్లను తొలగించడం, ప్రైవేటుగా పలు రకాల పనులు సాగుతుండటం వీరికి వరంగా మారింది. ప్రస్తుతం గ్రామంలో 96 ఎర్త్మూవర్స్ ఉన్నాయి.
ఆరు రాష్ట్రాల్లో పనులు
రాష్ట్రంతో పాటు సమీప రాష్ట్రాల్లో ఎర్త్మూవర్స్తో పనులు ఆధికంగా ఉండటంతో రాఘవపేట యువకులు ముందుగా ఎంచుకున్న ప్రాంతానికి యంత్రాలను చేరవేసి పనులు చేస్తుంటారు. రాఘవపేటకు చెందిన యంత్రాలను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్ఘడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను ఇక్కడి యంత్రాలతో చేపడుతున్నారు. నూతన రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పనులు ఎక్కువ కావడంతో ఒక్కొక్కరు రెండు నుంచి మూడు యంత్రాలను కొనుగోలు చేసి నడిపిస్తున్నారు.
గల్ఫ్ బాట వీడి
గతంలో గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు తిరిగి స్వగ్రామానికి చేరుకుని పొక్లెయిన్లను కొనుగోలు చేసి జీవనోపాధి పొందుతున్నారు. ఉపాధి కోసం ఉన్న ఊరును, కన్నవారిని వదిలి గల్ఫ్ దేశాలకు వెళ్లడంకన్నా కుటుంబ సభ్యులతో కలిసి ఉంటూ వ్యాపారం చేసుకోవడం ఎంతో బాగుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామం కాస్త పట్టణ ప్రాంతంగా రూపాంతరం చెందుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకా.. వెంకటస్వామికి ఆ పేరెలా వచ్చింది?
[ 24-04-2024]
కాంగ్రెస్ పార్టీ దివంగత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి ‘కాకా’గానే ఎక్కువ మందికి సుపరిచితులు. ఆయనకు ఈ పేరు రావడం వెనుక ఆసక్తికర అంశం ఉంది. -
యాప్ కష్టాలు
[ 24-04-2024]
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన యాప్ల్లో సమాచారం నిక్షిప్తం చేయాల్సి ఉంది. -
నిర్వహణ భారం.. కమీషన్లో కోత
[ 24-04-2024]
కేంద్రాల నిర్వహణ భారంగా మారగా.. వచ్చిన కమీషన్లో కోత విధించడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. -
ఇక ట్వంటీ20 పోరు!
[ 24-04-2024]
పోలింగ్ తేదీకి బుధవారం నుంచి సరిగ్గా ఇరవై రోజులుంది.. అచ్చంగా ట్వంటీ20 క్రికెట్ ఆటలోని 20 ఓవర్ల మాదిరి సమరం. -
మిగిలింది రెండు రోజులే!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలి అంకం రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల స్వీకరణ పూర్తవనుంది. -
నకిలీ పత్రాలు సృష్టించి.. ఇల్లు ధ్వంసం
[ 24-04-2024]
నకిలీ పత్రాలు సృష్టించి, ఇంటిని ధ్వంసం చేసి, దాడికి పాల్పడిన అయిదుగురిని కరీంనగర్ కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. -
పార్టీ పెద్దల సమ్మతితోనే రాజేందర్ నామినేషన్
[ 24-04-2024]
పార్టీ పెద్దల సమ్మతితోనే తామంతా కలిసి కాంగ్రెస్ తరఫున వెలిచాల రాజేందర్రావుతో నామినేషన్ వేయించామని, గెలిపిం చుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. -
అతివల ఉపాధికి ఆదరువేదీ!
[ 24-04-2024]
రాష్ట్రంలో 6 లక్షల మంది బీడీ కార్మికులుండగా అత్యధికంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నారు. -
ఆ పది మందికే 50 శాతం ఓటర్ల మద్దతు
[ 24-04-2024]
ఎన్నికల్లో ప్రత్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా విజయం సాధించినట్లే. అయితే గెలుపొందిన అభ్యర్థికి నియోజకవర్గంలోని ఎంత మంది ఓటర్ల మద్దతు ఉందనేది పోటీలో ఉన్న అభ్యర్థులు, నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి మారుతుంది. -
ఆయుధాలు అప్పగించారు..
[ 24-04-2024]
వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. -
మాతాశిశుకు తప్పని ఉక్కపోత
[ 24-04-2024]
చంటి బిడ్డలు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వేసవి ఉక్కపోత తప్పడం లేదు. -
బ్యాలెట్ యుద్ధానికి చకచకా సన్నద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. -
పనులకు ఆటంకాలు.. రాకపోకలకు అవస్థలు
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. -
తైబజార్... చిరు వ్యాపారుల బేజార్
[ 24-04-2024]
పురపాలక సంఘంలో తైబజార్ గుత్తేదారు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం