తక్కువ సైజు.. అక్రమాలే రివాజు
ఈ రెండు ఉదాహరణలు సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో అక్రమాలను వెల్లడిస్తున్నాయి. నీటి వనరుల్లో పెంపకానికి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం ప్రహసనంగా మారింది. టెండరు ప్రక్రియ మొదలు పిల్లల పంపిణీ వరకు అడుగడుగునా అక్రమాలు జరుగుతున్నాయి.
ప్రహసనంగా చేప పిల్లల పంపిణీ ప్రక్రియ
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్, కరీంనగర్ పట్టణం
జూలపల్లిలో చెరువులో చేప పిల్లలు వదులుతున్న ప్రజాప్రతినిధులు(పాతచిత్రం)
* పెద్దపల్లి జిల్లాలో ఈ ఏడాది టెండర్లలో పాల్గొన్న గుత్తేదారు తప్పుడు ధ్రువపత్రాలు, నకిలీ బ్యాంకు డాక్యుమెంట్లు సమర్పించినట్లు అధికారుల విచారణలో తేలింది. దీంతో టెండరు రద్దు చేసి మరొకరికి కట్టబెట్టారు.
* జగిత్యాల జిల్లాలో ఈ ఏడాది 711 చెరువులు, కుంటల్లో 1.56 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేస్తున్నారు. ఇక్కడి ‘జలపుష్ప ఫిష్ సీడ్ హేచింగ్ కంపెనీ’ తెచ్చిన 3.68 లక్షల చేప పిల్లలు నాసిరకంగా ఉన్నాయని మత్స్యశాఖ అధికారులు తిరస్కరించారు.
ఈ రెండు ఉదాహరణలు సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో అక్రమాలను వెల్లడిస్తున్నాయి. నీటి వనరుల్లో పెంపకానికి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం ప్రహసనంగా మారింది. టెండరు ప్రక్రియ మొదలు పిల్లల పంపిణీ వరకు అడుగడుగునా అక్రమాలు జరుగుతున్నాయి. నాణ్యత లేని పిల్లలు సరఫరా చేశారని ఆ శాఖ అంతర్గత తనిఖీలోనే తేలడం గుత్తేదారుల తీరును తేటతెల్లం చేస్తోంది. పథకం అమలుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో చేప పిల్లల పంపిణీ తీరుపై ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం.
మూడేళ్లుగా అనర్హులకు టెండర్లు దక్కడం పరిపాటిగా మారింది. టెండర్లలో పాల్గొన్న వారు నకిలీ పత్రాలు, బ్యాంకు లీకేజీలు సమర్పించినట్లు అధికారుల పరిశీలనలో తేలుతోంది. దీంతో వాటిని రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవడం, పంపిణీ తదితర ప్రక్రియతో ఏటా జాప్యం జరుగుతోంది. కొందరు గుత్తేదారులకు పిల్లల పంపిణీలో అనుభవం లేకున్నా, నకిలీ బ్యాంకు లింకేజీలతో విత్తన చేపలను నిర్వహిస్తున్నామని చెబుతూ టెండర్లలో పాల్గొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
3,066 వనరులు.. 6.68 కోట్లు
ఉమ్మడి జిల్లాలోని 3,066 వనరుల్లో చేప పిల్లల పెంపకం లక్ష్యం 6.68 కోట్లుగా పెట్టుకున్నారు. భారీ జలాశయాలైన సుందిళ్ల బ్యారేజీ, శ్రీపాద ఎల్లంపల్లి, మధ్యమానేరు, దిగువ, ఎగువ మానేరు జలాశయాల్లో ఎద్దఎత్తున రొయ్యల పెంపకం సాగుతోంది. పెద్ద పరిమాణంలో ఉంటే ఒక్క దానికి రూ.1.85, చిన్న పరిమాణంలోని వాటికి రూ.1.20 చొప్పున బొచ్చ, రోహు, బంగారుతీగ చేప పిల్లలకు వెచ్చించి ఇష్టారాజ్యంగా వదిలేసి చేతులు దులుపుకుంటున్నారు.
లెక్క తప్పుతోంది..
* ప్రతి సీజన్లో చేప పిల్లల పరిమాణం, మోతాదు విషయంలో కచ్చితమైన ప్రమాణాలు పాటించడం లేదు. పెద్ద సైజు(80-100 మి.మీ.లు) పిల్లలను కిలో చొప్పున, చిన్న సైజు(35-40 మి.మీ.లు) పిల్లలను పాలిథీన్ కవర్లలో 10 వేల పిల్లల చొప్పున నీటితో నిల్వ చేసి చెరువుల్లో వదులుతున్నారు.
* కవర్లలో వేసే చేప పిల్లల లెక్క తప్పుతోంది. ప్రతి కవరులో కనీసం 100 కంటే ఎక్కువగానే తగ్గుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. పరిమాణం తక్కువగా ఉండటంతో ఎదుగుదల క్షీణించి కొన్ని చిన్న పిల్లలు చెరువుల్లోనే చనిపోతున్నాయి.
* వర్షాల ఆరంభంలో అంటే జూన్లోనే పిల్లలను వదలాలని మత్స్యకారులు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ఏటా సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో వేస్తుండటంతో వేసవిలో దిగుబడి రావడం లేదు. చెరువుల్లో నీరు అడుగంటుతుండటంతో ఎదుగుదలపై ప్రభావం చూపుతోంది.
అదనులో వేయక తగ్గుతున్న దిగుబడి
కరీంనగర్లో పంపిణీకి వచ్చిన చిన్న పరిమాణంలోని చేప పిల్లలు
* కరీంనగర్ జిల్లాలో ఈ ఏడాది పంపిణీ లక్ష్యం 2.29 కోట్లు. ఇక్కడి జలాశయాల్లో ఉత్పత్తి అయిన పిల్లలను జిల్లా అవసరాలు పోగా ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. పెద్ద పరిమాణంలోని చేపలు కోల్కతాకు ఎగుమతి అవుతున్నాయి. అదనులో పిల్లలను వేయకపోవడంతో దిగుబడి తగ్గుతోందన్న విమర్శలున్నాయి.
* రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఎగువ మానేరు సమీపంలో 25 ఎకరాల్లో జాతీయ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ఉంది. ఇక్కడ కోటికి పైగా ఉత్పత్తి సామర్థ్యం ఉంది. సిబ్బంది కొరత, ఇతర కారణాలతో కేంద్రం నిర్వహణకు నోచుకోవడం లేదు. గంభీరావుపేట మండలం నర్మాలలో విత్తన చేప పిల్లలను ఉత్పత్తి చేసి ఈ ఏడాది 35 లక్షలు పంపిణీ చేస్తున్నారు.
* జగిత్యాల జిల్లాలో ఈ ఏడాది 711 చెరువులు, కుంటల్లో 1.56 కోట్ల పిల్లల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. ఏటా చిన్న పరిమాణం కలిగిన పిల్లలు పంపిణీ చేస్తుండటంతో దిగుబడి తగ్గుతోంది. అర కిలో కంటే ఎక్కువ పరిమాణం రావడం లేదని ఆందోళన చెందుతున్నారు.
అవకతవకలకు తావు లేకుండా చర్యలు
-దేవేందర్, మత్స్య శాఖ అధికారి, కరీంనగర్
చేప పిల్లల పంపిణీలో పారదర్శకత పాటిస్తున్నాం. అవకతవకలకు తావు లేకుండా పర్యవేక్షిస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో ఉత్పత్తి చేసిన చేపలను జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు గుత్తేదారుల ఒప్పందం ప్రకారం సరఫరా చేస్తున్నాం. నాణ్యమైన, రుచికరమైన చేపల ఉత్పత్తి జరుగుతుండటంతో కోల్కతాకు ఎగుమతి చేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండో రోజు నలుగురు నామినేషన్
[ 20-04-2024]
కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ స్థానాలకు రెండో రోజు శుక్రవారం కేవలం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్ స్థానం కోసం భాజపా అభ్యర్థి బండి సంజయ్ తరఫున ఆ పార్టీ నాయకులు ఎన్నికల అధికారికి నామపత్రాలను అందజేశారు. -
ఆర్ఎం కార్యాలయానికి ఆరుగురు ఉద్యోగుల సరెండర్
[ 20-04-2024]
హుజూరాబాద్ ఆర్టీసీ డిపోనకు చెందిన ఆరుగురు ఉద్యోగులను కరీంనగర్ ఆర్ఎం కార్యాలయానికి సరెండర్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్థానిక డిపోలో పనిచేసే డ్రైవర్ రవీందర్ వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ డిపో మేనేజర్ శ్రీకాంత్ ఈ నెల 15న అనిశా అధికారులకు చిక్కిన విషయం విదితమే. -
ఉక్కపోతతో తల్లీబిడ్డల ఉక్కిరిబిక్కిరి
[ 20-04-2024]
భానుడి భగభగలకు ఉదయం 9 గంటలు దాటితే ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం భయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎండలు 40 డిగ్రీల కంటే అధికంగానే ఉంటున్నాయి. -
కాంగ్రెస్ నేతలకు మానసిక చికిత్స అవసరం
[ 20-04-2024]
కాంగ్రెస్ నేతలకు మానసిక చికిత్స అవసరమని హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు అన్నారు. వారికి చికిత్స అందేలా చూడాలని శుక్రవారం కరీంనగర్లో ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కి వినతిపత్రం అందజేశారు. -
గంగుల, బండిల స్నేహం అందరికీ తెలుసు
[ 20-04-2024]
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ల మధ్య స్నేహం అందరికీ తెలుసునని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను ఓడించేందుకు గంగుల కమలాకర్ భాజపాతో కుమ్మకైనట్లు ఆరోపించారు. -
వారసత్వ సంపద పరిరక్షణకు ఓటేద్దాం
[ 20-04-2024]
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటేనే ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు, వారసత్వ కట్టడాలకు పెట్టింది పేరు. శాతవాహనులు, కాకతీయులు, నిజాముల కాలంలో నిర్మించిన కోటలు, మెట్ల బావులు, ఆలయాలు ఇక్కడ కనిపిస్తాయి. -
ఇదీ అన్నదాత ఎజెండా!
[ 20-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం వ్యవసాయపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. భిన్న వ్యవసాయ ఉత్పత్తులతో రాష్ట్రంలోనే ప్రత్యేకత చాటుకుంటోంది. దేశ విదేశాలకు ఎగుమతి చేసే పసుపు, మామిడి, మొక్కజొన్న, సన్న వరి, చెరకు, ఆవాలు, ఎర్రజొన్న, తెల్లజొన్న, సజ్జ తదితర పంటల దిగుబడిలో ఆదర్శంగా నిలుస్తున్నా అన్నదాతను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. -
ఒక ఎంపీ.. అయిదు జిల్లాలు
[ 20-04-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు గతంలో ఒకే జిల్లా పరిధిలో ఉండేవి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జిల్లాల పునర్విభజనతో ఎంపీ స్థానం అయిదు జిల్లాలకు విస్తరించింది. -
నీటి తొట్టిలో పడి బాలుడి మృతి
[ 20-04-2024]
ఇటుక బట్టీ వద్ద నీటి తొట్టిలో పడి ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. కుటుంబసభ్యులు పోలీసుల కథనం ప్రకారం.. -
శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోండి
[ 20-04-2024]
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కేజీబీవీల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థినులకు కరీంనగర్ కేజీబీవీలో నిర్వహిస్తున్న ఎప్సెట్ శిక్షణ తరగతులను సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు అధికారి మల్లయ్య భట్టు శుక్రవారం సందర్శించారు. -
కరీంనగర్లో రూ.15.81 లక్షల పట్టివేత
[ 20-04-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా శుక్రవారం పోలీసులు కరీంనగర్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రూ.15.81 లక్షల నగదును పట్టుకున్నట్లు కమిషనర్ కార్యాలయం తెలిపింది. -
ఇంటి నుంచే ఓటింగ్పై అధికారులకు శిక్షణ
[ 20-04-2024]
ఇంటినుంచే ఓటింగ్పై పాటించాల్సిన నిబంధనలపై అధికారులకు మంథని శాసనసభ సెగ్మెంట్ అధికారి హనుమనాయక్ అవగాహన కల్పించారు. శుక్రవారం మంథని ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులకు శిక్షణ ఇచ్చారు. -
అడుగడుగునా తనిఖీలతో ప్రలోభాలకు అడ్డుకట్ట
[ 20-04-2024]
ఎన్నికల్లో డబ్బు, మద్యం, మాదకద్రవ్యాల పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. లోక్సభ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో జిల్లా సరిహద్దు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
పెరుగుతున్న పసిడి ధరలు... తగ్గుతున్న వ్యాపారం
[ 20-04-2024]
బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకి వెళుతున్నాయి. గతంలో పెళ్లి ముహూర్తాల సమయంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టేవి. దీనికి భిన్నంగా మార్కెట్లో ప్రస్తుతం పసిడి ధర పది గ్రాములు(తులం) రూ.76,000 వరకు పలుకుతోంది. -
కిట్టు సరే.. పరీక్ష చేసేవారేరీ?
[ 20-04-2024]
కలుషిత నీటితో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో ప్రజలకు శుద్ధ జలం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అక్కడక్కడ పైపులు పగిలి లీకేజీతో కలుషితమైన నీరు సరఫరా అయ్యే అవకాశం ఉంది. -
ఆరేళ్లుగా ఉపాధి కరవు
[ 20-04-2024]
వలసల నివారణకు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల కోసం ఆరేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఆ కుటుంబాలకు పనులు కల్పించడం లేదు. -
ప్రజలు మళ్లీ మోసపోవద్దు
[ 20-04-2024]
భాజపా అభ్యర్థి అర్వింద్ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. పొద్దునలేస్తే హిందూ-ముస్లిం, పాకిస్థాన్-ఇండియా, రోహింగ్యాంటూ మాటలు చెప్పడమే గాని ఎంపీగా ప్రజలకు చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. -
‘పసుపు బోర్డు పేరుతో మోసం’
[ 20-04-2024]
పసుపు బోర్డు పేరుతో ఎంపీ ధర్మపురి అర్వింద్ రైతులను మోసం చేశారని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు కూడా మభ్యపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.